ముఖ్యమంత్రి సహాయనిధికి తెలంగాణ కాటన్ మిల్లర్స్, ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ విరాళం!

కరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తమవంతు సహాయంగా “తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్” రూ. 35 లక్షల విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించింది. దీనికి సంబంధించిన చెక్కును అసోసియేషన్ ప్రెసిడెంట్ బొమ్మినేని రవీందర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ కక్కిరాల రమేష్ ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు అందించారు.

More Press News