షీ-టీమ్ నిర్వహించిన 2 -కె, 5 -కె రన్ లను ప్రారంభించిన ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్

హైదరాబాద్, మార్చి 6 :: ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణా పోలీస్ షీ- టీమ్స్, హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రన్ లను ముఖ్య అతిధిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ప్రారంభించగా, ప్రత్యేక ఆహ్వానితులుగా డీజీపీ అంజనీ కుమార్, సిటీ పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్, మహిళా భద్రతా విభాగం అడిషనల్డీ జీ షికా గోయల్ లు హాజరయ్యారు. మహిళా భద్రతా, షీ-టీమ్ లపై చైతన్యం తదితర అంశాలపై చైతనానికి ఉద్దేశించి 2 -కె , 5 -కె రన్ల ను సిటీ పోలీస్ ఆధ్వర్యంలో నేడు ఉదయం నెక్లెస్ రోడ్లో నిర్వహించింది. ఈ రన్ లకు నగరంలోని యువతీ, యువకులు పెద్ద సంఖ్యలో హాజరు కాగా, మహిళా పోలీసులు, పోలీసు అధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్పో లీస్ అధికారులు పాల్గొన్నారు.

More Press News