airport: విమానాశ్రయంలో ప్రయాణికుడి నుంచి 218 మొబైల్ ఫోన్లు స్వాధీనం


ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టులో సాధార‌ణ తనిఖీల్లో భాగంగా సోదాలు నిర్వ‌హిస్తోన్న అధికారులు ఈ రోజు 27 ఏళ్ల ఓ యువ‌కుడి నుంచి పలు విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వాటిల్లో 218 మొబైల్ ఫోన్లు ఉన్నాయి. స‌ద‌రు యువ‌కుడి నుంచి స్వాధీనం చేసుకున్న వ‌స్తువుల విలువ అంతా క‌లిపి దాదాపు 20 లక్షల రూపాయ‌లు ఉంటుందని అధికారులు మీడియాకు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ వ‌స్తువుల గురించి ఆరా తీస్తున్నారు.

  • Loading...

More Telugu News