darmana: రైతులు క‌న్నీరు పెడుతుంటే ప్రభుత్వం సంబరాలు చేసుకుంటోంది!: రైతు దీక్ష చేపట్టిన ధర్మాన


ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రైతులు ఎన్నో ఇబ్బందులు ప‌డుతూ క‌న్నీరు పెడుతుంటే, చంద్ర‌బాబు ప్రభుత్వం మాత్రం సంబరాలు చేసుకుంటోంద‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. రైతుల స‌మ‌స్య‌లను ప‌రిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఉదయం శ్రీకాకుళం పట్టణంలో ఆయ‌న రైతు దీక్షను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ రైతుల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం క‌న‌బ‌రుస్తున్న వైఖ‌రి దారుణమని విమర్శించారు. రైతులకు న్యాయం జరిగేవరకూ వైసీపీ పోరాడుతూనే ఉంటుందని అన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం రైతుల సమస్యలు పట్టించుకోవడం లేద‌ని ఆరోపించారు.

  • Loading...

More Telugu News