gst: ముగిసిన జీఎస్టీ కౌన్సిల్ ఏడో స‌మావేశం.. వివ‌రాలు తెలిపిన అరుణ్‌జైట్లీ


న్యూఢిల్లీలో ఈ రోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ఆధ్వ‌ర్యంలో జీఎస్టీ కౌన్సిల్ ఏడో స‌మావేశం జ‌రిగింది. అనంత‌రం మీడియాతో మాట్లాడిన అరుణ్‌జైట్లీ స‌మావేశంలో తీసుకున్న నిర్ణ‌యాల‌ను వివరించారు. సీజీఎస్టీ, ఎస్‌జీఎస్టీ ప్రైమ‌రీ డ్రాఫ్ట్స్ కౌన్సిల్ స‌భ్యుల ఆమోదం పొందాయ‌ని అన్నారు. అయితే, వాటిలో కొన్ని మార్పులు చేయాల్సి వ‌చ్చింద‌ని చెప్పారు. ప‌లు అంశాలను, స‌మ‌స్య‌ల‌ను ఇంకా చ‌ర్చించాల్సి ఉంద‌ని చెప్పారు. డ్యుయ‌ల్ కంట్రోల్‌, క్రాస్ ఎంప‌వ‌ర్‌మెంట్ వంటి స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై మ‌రిన్ని సూచ‌న‌లు తీసుకోవాల్సి ఉంద‌ని అన్నారు. మళ్లీ జీఎస్టీ కౌన్సిల్ వ‌చ్చే నెల 3, 4 వ తేదీల్లో స‌మావేశం అవుతుంద‌ని చెప్పారు.

gst
  • Loading...

More Telugu News