fire: స్కూలు బస్సులో మంటలు... చిన్నారులను కాపాడిన డ్రైవర్


మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెల్మకన్నె శివారులో ఈ రోజు ఉద‌యం ఘోర ప్ర‌మాదం త‌ప్పింది. విద్యార్థుల‌ను ఇంటి నుంచి పాఠ‌శాలకు తీసుకెళుతున్న ఓ ప్రైవేటు పాఠశాల బస్సులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన బ‌స్సు డ్రైవర్ వెంట‌నే అప్రమత్తమై చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో విద్యార్థులకు ప్రాణాపాయం త‌ప్పింది. స‌ద‌రు డ్రైవ‌ర్‌ విద్యార్థులను సురక్షితంగా కిందకు దించడంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమయంలో ఆ పాఠ‌శాల బ‌స్సులో మొత్తం 15 మంది విద్యార్థులు ఉన్నారు.

  • Loading...

More Telugu News