ప్రపంచంలో అతి పెద్ద టాయ్‌ రిటైలర్‌ Toys"R"Us ను భారతదేశానికి తీసుకువచ్చిన ఏస్‌ టర్టెల్‌

భారతదేశవ్యాప్తంగా వినియోగదారులు ఇప్పుడు toysrus.in  వద్ద మరియు  హైదరాబాద్‌లోని Toys"R"Us నూతన స్టోర్‌ వద్ద కొనుగోళ్లు చేయవచ్చుహైదరాబాద్‌, మార్చి 11, 2023 : భారతదేశంలో సుప్రసిద్ధ, సాంకేతికాధారిత రిటైల్‌ కంపెనీ ఏస్‌ టర్టెల్‌ నేడు  ప్రపంచంలో అతిపెద్ద, ఎక్కువ మంది అభిమానించే టాయ్‌ స్టోర్‌ Toys"R"Us ను భారతదేశంలోని వినియోగదారుల కోసం భౌతిక రూపంలో తీసుకువచ్చినట్లు వెల్లడించింది.  ఈ నూతన  Toys"R"Us రిటైల్‌ స్టోర్‌ను  నేడు హైటెక్‌ సిటీ సమీపంలోని శరత్‌ సిటీ క్యాపిటల్‌ మాల్‌ వద్ద ప్రారంభించారు.

ఈ నూతన స్టోర్‌లో ప్రపంచశ్రేణి బ్రాండెడ్‌  బొమ్మలు అందించడంతో పాటుగా చిన్నారుల కోసం తమ మస్కట్‌ జెఫ్రీ ద జిరాఫీతో పలు అనుభవపూర్వక టచ్‌పాయింట్లను సైతం అందుబాటులోకి తీసుకువచ్చారు.  ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది చిన్నారులకు అపరిమిత ఆనందాన్ని తీసుకువచ్చిన మహోన్నత వారసత్వం Toys"R"Us  కు ఉంది. దాదాపు ఏడు దశాబ్దాలుగా అత్యున్నత నాణ్యత మరియు వైవిధ్యమైన బొమ్మల కలెక్షన్‌ను అది పిల్లలకు అందిస్తుంది. బార్బీ, లెగో, హాట్‌ వీల్స్‌, నెర్ఫ్‌ లాంటి బ్రాండ్ల బొమ్మలతో పాటుగా  డిస్నీ, పారామౌంట్‌ నుంచి లైసెన్స్‌డ్‌ టాయ్స్‌ కూడా  హైదరాబాద్‌లోని  Toys"R"Us  వద్ద  లభ్యమవుతాయి. ఏస్‌ టర్టెల్‌ ఇప్పుడు toysrus.in ను సైతం ప్రారంభించడం ద్వారా  భారతదేశ వ్యాప్తంగా వినియోగదారులు తమ అభిమాన బొమ్మలను ఆన్‌లైన్‌లో సౌకర్యవంతంగా తమ ఇంటి నుంచి కొనుగోలు చేసే అవకాశం అందిస్తుంది.

ఏస్‌ టర్టెల్‌ సీఈఓ నితిన్‌ చాబ్రా ఈ స్టోర్‌ ప్రారంభం గురించి మాట్లాడుతూ  ‘‘ అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన  Toys"R"Us  అనుభవాలను హైదరాబాద్‌లో  మొదటి స్టోర్‌ ప్రారంభించడం ద్వారా చిన్నారుల చెంతకు తీసుకురావడం పట్ల సంతోషంగా ఉన్నాము. విస్తృతశ్రేణి, అత్యున్నత ఉత్పత్తుల ద్వారా స్టోర్‌ లోపల  మరుపురాని అనుభవాలను అందించడానికి కట్టుబడి ఉన్నాము. దీనితో పాటుగా మహోన్నత వినియోగదారుల సేవా అనుభవాలనూ అందించనున్నాము.  ప్రభుత్వ మద్దతుతో భారతదేశంలో బొమ్మల పరిశ్రమ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. సంఘటిత రంగంలో  పరిమిత సంఖ్యలో ప్లేయర్లు ఉండటం వల్ల అపూర్వమైన అవకాశాలు ఉంటాయి.  భౌతికంగా మరిన్ని స్టోర్‌లను ప్రారంభించడంతో పాటుగా అదే రోజు (సేమ్‌ డే), తరువాత రోజు (నెక్ట్స్‌ డే) డెలివరీలను  ఠీఠీఠీ.్టౌడటటఠట.జీుఽ ద్వారా అందిస్తూ Toys"R"Us ను విస్తరించనున్నాము. ఇది ప్రభుత్వ మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమాన్ని మరింత విస్తృత పరచడంతో పాటుగా దేశంలో బొమ్మల తయారీని మరింత వేగవంతం చేయనుంది’’అని అన్నారు.

   
జూన్‌ 2021లో టర్టెల్‌ , ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్‌ యొక్క హోల్‌సేల్‌ సంస్ధగా  ఉమ్మడి భాగస్వామ్యంను భారతదేశంలో ప్రారంభించడంతో పాటుగా భారతదేశంలో Toys"R"Us  లైసెన్స్‌ పొందింది. ఇన్వెస్ట్‌ ఇండియా లెక్కల  ప్రకారం  భారతదేశంలో బొమ్మల పరిశ్రమ 1.5 బిలియన్‌ డాలర్ల విలువ కలిగి ఉంటుందని అంచనా. ఈ రంగం 90% అసంఘటిత రంగంలోనే ఉంది.  భారతదేశంలో  బొమ్మల పరిశ్రమ 2024 నాటికి రెండు బిలియన్‌ డాలర్లకు పైగా వృద్ధి చెందనున్నట్లు అంచనా. భారతీయ బొమ్మల పరిశ్రమ అంతర్జాతీయ బొమ్మల పరిశ్రమలో కేవలం 0.5% మాత్రమే ఉంది.  తద్వారా  భారీ వృద్ధి అవకాశాలు ఇక్కడ ఉన్నాయి.  దేశీయంగా బొమ్మల పరిశ్రమల 10–15% వృద్ధి నమోదు చేయనుందని అంచనా. అంతర్జాతీయంగా ఇది 5% వృద్ధిని మాత్రమే నమోదు చేస్తుంది.
--


More Press News