10వ తరగతి పరీక్షల నిర్వహణ, లాక్ డౌన్ అమలుపై ఈరోజు సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం

10వ తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి నిర్ణయం తీసుకోవడానికి సీఎం కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. విద్యాశాఖ మంత్రి, అధికారులు పాల్గొంటారు.

కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, లాక్ డౌన్ అమలు తదితర అంశాలుపై చర్చించి తదనుగుణంగా నిర్ణయాలు తీసుకునేందుకు సీఎం కేసీఆర్ సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ప్రగతి భవన్ లో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, సీనియర్ అధికారులు పాల్గొంటారు.

More Press News