demonitisation: కేర‌ళ‌లో భారీగా విదేశీ క‌రెన్సీ స్వాధీనం


దేశ‌వ్యాప్తంగా త‌నిఖీలు నిర్వ‌హిస్తోన్న అధికారులు ప‌లువురు న‌ల్ల‌కుబేరుల వ‌ద్ద‌ భారీగా ర‌ద్దైన నోట్ల‌తో పాటు కొత్తనోట్లు స్వాధీనం చేసుకుంటున్న విష‌యం తెలిసిందే. అయితే, ఈ రోజు ఉద‌యం కేర‌ళ‌లోని కాలిక‌ట్ విమానాశ్ర‌యంలో సాధార‌ణ త‌నిఖీల్లో భాగంగా సోదాలు నిర్వ‌హిస్తోన్న సీఐఎస్ఎఫ్‌ అధికారులు ఓ ప్ర‌యాణికుడి నుంచి ఈ రోజు ఉద‌యం భారీగా విదేశీ క‌రెన్సీ స్వాధీనం చేసుకున్నారు. సుమారు 1.17 కోట్ల రూపాయ‌ల విలువ చేసే విదేశీ క‌రెన్సీని స్వాధీనం చేసుకున్న‌ట్లు అధికారులు మీడియాకు తెలిపారు. ఇంత పెద్ద మొత్తాన్ని ప్ర‌యాణికుడు ఎందుకు తెచ్చుకున్నాడ‌నే అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు.

  • Loading...

More Telugu News