రిఫ్రిజిరేటర్‌ విభాగంలో బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫీషియెన్సీ (బీఈఈ) నుంచి ‘మోస్ట్‌ ఎనర్జీ ఎఫీషియెంట్‌ అప్లయెన్సస్‌ ఆఫ్‌ ద ఇయర్‌ ’అవార్డు అందుకున్న హైయర్‌ ఇండియా

·       గౌరవనీయ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము అవార్డుల వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొనడంతో పాటుగా  అవార్డులను అందజేశారు
·       ఈ సంవత్సరం జాతీయ ఇంధన పొదుపు అవార్డుల కార్యక్రమాన్ని ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో డిసెంబర్‌ 14,2022 నిర్వహించారు. ఇదే రోజును జాతీయ ఇంధన పొదుపు దినోత్సవం నిర్వహించారు
·       హైయర్‌ హెచ్‌ఆర్‌డీ –1955 డైరెక్ట్‌ కూల్‌ రిఫ్రిజిరేటర్‌ సంవత్సరానికి 106 యూనిట్లను మత్రమే వినియోగించి విద్యుత్‌ పొదుపు చేస్తుంది
17 డిసెంబర్‌ 2022: హోమ్‌ అప్లయెన్సస్‌  మరియు కన్స్యూమర్‌ ఎలకా్ట్రనిక్స్‌ లో అంతర్జాతీయంగా అగ్రగామిగా వెలుగొందుతుడటంతో పాటుగా వరుసగా 13 సంవత్సరాలు  మేజర్‌ అప్లయెన్సస్‌లో  ప్రపంచంలో నెంబర్‌ 1 బ్రాండ్‌గా వెలుగొందుతున్న  హైయర్‌ను  ‘మోస్ట్‌ ఎనర్జీ ఎఫిషీయెంట్‌ అప్లయెన్స్‌  అవార్డు’తో భారత ప్రభుత్వ ఇంధన శాఖ, నేషనల్‌ ఎనర్జీ కన్జర్వేషన్‌ అవార్డులు (ఎన్‌ఈసీఏ) 2022 లో బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషీయెన్సీ (బీఈఈ) గుర్తించింది. ఈ అవార్డు కమిటీ హైయర్‌ యొక్క మోడల్‌ నెంబర్‌ హెచ్‌ఆర్‌డీ 1955, 5 స్టార్‌ శ్రేణిని గుర్తించడంతో పాటుగా ఈ విభాగంలో  విజేతగా  నిలిపింది. వరుసగా రెండవ సంవత్సరం ఎన్‌ఈసీఏ వద్ద హైయర్‌ను బీఈఈ గుర్తించింది.
ఈ అవార్డుల వేడుక న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో జరిగింది. గౌరవనీయ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము తో  పాటుగా గౌరవనీయ కేంద్ర ఇంధన , నూతన, పునరుత్పాదకశక్తి శాఖామాత్యులు ఆర్‌కె సింగ్‌ ; శక్తి మరియ భారీ పరిశ్రమల శాఖ సహాయమాత్యులు  క్రిషన్‌ పాల్‌ ; కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి అలోక్‌ కుమార్‌ పాల్గొన్నారు.
ఈ అవార్డు అందుకున్న అనంతరం  హైయర్‌ అప్లయెన్సస్‌ ఇండియా అధ్యక్షులు శ్రీ సతీష్‌  ఎన్‌ఎస్‌ మాట్లాడుతూ ‘‘ఇది మాకు  అత్యంత గర్వకారణమైన క్షణం. మా బ్రాండ్‌ సిద్ధాంతమైన ‘ఇన్‌స్పైర్డ్‌ లివింగ్‌’ దిశగా మా నిబద్ధతను చాటాలనే  మా ప్రయత్నం గుర్తించడంతో పాటుగా అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుతో సత్కరించారు.  ఈ అవార్డు అందుకోవడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము మరియు  ఈ అవార్డుతో గుర్తించిన  బ్యూరో ఆప్‌  ఎనర్జీ ఎఫిషీయెన్సీకి ధన్యవాదములు తెలుపుతున్నాము.  మన భూగోళం మరియు వాతావరణ పరిరక్షణ దిశగా నిలకడ, బాధ్యతను చాటడమనేది మా వ్యాపారంలో అత్యంత కీలకమైనవి మరియు మేము అర్ధవంతమైన, పర్యావరణ అనుకూల మార్గాలను  తయారీ లో కొనసాగించడంతో  పాటుగా మా చుట్టుపక్కల ప్రాంతాలతో పాటుగా భూగోళానికి అతి తక్కువ హాని కలిగిస్తామని భరోసా అందిస్తున్నాము’’ అని అన్నారు.
