నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలి: తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చెంజర్ల గ్రామ శివారులో జరిగిన ఘటనలో నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్, జిల్లా కలెక్టర్ ను చైర్ పర్సన్ సునీతాలక్ష్మా రెడ్డి ఆదేశించారు. సంఘటన చాలా బాధాకరమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునీతాలక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సంఘటనను తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుందని అధికారులకు రాసిన లేఖలో తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. యువతులు ఇలా మాయ మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. స్వీయ రక్షణ పద్దతులు నేర్చుకుని ఇలా దాడులకు దిగే దుర్మార్గులను ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు.

More Press News