తెలంగాణలో ఆదివారం నుంచి తెరుచుకోనున్న జూపార్కులు

హైదరాబాద్: తెలంగాణలో జూపార్కులు, జింకల పార్కులు, జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది. పున:ప్రారంభానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆదివారం నుంచి నెహ్రూ జూపార్క్ తెరుచుకోనుంది. పులుల అభయారణ్యాలు మాత్రం పునరుత్పత్తి సీజన్ తర్వాతే పున:ప్రారంభం కానున్నాయి. అన్ని ప్రాంతాల్లో తగిన కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సందర్శకులకు అనుమతి ఇవ్వాలని పీసీసీఎఫ్ ఆర్.శోభ ఆదేశాలు జారీ చేశారు.



More Press News