తెలంగాణాలోని నిజామాబాద్‌లో తమ మొట్టమొదటి క్లాస్‌రూమ్‌ సెంటర్‌ను ప్రారంభించిన ఆకాష్‌ బైజూస్‌

* టెస్ట్‌ ప్రిపరేషన్‌ సేవలలో దేశంలోనే అగ్రగామి అయిన ఆకాష్‌ బైజూస్‌, 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 285కు పైగా కేంద్రాలను కలిగి ఉండటంతో పాటుగా ప్రతి సంవత్సరం 3.3 లక్షల మంది విద్యార్ధులకు విద్యాబోధన చేస్తుంది.·

  * నిజామాబాద్‌లోని ఈ నూతన కేంద్రం ద్వారా వైద్య, ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు తరగతులను అందించడంతో పాటుగా ఫౌండేషన్‌ స్థాయి కోర్సులను సైతం త్వరలో అందించనున్నారు.·   

   * ఈ సెంటర్‌లో 9 క్లాస్‌రూమ్స్‌ ఉండటంతో పాటుగా 472 మంది విద్యార్థులకు తగిన సౌకర్యాలనూ అందించనున్నారు.

నిజామాబాద్‌, ఆగస్టు 02 2022 : దేశవ్యాప్తంగా తమ కార్యకలాపాలను విస్తరించడం ద్వారా వేలాది మంది విద్యార్థులకు డాక్టర్లు, ఐఐటీయన్లుగా మారాలనే కలను సాకారం చేయాలనే తమ లక్ష్యానికనుగుణంగా,  దేశంలో టెస్ట్‌ ప్రిపరేటరీ సేవలలో అగ్రగామి  సంస్థ  ఆకాష్‌ బైజూస్‌ నేడు తమ నూతన క్లాస్‌రూమ్‌ సెంటర్‌ను తెలంగాణాలోని నిజామాబాద్‌ వద్ద ప్రారంభించింది. ఈ నూతన కేంద్రంలో 9 తరగతి గదులు ఉంటాయి. ఇవి 472 మంది విద్యార్థులకు తగిన సౌకార్యలను అందించగలవు.

ఆకాష్‌ బైజూస్‌ కేంద్రం, ఇంటి నెంబర్‌ 1–12–48, హనుమాన్‌ దేవాలయం వద్ద, వినాయక్‌ నగర్‌, నిజామాబాద్‌, తెలంగాణా వద్ద ఉంది. ఈ క్లాస్‌రూమ్‌ కేంద్రం, వైద్య మరియు ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలకు హాజరవుతున్న  విద్యార్ధుల అవసరాలను తీర్చనుంది. త్వరలోనే ఫౌండేషన్‌ స్థాయి కోర్సుల ను సైతం ప్రారంభించనున్నారు.

ఈ క్లాస్‌రూమ్‌ సెంటర్‌ను ఆకాష్‌ బైజూస్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శ్రీ సుమన్‌ గౌడ్‌ ; రీజనల్‌ బిజినెస్‌ హెడ్‌ శ్రీ భరత్‌ మందడి యాదవ్‌ మరియు లీడ్‌, ఆపరేషన్స్‌ శ్రీ నిశాంత్‌ శ్రీవాస్తవ ప్రారంభించారు.

నూతన కేంద్రం ప్రారంభం గురించి  ఆకాష్‌ బైజూస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీ ఆకాష్‌ చౌదరి మాట్లాడుతూ   ‘‘నిజామాబాద్‌లోని మా మొదటి క్లాస్‌రూమ్‌ కేంద్రం డాక్టర్లు, ఐఐటీయన్లుగా మారాలనుకునే స్థానిక విద్యార్ధులకు ఓ వరంగా నిలుస్తుంది. నేడు, దేశవ్యాప్తంగా నాణ్యమైన విద్యను తమ దేశవ్యాప్త నెట్‌వర్క్‌ కేంద్రాల ద్వారా అందించడం ద్వారా ఆకాష్‌ బైజూస్‌ సుప్రసిద్ధమైంది. మా విద్యా కంటెంట్‌ నాణ్యత మరియు మా బోధనా పద్ధతుల ప్రభావం కారణంగా అత్యధిక సంఖ్యలో  ఆకాష్‌ బైజూస్‌ విద్యార్థులు పలు పోటీ పరీక్షలలో ఎంపికయ్యారు. ఇవే అంశాలు అండర్‌గ్రాడ్యుయేట్‌ మెడికల్‌, ఇంజినీరింగ్‌ కోర్సులలో చేరగోరు విద్యార్ధులకు  అత్యున్నత ప్రాధాన్యతా ఇనిస్టిట్యూట్‌లలో ఒకటిగా ఆకాష్‌ బైజూస్‌ను నిలిపాయి’’ అని అన్నారు.

శ్రీ  చౌదరి మరింతగా మాట్లాడుతూ ‘‘ నిజామాబాద్‌లో మా నూతన క్లాస్‌రూమ్‌ కేంద్రం ప్రారంభించడం పట్ల చాలా ఆనందంగా ఉన్నాము.  దీనిద్వారా తెలంగాణాలో మా కార్యకలాపాలను మరింతగా విస్తరించాము. మా జాతీయ నెట్‌వర్క్‌కు  ఈ శాఖను జోడించడమనేది ప్రామాణీకరణ నాణ్యమైన బోధన,  ఆధునిక మౌలిక వసతులను మరియు సాంకేతిక ఆధారిత వ్యవస్ధలను వినియోగించి భారతదేశ వ్యాప్తంగా విద్యార్థులకు అభ్యాస వాతావరణం సృష్టించాలనే మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తోంది’’ అని అన్నారు.

ఆకాష్‌ బైజూస్‌లో చేరగోరు విద్యార్ధులు ఇన్‌స్టెంట్‌ అడ్మిషన్‌ కమ్‌ స్కాలర్‌షిప్‌ టెస్ట్‌ (జీఅఇఖిఖీ)ను తీసుకోవడం లేదా  ఆకాష్‌ నేషనల్‌ టాలెంట్‌ హంట్‌ ఎగ్జామ్‌ (అూఖీఏఉ) కోసం నమోదు చేసుకోవచ్చు.

వివిధ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను విస్తృతంగా, సమగ్రంగా ఆకాష్‌ బైజూస్‌ వద్ద అందించే ఈ ప్రోగ్రామ్‌లు సిద్ధం చేస్తాయి. అంతేకాదు, ఇక్కడ అనుసరించే బోధనా పద్ధతులు ప్రధానంగా కాన్సెప్ట్యువల్‌ మరియు అప్లికేషన్‌ ఆధారిత అభ్యాసంపై దృష్టి పెడుతుంది. ఇవే అంశాలు దీనిని ఓ బ్రాండ్‌గా గుర్తించేలా చేశాయి. ఆకాష్‌ బైజూస్‌ వద్దనున్న నిపుణులైన అధ్యాపకులు విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించడంలో సహాయపడే ఆధునిక మరియు ఇంటరాక్టివ్‌ బోధనా పద్ధతులను అనుసరిస్తారు. ఆకాష్‌ బైజూస్‌ యొక్క నిరూపితమైన విజయాల రికార్డు, దాని ప్రత్యేకమైన విద్యా పంపిణీ వ్యవస్ధకు ఆపాదించబడింది. ఇది కేంద్రీకృత మరియు ఫలితాల ఆధారిత బోధనా పద్ధతిని నొక్కి చెబుతుంది.

     

More Press News