eetela: ఇంట‌ర్ విద్యార్థుల‌కు కూడా మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం అమలు చేసే యోచన ఉంది!: అసెంబ్లీలో మ‌ంత్రి ఈటల


తెలంగాణ‌లోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో స‌న్న బియ్యంతో మ‌ధ్యాహ్న భోజ‌నాన్ని అందిస్తున్నామ‌ని తెలంగాణ మంత్రి ఈటల రాజేంద‌ర్ అన్నారు. ఈ రోజు తెలంగాణ అసెంబ్లీలో విప‌క్ష‌ స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆయ‌న స‌మాధానం చెబుతూ.. ఇంట‌ర్ విద్యార్థుల‌కు కూడా మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం అందిస్తామ‌ని, ప్ర‌స్తుతం ఈ అంశాన్నే ప‌రిశీలిస్తున్నామ‌ని తెలిపారు. స‌న్న‌బియ్యం అమ‌లులో ఎవ‌రైనా అక్ర‌మాల‌కు పాల్ప‌డితే స‌హించేది లేద‌ని అన్నారు. స‌న్న‌బియ్యం అమ‌లు త‌రువాత ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో హాజ‌రు శాతం పెరిగింద‌ని అన్నారు. ప్ర‌భుత్వం చేస్తోన్న మంచి ప‌నుల‌ను కూడా కొంద‌రు రాజ‌కీయం చేయ‌డం సిగ్గుచేట‌ని అన్నారు.

  • Loading...

More Telugu News