venkaiah: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో కుటుంబ నాట‌కం నడుస్తోంది!: వెంక‌య్య నాయుడు


ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో కుటుంబ నాట‌కం జ‌రుగుతోందని కేంద్ర‌మంత్రి వెంక‌య్య నాయుడు వ్యాఖ్యానించారు. స‌మాజ్‌వాదీ పార్టీలో జ‌రుగుతున్న ఈ కుటుంబ డ్రామా కామెడీగా ఉంద‌ని, కొన్ని సార్లు మెలోడీగా అనిపిస్తోంద‌ని ఎద్దేవా చేశారు. కానీ, చివ‌రికి ఓ విషాదంగా ముగుస్తుంద‌ని జోస్యం చెప్పారు. ఈ రోజు ఢిల్లీలో జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ సమాజ్‌వాదీ పార్టీలో ముదిరిన సంక్షోభంపై స్పందించారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు స‌మాజ్‌వాదీ ప్ర‌భుత్వం ప‌ట్ల అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నార‌ని అన్నారు. మ‌రోవైపు బీఎస్పీ ప‌ట్ల కూడా ప్ర‌జ‌లు విసిగిపోయి ఉన్నార‌ని అన్నారు. రానున్న ఎన్నిక‌ల్లో ఆ రాష్ట్రంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తోంద‌ని చెప్పారు. అక్క‌డి ప్ర‌జ‌లు త‌మ పార్టీ వైపుకు మ‌ళ్లేందుకు ఇప్ప‌టికే నిర్ణ‌యించుకున్నార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.  

నల్లధనం నివారణ చర్యల్లో పెద్దనోట్ల రద్దు ఒకటి మాత్రమేన‌ని వెంక‌య్య నాయుడు అన్నారు. న‌ల్ల‌ధ‌నం నియంత్ర‌ణ‌కు ముందు ముందు మ‌రిన్ని చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌తిప‌క్షాలు రోజుకోమాట మారుస్తూ మాట్లాడుతున్నాయని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అనేక ఏళ్లుగా పేద‌ల‌కు అన్యాయం చేస్తూ వ‌చ్చిందని చెప్పారు. పెద్ద‌ల‌కు మూట‌లు, పేద‌ల‌కు మాట‌లను కాంగ్రెస్ ఇచ్చిందని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News