సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ఘనంగా బోనాల పండుగ

హైదరాబాద్, జూలై, 19 – మాసబ్ ట్యాంక్ , సమాచార భవన్ లోని సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్ కార్యాలయంలో మంగళవారం రోజున ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ అనిల్ కుమార్కూ ర్మాచలం, సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్ మరియు మున్సిపల్ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ అర్వింద్ కుమార్, సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్ డైరెక్టర్ శ్రీ బి.రాజమౌళి, అదనపు సంచాలకులు శ్రీ నాగయ్య కాంబ్లే లతోపాటు ప్రెస్అ కాడమీ మాజీ చైర్మన్ శ్రీ అల్లం నారాయణ, జాయింట్ డైరెక్టర్లు శ్రీ డి.ఎస్. జగన్, శ్రీ డి. శ్రీనివాస్, శ్రీ కె.వెంకటరమణ, ప్రెస్ అకాడెమీ కార్యదర్శి శ్రీ వెంకటేశ్వర రావు, సమాచార శాఖ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ శ్రీ వి. రాధా కిషన్, మాజీ డైరెక్టర్లు శ్రీ కిస్మత్ కుమార్, శ్రీ సుభాష్గౌ డ్ శాఖలో పనిచేసి పదవి విరమణ చేసిన ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

       

More Press News