*సచివాలయంలో మహిళా పోలీసులపై మాజీ సీఎం చంద్రబాబు అభ్యంతరకర వ్యాఖ్యలు*

*మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మాకు సెక్రటేరియట్ మహిళా పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫిర్యాదు*...

మహిళల భద్రత, కుటుంబ వివాదాల పరిష్కారం, సామాజిక అంశాలపై చైతన్యం తదితర అంశాలపై  గ్రామ, వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసులపై మాజీ సీం చంద్రబాబునాయుడు వ్యాఖ్యాలు మహిళా సాధికారతను దెబ్బతీసే విధంగా ఉన్నాయని మహిళా కమిషన్  చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు....


ఇటీవల రోడ్ షోలో చంద్రబాబు నాయుడు సచివాలయం మహిళా పోలీసులపై చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సెక్రటేరియట్ మహిళా పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ఎ స్ .మహాలక్ష్మి, జనరల్ సెక్రటరీ డి. మధులత, గుంటూరు జిల్లా అధ్యక్షురాలు MVN. దుర్గా, గౌస్యా బేగం, మంగళగిరి గీత తదితరులు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మను అమరావతిలోని  వారి కార్యాలయంలో ఈరోజు కలిసి వినతి  పత్రం అందజేశారు... 


సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళల రక్షణ కోసం, గ్రామస్థాయిలో మహిళా భద్రత విషయంలో పదిమందికి ఉపయోగపడాలనే మంచి ఉద్దేశంతో  గ్రామస్థాయిలో సచివాలయ మహిళా పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సచివాలయం మహిళ పోలీస్ వ్యవస్థ పనితీరుపై, వారు చేస్తున్న సర్వేలపై అబద్దాలను ప్రచారం చేస్తూ..వారికి సహకరించవద్దని వారు వస్తే తలుపులు వేసేయాలని, వారు ఇంటింటికి తిరిగి భార్య భర్తల అక్రమ సంబంధాలపై సర్వే చేస్తున్నారని ప్రజల్లో భ్రమ కలిగే విధంగా  చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను ఖండించవలసిందేన్నారు. అత్యంత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు,  మాజీ ముఖ్యమంత్రి హోదాలో సచివాలయం మహిళా పోలీసులపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం గర్హనీయం అన్నారు.  

చంద్రబాబు వ్యాఖ్యాలు సచివాలయం మహిళా పోలీసులను తీవ్రంగా మనోవేదన గురి చేసిందని, ఏపి గ్రామం/వార్డు సెక్రటేరియట్ మహిళా పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యలు  మహిళా కమిషన్ దృష్టి తీసుకురావడం జరిగిందన్నారు.  ఈ వ్యాఖ్యలపై  మహిళా కమిషన్  చర్యలు తీసుకుంటుందని తెలిపారు..

More Press News