దేవీచౌక్ అమ్మవారి సొగసుల మధ్య మెరిసిన పురాణపండ ‘సౌభాగ్య’

పరమవరేణ్యురాలైన కనకదుర్గమ్మకు కమనీయంగా , రమణీయంగా జరిగే శ్రీదేవీ శరన్నవరాత్రోత్సవాల పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం దేవీచౌక్ అమ్మవారిని ఈ దసరా ఉత్సవాల్లో దర్శించుకునే , అర్చించుకునే వేలమంది భక్తులకు ఈసారి ఒక అపురూప పవిత్రకానుకను సమర్పిస్తున్నారు. అరిష్టశక్తులమీద విజయంగా ప్రముఖ రచయిత, శ్రీశైలదేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారు పురాణపండ శ్రీనివాస్ రచనా  సంకలనంగా  అద్భుతంగా రూపొందించిన ‘సౌభాగ్య’ వర్ణమయ గ్రంథం ఈసారి భక్తజన సందోహాన్ని తన్మయింప జేస్తోంది.

అమ్మవారి అనుగ్రహంతో అందరినీ సమృద్ధం చేయడానికి సాధకుల నుంచి సామాన్యుల వరకూ ఆకట్టుకునేలా నాణ్యతా ప్రమాణాలతో ముద్రించబడిన ఈ సౌభాగ్య మంగళమయ గ్రంథంలో సుమారు ఇరవైఐదు పవిత్రఅంశాలు చోటు చేసుకోవడం విశేషం. గత నాలుగు  సంవత్సరాలుగా  బెజవాడ కనకదుర్గమ్మకు ప్రతీ దుర్గానవరాత్రోత్సవాల సందర్భంగా ఒక పవిత్ర ప్రత్యేక గ్రంథాన్ని అందిస్తున్న జ్ఞానమహాయజ్ఞ కేంద్రం సంస్థ ఈ సంవత్సరం ప్రత్యేకంగా దేవీచౌక్ ఉత్సవాలకు ఈ మంత్ర సంపదను సిద్ధం చేయడంతో  అర్చక పండితుల నుంచి అభినందలు వెల్లువెత్తుతున్నాయి.  

భక్త కోటికి ఉచితంగా అందించే ఈ మహత్వ శక్తుల ‘సౌభాగ్య’ గ్రంథాన్ని ఉత్సవాల తొలిరోజైన గురువారం పాడ్యమి సందర్భంగా దేవీచౌక్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బత్తుల రాజరాజేశ్వరరావు ప్రోత్సాహంతో  ఉత్సవ ప్రధాన పురోహితులు  దొంతంశెట్టి కాళహస్తీశ్వరరావు అమ్మవారి ముందు ఈ సౌభాగ్య గ్రంథానికి అర్చన చెయ్యడం విశేషం.

దశాబ్దాలుగా కోస్తాజిల్లాల్లో  అత్యంత వైభవంగా, పరమ ప్రతిష్ఠాకరంగా జరిగే దేవీచౌక్ శ్రీదేవీ నవరాత్రుల ఉత్సవాల్లో ఈసారి  ముత్తయిదువులకు కుంకుమార్చనల్లో ఈ ' సౌభాగ్య' గ్రంథాన్ని  నిర్వాహకుల్లో ఒకరైన మల్లేశ్వరరావు ఉచితంగా అందజేస్తున్నారు.  శ్రీ జ్ఞానసరస్వతీ ఆలయ ట్రస్ట్ చైర్మన్ తోటసుబ్బారావు, స్టాండర్డ్ ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ చెన్నాప్రగడ శ్రీనివాస్ (బాబు)  ఈ సౌభాగ్య గ్రంథానికి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.

   ఈ సందర్భంలో చిరంజీవి ఎన్.అఖిల్ దేవీ చౌక్ దుర్గమ్మ తల్లికి ఒక కుంకుమ బస్తాను ప్రధాన అర్చకుని ద్వారా సమర్పించి అమ్మవారి అనుగ్రహం పొందారు. శ్రీమాలిక , శ్రీపూర్ణిమ, మహాసౌందర్యం, యుగే యుగే , మహా మంత్రస్య, పచ్చకర్పూరం  ... వంటి ఎన్నో మహాద్భుత గ్రంథ సంపదతో గోదావరిజిల్లాల ఘనకీర్తిని  దేశదేశాల తెలుగువారి హృదయాలపై జయకేతంగా ఎగురవేసిన ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ అపురూప అద్భుత సంకలనం కావడంతో  భక్తులను విశేషంగా ఆకట్టుకుంతోందని విజ్ఞులు అభినందనలు కురిపిస్తున్నారు. కాకినాడలో లక్షలాదిమంది ఇలవేల్పుగా కొలుచుకునే శ్రీ బాలాత్రిపురసుందరీ దేవాలయం ప్రత్యేక అర్చనల్లో పురాణపండ శ్రీనివాస్ శ్రీ  ' సహస్ర ' గ్రంథం అందరినీ అలరిస్తోంది. అత్యధికులు పురాణపండ శ్రీనివాస్ గ్రంధాన్ని వినియోగించడం ఆశ్చర్యకరం.  ఈ అపురూప గ్రంథాల్లో అత్యంత అరుదైన వర్ణమయ చిత్రాలు, శ్రీనివాస్ వ్యాఖ్యాన భాషాసౌందర్యాల సొగసులు విశేషంగా ఆకట్టుకుంటున్నాయని అర్చక పండితులు పేర్కొనడం గమనార్హం.  

More Press News