rettor attack: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల క‌లక‌లం... సైన్యంపై దాడి.. కొన‌సాగుతున్న గాలింపు


జమ్ముకశ్మీర్‌లో ఈ రోజు మ‌ధ్యాహ్నం మ‌రోసారి ఉగ్రవాదుల క‌లక‌లం చెల‌రేగింది. రాష్ట్రంలోని పుల్వామా జిల్లా పాంపోర్‌లో జాతీయ‌ర‌హ‌దారిపైకి దూసుకొచ్చిన ఉగ్ర‌వాదులు అక్క‌డ నుంచి వెళుతున్న ఆర్మీ కాన్వాయ్‌పై  కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. ఈ ఘటనపై వెంట‌నే తేరుకున్న సైన్యం వారి దాడిని తిప్పికొట్టే ప్ర‌య‌త్నం చేయ‌డంతో వారు అక్క‌డి నుంచి ప‌రార‌య్యారు. ఉగ్ర‌వాదుల కోసం భ‌ద్ర‌తా బ‌ల‌గాలు సెర్చ్ ఆప‌రేష‌న్ ప్రారంభించాయి. ఈ ఘ‌ట‌న‌పై మ‌రింత స‌మాచారం అందాల్సి ఉంది.

  • Loading...

More Telugu News