కరోనా పాజిటివ్ వచ్చిన జర్నలిస్టులకు ఆర్థిక సహాయం ప్రకటించిన అల్లం నారాయణ

హైదరాబాద్ లో కొత్తగా మరో 25 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ వచ్చినందున,ఆ 25 మంది జర్నలిస్టులకు ఒక్కొక్కరికి 20 వేలరూపాయల చొప్పున, హోంక్వారైంటైన్ లో ఉన్న జర్నలిస్టుకు పది వేలచొప్పున, మొత్తం 5 లక్షల పది వేల ఆర్థిక సహాయం తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ ప్రకటించారు.

ఇప్పటి వరకు కరోనా వైరస్ పాజిటీవ్ లు వచ్చిన 56 మంది జర్నలిస్టులకు 20 వేల రూపాయల చొప్పున 11 లక్షల ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశామని తెలిపారు. అదే విధంగా హోంక్వారైంటైన్ లో ఉన్న 14 మంది జర్నలిస్టులకు 10 వేల రూపాయల చొప్పున ఒక లక్ష 40 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 12 లక్షల అరవై వేల రూపాయలను అకాడమీ నిధుల నుండి అందించామని తెలిపారు.

కరోనా బారిన పడిన పాజిటివ్, క్వారంటైన్ జర్నలిస్టులు ప్రభుత్వ డాక్టర్లు దృవికరించిన మెడికల్ రిపోర్టు లు అకాడమీ కార్యాలయంలో పంపించాలని సూచించారు.

 జర్నలిస్టులకు తక్షణ సహాయం కింద 20,000 రూపాయలు, క్వారన్ టైన్ లో ఉన్న జర్నలిస్ట్ లకు 10,000 రూపాయలు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ నుండి అందిస్తున్నామని తెలిపారు. జర్నలిస్ట్ మిత్రులు తమ వివరాలను  తెలంగాణ రాష్ట్ర మీడియా చైర్మన్ వాట్సప్ (8096677444) నెంబర్ కి పంపాలని తెలిపారు.  మరిన్ని వివరాలకు  మీడియా అకాడమీ మేనేజర్  సెల్ నెంబర్  9676647807 ని సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.

ఇండ్ల నుండి బయటికి వెళ్లే సందర్భంలో జర్నలిస్టులు ప్రతి ఒక్కరు మాస్కు, సానిటైజర్ ను వాడాలని తెలిపారు. ఈ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. కరోనా వైరస్ పై అవగాహన కలిగించడంలో జర్నలిస్టులది కీలక పాత్ర అని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి జర్నలిస్టులకు అన్ని విధాలు అండగా ఉంటుందని  తెలిపారు.

More Press News