కోవిడ్ -19 టెస్టింగ్ వాహనాలను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో మూడు కోవిడ్ -19 టెస్టింగ్ వాహనాలు, ఒక (కోవిడ్ రెస్పాన్స్ వెహికల్) అంబులెన్స్ ను ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.

ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో వీధి వ్యాపారులకోసం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బస్టాండ్ ఎదురుగా నూతనంగా నిర్మించిన రైతు బజార్ ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు.

స్వచ్ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సూచనల మేరకు ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ప్రజలకు సరిపడు పబ్లిక్ టాయిలెట్స్ అందుబాటులో ఉంచాలని సంకల్పించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాల మేరకు మున్సిపల్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన మోడరన్ టాయిలెట్స్ నగరంలో గురువారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఖమ్మం త్రీటౌన్ ప్రాంతం లోని డాబాల బజార్ మరియు రోటరీ నగర్ లో నూతనంగా నిర్మించిన మోడరన్ టాయిలెట్స్ మంత్రి ప్రారంభించారు.

ఇంటింటికి తాగునీరు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పనుల స్థితిగతులను తెలుసుకునేందుకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గురువారం ఖమ్మం నగరంలో కొనసాగుతున్న పనులను పరిశీలించారు.

తొలుత ఖమ్మం నగరంలోని ఇందిరా నగర్ బైపాస్ రోడ్, NSP కాలువ వద్ద(ఖానపురం), చర్చ్ కాంపౌండ్ రోడ్, ZP సెంటర్లో  కొనసాగుతున్న పనులను జిల్లా కలెక్టర్ RV కర్ణన్, మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతి L&T వైస్ చైర్మన్ సతీష్ తో కలిసి పరిశీలించారు.


ప్రజలకు ఇంటింటికి పరిశుభ్రమైన త్రాగునీరు అందించాలని ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠత్మికంగా తీసుకున్న కార్యక్రమంలో అలసత్వం వహించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు వేగం పెంచాలని వారిని అదేశించారు.

అనంతరం TTDCలో నిర్వహించిన రివ్యూలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న పనులు పట్ల అధికారులను నిలదీశారు. మిషన్ భగీరథ ట్యాంక్(OHRS) పనుల వివరాలు ఆయా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడి నుండి ఏ ప్రాంతాలకు నీటి సరఫరా జరుగుతుందనే విషయాన్ని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్ని ట్యాంక్‌లకు కలెక్షన్లు ఇచ్చారని, ట్యాంక్‌ల నిర్మాణం ఇంకా పూర్తి చేయకపోవడానికి కారణాలు ఏమిటని ప్రశ్నించారు. నగరంలో అంతర్గత పైప్‌లైన్ పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిన్న చిన్న సమస్యలు రావడం వాటిని పరిష్కరించడం జరుగుతుందని అధికారులు విన్నవించారు.  

ఇంటింటికి నల్లా ఇచ్చే క్రమంలో భాగంగా కోట్ల రూపాయలు వెచ్చించి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని మంజూరు చేసిన పథకంలో అధికారులు అలసత్వం ప్రదర్శించటం ఏంటని ప్రశ్నించారు. పైప్‌లైన్ల పనులను ఎందుకు ముందుకు సాగట్లేదని   ఎందుకు పనులను వదిలేశారని ప్రశ్నించారు. అధికారులు సమన్వయ పర్చుకొని సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేసి వాడుకలోకి తేవాలని అధికారులకు ఆదేశించారు.

సమావేశంలో మేయర్ పాపాలాల్, జిల్లా కలెక్టర్ RV కర్ణన్, మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతి, L&T వైస్ చైర్మన్ సతీష్, ENC ధనరాజ్, L&T మేనేజర్ హరి ప్రసాద్, SE శ్రీనివాసరావు, పబ్లిక్ హెల్త్ EE రంజిత్ కుమార్, మిషన్ భగీరథ అధికారులు ఉన్నారు.

More Press News