జిరో ఫెస్టివల్ 2024ను సమర్పిస్తున్న సిగ్నేచర్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్

భారతదేశంలో గొప్ప పర్యావరణస్నేహి సంగీత ఉత్సవంలో ప్రత్యామ్నాయ జీవన విధానం

సిగ్నేచర్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ తమ దీర్ఘకాల భాగస్వామ్యాన్ని భారతదేశంలోని అత్యంత హరిత సంగీత ఉత్సవంతో కొనసాగిస్తోంది. ఇందులో అద్భుతమైన కళాకారులు: తమిక్రెస్ట్, బల్లిమారాన్, హనుమాన్‌కైండ్, డాబ్జీ, తదితరులు ఉన్నారు. నేషనల్, 18 సెప్టెంబరు 2024: ‘‘వినేవారికి సంగీతాన్ని వినిపించే పుడమి ఉంది’’ -విలియం షేక్‌స్పియర్. 

ప్రకృతి తరచూ తనను తాను ప్రత్యేకమైన, అందమైన మార్గాల్లో ఆవిష్కరించుకుంటుంది. ప్రకృతి మధ్య జీవించిన జీవితం, దానిపై వేడుక ఆచరించుకోవడం, దానిని సంరక్షించడం అవన్నీ పుడమితల్లికి బహుమతులే. చక్కగా జీవించడం, మంచి చేయడం తద్వారా మన జీవితాలను, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని సుసంపన్నం చేయగలదని మేము అర్థం చేసుకున్నాము.
సిగ్నేచర్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ తన ప్రేక్షకులను సహజంగా ఉంచేందుకు, మంచి జీవితాన్ని గడిపేందుకు, #వన్‌ విత్ నేచర్‌గా ఉండేందుకు స్ఫూర్తినిస్తుందని విశ్వసిస్తుంది. అందుకే, వారు ప్రకృతిలో భాగంగా భారతదేశంలో అతిపెద్ద, గొప్ప పండగలలో ఒకటైన జిరో ఫెస్టివల్‌తో తమ దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని జిరో వ్యాలీలో పచ్చని విస్తీర్ణంలో నిర్వహిస్తున్న ఈ 4-రోజుల పండుగ ఒక ప్రత్యామ్నాయ జీవన విధానంలో లీనమై ఉంటుంది.

ఇది ప్రకృతి ఔత్సాహికులు, సంగీత అభిమానులను ఆకర్షించేందుకు రూపొందించబడిన గొప్ప మరియు విభిన్న అనుభవాలను అందిస్తుంది. పర్యావరణ స్పృహతో కూడిన అభ్యాసాల నుంచి లీనమయ్యేలా చేసే సాంస్కృతిక మరియు సంగీత ఆఫరింగ్‌ల వరకు ఉత్సవం ఒక ప్రత్యేకమైన వేదికను అందిస్తుంది. ఇక్కడ హాజరైనవారు అసాధారణమైన ప్రదర్శనలు, కార్యకలాపాలను ఆస్వాదిస్తూ ప్రకృతిని అత్యుత్తమంగా అనుభవించవచ్చు. ఈ పండగ 26 సెప్టెంబరు మరియు 29 సెప్టెంబర్ 2024 మధ్య జరగనుంది. 

సిగ్నేచర్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ మరియు జిరో ఫెస్టివల్‌లు మెరుగైన ప్రపంచాన్ని పెంపొందించుకోవాలనే భాగస్వామ్య అభిరుచికి కట్టుబడి ఉంటాయి. స్పూర్తిదాయకమైన మాస్టర్‌ క్లాస్‌లు, ఫార్మ్ టు టేబుల్ వంటకాలు, ప్లగింగ్ కార్యకలాపాల ద్వారా స్పృహతో జీవించే వస్త్రాన్ని నేయడం తదితరాలతో ఈ పండుగ ప్రత్యేకమైన క్యాంప్‌సైట్‌లను అందిస్తుంది. ఈ పండగలో వెదురు, స్థానిక అపాటానీ హస్తకళ కూడా ఉంటుంది. బయోడిగ్రేడబుల్ తముల్ ప్లేట్‌లను ఉపయోగిస్తూ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌లను నివారిస్తుంది. సైనేజ్‌ల కోసం రిక్లయిమ్డ్ కలప ఉపయోగించబడుతుంది మరియు పునర్వినియోగ బాటిళ్లను ప్రోత్సహించేందుకు ఉచితంగా నీటిని అందించనుంది.

