వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య బాధ్యతలు స్వీకరించిన రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌

Related image

హైదరాబాద్, డిసెంబర్ 18 :: ఈరోజు డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ బాధ్యతలు స్వీకరించారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన TSRTC, రవాణా శాఖకు సంబంధించిన 3 ఫైళ్లపై సంతకం చేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసికానికి బస్‌పాస్‌లకు రాయితీల ఖర్చు రీయింబర్స్‌మెంట్ కోసం 212.50 కోట్లను విడుదల చేస్తూ ఒక ఫైలుపై, 2023-24 ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసికానికి గాను 162.50 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ మరొక ఫైలుపై, శ్రీమతి L. రాజ్య లక్ష్మి, W/o దివంగత L. పాండు బాబు, హెడ్ ట్రాన్స్‌ పోర్ట్ కానిస్టేబుల్‌కి ఒక లక్ష రూపాయలు మెడికల్ క్లెయిమ్‌ మంజూరు చేస్తు మూడవ ఫైల్ సంతకం చేశారు. ఈ సందర్భంగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు వివేక్, ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ముఖ్య కార్యదర్శులు బుర్రా వెంకటేశం, వాణీప్రసాద్‌, టీఎస్‌ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్‌ తదితరులు అభినందించారు.

  

More Press Releases