చంచల్ గూడా జైలులో దశాబ్ది ఉత్సవాలు

హైదరాబాద్, జూన్ 14 : తెలంగాణా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా తెలంగాణా జైళ్లలో ఉన్న శిక్ష ఖైదీల పిల్లలకు వారి కుటుంబాలు దాదాపు 50 మందికి మెరిట్ స్కాలర్షిప్ లు, వడ్డీ లేని రుణాలను హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి, జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ డా. జితేందర్అం దచేశారు. నేడు చంచల్ గూడా కేంద్ర కారాగారంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్బంగా నిర్వహించిన కార్యక్రమానికి డా. జితేందర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. జైళ్లలో శిక్షా ఖైదీలకు చేపట్టిన పలు సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డాక్టర్ జితేందర్ పాల్గొన్నారు. 

ఈ కార్యక్రమంలో జితేందర్మా ట్లాడుతూ, “ఖైదీల సంక్షేమంలో భాగంగా రాష్ట్ర స్థాయిలో మెరిట్సా ధించిన శిక్షపొందిన ఖైదీల పిల్లలకు, పదవ తరగతి వారికి మూడు వేలరూపాయల చొప్పున, ఇంటర్ వారికి ఐదు వేల చొప్పున, ఉన్నత చదువులు సాధించిన వారికి రూ. 15000 చొప్పున అందిస్తున్నట్టు తెలిపారు. డబ్బులు లేక ఫైన్ కట్టలేక విడుదల కాలేని శిక్ష ఖైదీల కు కూడా ఫైన్ అమౌంట్ లను చెల్లించి వారిని ఈరోజే విడుదల చేయడము జరిగిందని,, వివిధ జైళ్లలో శిక్ష ఖైదీలకు వడ్డీ రహిత రుణాలు రూ. 25౦౦౦/- నుండి రూ. 50,౦౦౦/-వరకు అందచేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా, మహిళా ఖైదీల పిల్లలకి న్యూట్రిషన్ కిట్లు అందజేస్తున్నామని అన్నారు. 
   దశాబ్ది ఉత్సవాల సందర్భముగా రాష్ట్ర జైళ్ల లో శిక్షా ఖైదీలకు క్రీడలు, పాటల పోటీలు నిర్వహించి అందులో గెలుపొందిన వారికి బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో జైళ్ల శాఖ ఐజి వై రాజేష్, డీఐజీలు యన్. మురళీబాబు, డి శ్రీనివాస్ ,యం.సంపత్, పర్యవేక్షణాధికారులు సంతోష్రా య్, కళాసాగర్, పర్యవేక్షణాధికారి పి.ఏ.సి. అమరావతి , మహిళా జైలు పర్యవేక్షణాధికారి గారు, డాక్టర్ రమణ గారు, జైళ్ల శాఖ హెడ్ ఆఫిసు సిబ్బంది.ఈ కార్యక్రమమంలో ఖైదీల కుటుంబాలు, వారి పిల్లలు పాల్గొన్నారు.

More Press News