ఈ ఏడాది జిరో ఉత్సవం తమిక్రెస్ట్‌లోని లెజెండరీ టువరెగ్ బీట్స్, సోల్‌ఫుల్ కైలాష్ ఖేర్, హనుమాన్‌కైండ్ జానర్-బ్లెండింగ్, కేరళ నుంచి హిప్ హాప్ స్టార్ డాబ్జీ, సింగపూర్‌లోని పోస్ట్-రాక్ బ్యాండ్ అమెచ్యూర్ నియంత్రణలో ఉండగా, అరుణాచల్‌కు చెందిన డోబోమ్ డోజి కరోలినా నోర్బు, నేపాలీ చార్ట్-టాపర్ సుశాంత్ కేసీ,  స్వీడిష్ సైక్-రాక్ గ్రూప్ హాలో షిప్, వీణా మాస్ట్రో డా. జయంతి రమేష్ తదితరులు ఈ సంగీతకారుల శ్రేణిలో ఉన్నారు. ఈ విభిన్న సంగీతకారుల శ్రేణి నుంచి సంగీతం లోయలో ప్రతిధ్వనిస్తుంది. జిరోని ఇతర సంగీత ఉత్సవాల నుంచి ప్రత్యేకంగా నిలిపేలా చేస్తూ, ప్రేక్షకులకు కొత్త సంగీతం మరియు కళాకారులను కనుగొనేలా చేస్తుంది.

డియాజియో ఇండియా మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ మరియు పోర్ట్‌ఫోలియో హెడ్ వరుణ్ కూరిచ్ మాట్లాడుతూ, “మేము జిరో మ్యూజిక్ ఫెస్టివల్‌ను సమర్పణ భాగస్వామిగా మా సంబంధాన్ని కొనసాగిస్తున్నందున, కొత్త తరపు వినియోగదారులు తమ ఎంపికలలో చురుగ్గా, సమాచారంతో, ఉద్దేశ్యపూర్వకంగా, అర్థవంతమైన అనుభవాలను కోరుకుంటారని మేము గుర్తించాము. నేటి విభిన్న ప్రేక్షకుల మధ్య ఆలోచనాత్మక జీవనం వైపు స్పష్టమైన మార్పు ఉంది. సిగ్నేచర్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ యొక్క ‘లివ్ గుడ్, డూ గుడ్’ ఫిలాసఫీ మరియు జిరో మ్యూజిక్ ఫెస్టివల్ భారతదేశంలో అత్యంత పర్యావరణ-స్నేహపూర్వక సంగీత ఉత్సవాలలో ఒకటిగా కీర్తిని పొందడం మధ్య గత సంవత్సరం విజయం సినర్జీని బలోపేతం చేసింది. ఈ ఏడాది, మా దృష్టి ఆ విజయాన్ని నిర్మిస్తూ, దానిని కొత్త శిఖరాలకు తీసుకెళ్లే ఉద్దేశాన్ని కలిగిఉన్నాము. అద్భుతమైన అరుణాచల్ ప్రదేశ్‌లో ఏర్పాటు చేయబడిన ఈ పండగ నక్షత్రాల శ్రేణి, లీనమయ్యే అనుభవాలు, ఫారం నుంచి టేబుల్ వరకు వచ్చే వంటకాలు మరియు పర్యావరణ స్పృహతో కూడిన కార్యక్రమాలను అందిస్తుంది. మా భాగస్వామ్యం ప్రకృతి ఔత్సాహికులను ఒకచోట చేర్చి, సిగ్నేచర్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌ను సంగీతం మరియు పర్యావరణ స్పృహతో కూడిన జీవనాన్ని మిళితం చేసి ప్రకృతితో అర్థవంతమైన అనుసంధానాలను ప్రారంభించడానికి లీనమయ్యే మరియు ప్రభావవంతమైన అనుభవాన్ని సృష్టించే ప్రదేశంలో ముందంజలో ఉంచడం లక్ష్యంగా పెట్టుకున్నాము’’ అని వివరించారు.

