: కొత్తరకం జాతి 'పీత'లకు 'ఠాక్రే' పేరు


ఠాక్రే... మహారాష్ట్ర రాజకీయాల్లో ఈ పేరు ఓ సంచలనం. 'శివసేన' స్థాపకుడు బాల్ ఠాక్రే నుంచి ఆ ఇంటి పేరు బాగా పాప్యులర్ అయింది. ఆయన అనంతరం కూడా శక్తిమంతమైన ఠాక్రేల కుటుంబం తనదైన శైలిలో రాజకీయాలు నడుపుతుంటుంది. తాజాగా ఆ పేరును జంతువులంటే ఇష్టపడే శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే చిన్న కుమారుడు తేజస్ ఠాక్రే(19) ఓ జాతి 'పీత'కు పెట్టాడు! దీని పూర్తిపేరు 'గుబెర్ నాటోరియానీ ఠాకరాయి'. సింధ్ దుర్గ్ జిల్లాలోని సావంత్ వాడి పట్టణంలో అవి ఉంటాయి. ఉద్ధవ్ కుమారుడికి అడవులన్నా, అక్కడి జీవజాలాలన్నా బాగా ఇష్టం. గతేడాది కొంతమంది స్నేహితుల బృందంతో కలసి కొంకణ్ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడి రఘువీర్ ఘాట్స్ సమీపంలో ఐదు కొత్త జాతులకు చెందిన మంచినీటి పీతలు కనిపించాయి. అప్పుడే వాటికి ఠాక్రే పేరు పెట్టాడు. తరువాత పీతల జాతి వివరాలను తెలుపుతూ అంతర్జాతీయ సైన్స్ పత్రికలకు పంపాడు. వాటికి సంబంధించిన పరిశోధన పత్రం కూడా జుటాక్సా అనే పత్రికలో ప్రచురితమవడంతో ఈ పీతల పేరు ప్రపంచవ్యాప్తమైంది.

  • Loading...

More Telugu News