జాతీయ ఇంధన పొదుపు దినోత్సవంను  దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 14 డిసెంబర్‌ న జరుపుతుంటారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జాతీయ ఇంధన పొదుపు అవార్డులను నిర్వహిస్తుంటారు. దీనిలో భారత ప్రభుత్వంకు చెందిన విశిష్ట వ్యక్తులు పలు పరిశ్రమల యూనిట్లు/సంస్థలను ఇంధన పొదుపు పద్ధతుల స్వీకారం పరంగా చేసిన  అసాధారణ ప్రయత్నాలను గుర్తిస్తుంటారు.
భారతీయ వినియోగదారులకు  వినూత్నమైన ఉత్పత్తులను అందించాలనేది  హైయర్‌ ఇండియా యొక్క నిబద్ధత. స్ఫూర్తిదాయక జీవనం కోసం స్ధిరంగా మారుతున్న వినియోగదారుల డిమాండ్‌లను ఈ బ్రాండ్‌ తీరుస్తుంది. పూర్తి  మేడ్‌ ఇన్‌ ఇండియా మరియు మేడ్‌ ఫర్‌ ఇండియా  ఉత్పత్తి అయిన హైయర్‌ యొక్క మోడల్‌ నెంబర్‌ హెచ్‌ఆర్‌డీ–1955 డైరెక్ట్‌ కూల్‌ రిఫ్రిజిరేటర్‌, ఇన్వర్టర్‌ కంప్రెషర్‌ను కలిగి ఉంటుంది. దీనిని పూనె సమీపంలోని రంజన్‌గావ్‌ అత్యాధునిక కేంద్రంలో తయారుచేస్తున్నారు. అంతేకాదు, పూనె, గ్రేటర్‌ నోయిడాలలో ఉన్న రెండు కేంద్రాలూ వాల్యూచైన్‌ వ్యాప్తంగా ప్రీమియం  మరియు  హై ఎండ్‌ ప్రొడక్స్‌ను కోరుకునే భారతీయ వినియోగదారుల కోసం నూతన ఆవిష్కరణలను చేయడానికి ఈ బ్రాండ్‌కు మద్దతు అందిస్తున్నాయి. 
హైయర్‌ హెచ్‌ఆర్‌డీ 1955 డైరెక్ట్‌ కూల్‌ రిఫ్రిజిరేటర్‌ విద్యుత్‌ను ఆదా చేస్తుంది. ఇది సంవత్సరానికి కేవలం 106 యూనిట్లు మాత్రమే వినియోగిస్తుంది.  దీని 5 స్టార్‌ రేటింగ్‌తో పాటుగా హెచ్‌ఆర్‌డీ –1955 డైరెక్ట్‌ కూల్‌ రిఫ్రిజిరేటర్‌ లో హెవీ డ్యూటీ కంప్రెషర్‌ ఉంది. స్టెబిలైజర్‌ రహిత కార్యక్రమాలకు ఇది మద్దతు అందిస్తుంది. అదనంగా, అత్యాధునికమైన ఒన్‌ హవర్‌ ఐసింగ్‌ టెక్నాలజీ నీటి ఉష్ణోగ్రతను ఐసింగ్‌ పాయింట్‌కు కేవలం 60 నిమిషాలలో  తీసుకువస్తుంది . తద్వారా ఈ విభాగంలో మరే ఇతర  రిఫ్రిజిరేటర్‌కంటే వేగంగా ఐస్‌ను తయారుచేస్తుంది.
ఈ రిఫ్రిజిరేటర్‌ విస్తృతశ్రేణి ఫినీషెస్‌ కలిగి ఉంది. వాటిలో గ్లాస్‌, ఫ్లోరల్‌, స్టీల్‌  వంటివి ఉండి భారతీయ వంట గది అందాలకు నవ్యతను జోడిస్తుంది. మిర్రర్‌ గ్లాస్‌, బ్లాక్‌ గ్లాస్‌, షైనీ స్టీల్‌, రెడ్‌ గ్లాస్‌లో ఇది లభిస్తుంది. ఈ డిజైన్‌లను వినియోగదారుల, సమకాలీన భారతీయ వంటగది అవసరాలు దృష్టిలో ఉంచుకుని  తీర్చిదిద్దారు.
ఫోటోరైటప్‌ (ఎడమ నుంచి కుడికి) : గౌరవనీయ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము మరియు శ్రీ సతీష్‌  ఎన్‌ఎస్‌, అధ్యక్షులు, హైయర్‌ అప్లయెన్సెస్‌ ఇండియా

More Press News