జిరో ఫెస్టివల్ సహ వ్యవస్థాపకుడు మరియు క్రియేటివ్ ప్రొడ్యూసర్ అనుప్ కుట్టి మాట్లాడుతూ, ‘‘జిరో  ఫెస్టివల్ ఎల్లప్పుడూ కొత్త శబ్దాలను కనుగొనడం, అద్భుతమైన జిరో వ్యాలీ నేపథ్యంలో కళాకారులు విభిన్నమైన, ప్రపంచ ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యే స్థలాన్ని సృష్టించే ఉద్దేశాన్ని కలిగి ఉంది. ప్రతి ఏడాది, ప్రపంచంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన సంగీతాభిమానులు, కళాకారులు ఇచ్చే ప్రదర్వనలు ఎంత సందడిగా ఉంటాయో చూసి మేము ఆశ్చర్యపోయాము. ఇది జిరో ఫెస్టివల్‌ను చాలా ప్రత్యేకమైనదిగా చేస్తుంది. ఈ ఆవిష్కరణకు మద్దతునిచ్చే సిగ్నేచర్ వంటి భాగస్వాములను కలిగి ఉన్నందుకు మేము సంతోషిస్తున్నాము’’ అని తెలిపారు.

జిరో ఫెస్టివల్ సహ వ్యవస్థాపకుడు మరియు ఫెస్టివల్ డైరెక్టర్ బాబీ హనో మాట్లాడుతూ “జిరో ఫెస్టివల్ ప్రారంభం నుంచి తన హృదయంలో సుస్థిరతను కలిగి ఉంది. సిగ్నేచర్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌తో మా భాగస్వామ్యం సంగీతాన్ని, సంస్కృతిని వేడుకగా ఆచరించుకుంటూ, పర్యావరణాన్ని పరిరక్షించడంలో మా నిబద్ధతను కొనసాగించంలో ముఖ్యమైన దశను అనుసరిస్తున్నాము. వారితో కలిసి, మనలాంటి సంఘటనలు పర్యావరణ స్పృహతో కూడిన అభ్యాసాలను ప్రభావవంతమైన, చిరస్మరణీయ అనుభవాలతో ఎలా సమతుల్యం చేస్తాయో ప్రదర్శించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము’’ అని వివరించారు. 

సిగ్నేచర్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ గ్రీన్ సీకర్స్‌ను జిరోలో ప్రకృతిలోని  ప్రామాణికమైన అనుభవాలను తిరిగి అనుసంధానం చేసేందుకు, ఆనందించేందుకు ఆహ్వానిస్తుంది. అదే సమయంలో మరింత శక్తివంతమైన మరియు సామరస్యపూర్వకమైన భవిష్యత్తు కోసం బుద్ధిపూర్వకంగా జీవించే కళను స్వీకరిస్తుంది.

అనుభవాలను కోసం ఇక్కడ అనుసరించండి:  https://www.instagram.com/signaturegreenvibes/
డియాజియో గ్లోబల్ బాధ్యతాయుతమైన డ్రింకింగ్ రిసోర్స్, సమాచారం, చొరవలు మరియు ఉత్తమ అభ్యాసాలను పంచుకునే మార్గాల కోసం http://www.DRINKiQ.comని సందర్శించండి.

More Press News