శరవేగంగా అన్న క్యాంటీన్ పనులు పూర్తి చేయండి: కమిషనర్ ధ్యానచంద్ర

అన్న క్యాంటీన్ ల పునఃనిర్మాణం పనులు సత్వరమే పూర్తి చేసి త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ఆదివారంనాడు తన పర్యటనలో భాగంగా పటమట, కృష్ణలంకలోని అన్న క్యాంటీన్లను  క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులను ఆదేశించారు.

తదుపరి, పటమట లోని  చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియం సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడున్న ప్రజలతో మాట్లాడి విజయవాడ నగరపాలక సంస్థ కల్పించిన సదుపాయాలు, ఎలా ఉన్నాయి అని అడిగి తెలుసుకున్నారు. స్టేడియం లో ఉన్న మరమతులను త్వరగా పూర్తిచేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి అని అధికారులను ఆదేశించారు. కృష్ణలంకలోని అమరజీవి పొట్టి శ్రీరాములు నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల బయట గ్రీనరీ పెంచాలని, పారిశుధ్య నిర్వహణ పక్కాగా చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ పర్యటనలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రతోపాటు జోనల్ కమిషనర్ ఎస్ శివరామకృష్ణ, డిప్యూటీ సిటీ ప్లానర్ జూబిన్ చీరన్ రాయ్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జీ సామ్రాజ్యం,  అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బాబు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

More Press News