ప్రజలు అందరూ సహకరిస్తున్నారు: తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ

తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఈ రోజు ఎల్బీనగర్, చైతన్య పురి, దిల్ సుఖ్ నగర్ పరిసర ప్రాంతాలను ఆకస్మికంగా పరిశీలించారు. 

అనంతరం హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ ఎల్బీ నగర్ సీపీ క్యాంప్ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు అందరూ సహకరిస్తున్నారని అన్నారు.

  • తెలంగాణలో 1500 రూపాయలు రేషన్ దుకాణాల ద్వారా అందజేస్తున్నాం

  • రేట్లు ఎక్కువ చేసి అమ్మితే వారిపై కేసులు పెడతాం

  • రాచకొండ కమిషనర్ కార్యాలయం విస్తీర్ణం పెద్దదిగా ఉంది

  • 42లక్షల పాపులేషన్ 58 పోలీసు స్టేషన్లు

  • కరోనా వైరస్ చాలా భయంకరమైన వ్యాధి

  • అలాగే చాలా స్లోగా పెరుగుతూ వస్తుంది

  • ప్రజలెవరూ బయటకు రావద్దు

  • కూరగాయలను సరఫరా చేయడంలో ఎవరు అడ్డుకోవడం లేదు

  • కూరగాయలు, నిత్య అవసరాలు సరుకులను  మార్కెట్ లకు సరఫరా చేసేందుకు వచ్చే లారీలను అనుమతి ఇస్తున్నాము

  • తెలంగాణ పోలీసుల పై చాలా గౌరవం ఉంది

  • తెలంగాణ పోలీసులు ప్రజలను కట్టడి చేస్తున్నారు. అలాగే వాళ్లకు సపోర్ట్ చేస్తున్నారు

  • నిత్యావసర సరుకులను కొనుగోలు చేసేవారు కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి

  • ప్రధానంగా యువత రోడ్డు పైకి రాకూడదు

  • మార్చి 31 వరకు లాక్ డౌన్ ఉంది.. పోలీసులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో పరిశీలించిన హోంమంత్రి

  • ప్రజల వద్ద ఎలాంటి సమాచారం ఉన్న రాచకొండ వాట్సప్ నెంబర్ కు కాని డయల్ 100 కు కాల్ చేయండి
  • ప్రైవేటు వాహనాల్లో ప్రయాణీకుల తరలింపు మా దృష్టికి వచ్చింది.. వారి పై చర్యలు తీసుకుంటాం

  • కరోనా తగ్గిపోతుంది అనుకున్న సమయంలో మళ్లీ ఒక్కసారిగా పెరుగుతుంది... రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్


More Press News