తెలంగాణ పౌరుల కోసం ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్

హైదరాబాద్, ఏప్రిల్ 27 :: సూడాన్ దేశంలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి సురక్షితంగా తరలిస్తున్న ““ఆపరేషన్కావేరి”” లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రయాణికులను స్వరాష్ట్రానికి తరలించేందుకు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేసింది. యుద్ధ వాతావరణం నెలకొన్న సూడాన్ దేశంలో చిక్కుకుపోయిన భారత పౌరులను దేశానికి తరలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృత ఏర్పాట్లు చేశాయి. అందులో భాగంగా తెలంగాణ పౌరుల కోసం ప్రత్యేకంగా ఢిల్లీ ఎయిర్ పోర్టులో అధికారులు హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేశారు.

More Press News