"కొన్ని ఉత్తమ సస్పెన్స్ థ్రిల్లర్‌లు దక్షిణ భారతదేశంలోనే రూపొందించబడ్డాయి" అని వెల్లడించిన కునాల్ రాయ్ కపూర్

Related image

జీ థియేటర్ యొక్క క్లిఫ్‌హ్యాంగర్ 'షడ్యంత్ర'లో నటించిన ఈ నటుడు, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లోని  ప్రేక్షకులను ఆకట్టుకునేలా అత్యంత ఉత్కంఠ భరితమైన కథనం ను ఇది కలిగి ఉందని వెల్లడించారు.


2006లో 'ది ప్రెసిడెంట్ ఈజ్ కమింగ్' అనే కామెడీకి దర్శకత్వం వహించిన కునాల్ రాయ్ కపూర్, 'జస్ట్ మొహబ్బత్' (1997), 'ముంబయి కాలింగ్' (2009), మరియు 'ఢిల్లీ బెల్లీ ' (2011), 'యే జవానీ హై దీవానీ' (2013) మరియు అనేక చిత్రాలలో ప్రతిభా వంతుడైన నటుడిగా తనను తాను నిరూపించుకున్నాడు. జీ థియేటర్ యొక్క ఉత్కంఠభరితమైన టెలిప్లే, 'షద్యంత్ర'లో పరిశోధనాత్మక పోలీసు అధికారిగా ముఖ్యమైన పాత్ర పోషించిన ఆయన , దాని ఆకట్టుకునే కథాంశం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలోని ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే విశ్వాసం వ్యక్తం చేశారు.

 
ఆయనే తన నమ్మకానికి గల కారణాన్ని వివరిస్తూ  "దక్షిణ భారతదేశంలో కొన్ని ఉత్తమ సస్పెన్స్‌ఫుల్ థ్రిల్లర్‌లు రూపొందించబడ్డాయి మరియు తెలుగు ప్రేక్షకులు 'షడ్యంత్ర'ని ఆదరిస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఈ నాటకంలో చమత్కారమైన మలుపులు, అద్భుతమైన  ప్రదర్శనలు మరియు వున్నత స్థాయి నాటకీయత ఉన్నాయి. ఇది వివిధ భాషల్లోకి అనువదించబడటం మరియు విస్తృత శ్రేణి లో  ప్రేక్షకుల మన్నన  పొందడం పట్ల నేను నిజంగా చాలా సంతోషిస్తున్నాను" అని అన్నారు


అత్యాశతో కూడిన కన్స్ట్రక్షన్ మేనేజర్  రోహన్ తివారీ తన భార్య నటాషా మరణాన్ని తనకు అనుకూలముగా  చేసుకోవడం ద్వారా ఆమె కంపెనీని స్వాధీనం చేసుకోవాలనుకునే కుతంత్రాలతో కథ ప్రారంభమవుతుంది. అయితే, బాగా ఆలోచించి అమలు చేసిన హత్య ప్లాన్ బెడిసికొట్టి,   ఊహించని హత్య జరుగుతుంది.  ఆ తరువాత చోటుచేసుకునే సంఘటనలు ఆద్యంతం ఆసక్తిని కలిగిస్తాయి.  ఈ మిస్టరీ చేధించే  పోలీసు అధికారి మోహన్ ఖన్నా పాత్రను కపూర్ పోషించాడు.


దక్షిణ భారతదేశంలోని థియేటర్ మరియు సినిమా యొక్క గొప్ప వారసత్వం గురించి కపూర్‌ మాట్లాడుతూ "నేను ప్రాంతీయ నాటక రచయితలు మరియు చిత్రనిర్మాతలను బాగా ఆరాధిస్తాను. కన్నడకు చెందిన 'హయవదన' వంటి ప్రాంతీయ క్లాసిక్‌ల యొక్క కొన్ని అద్భుతమైన ఆంగ్ల అనుసరణలలో నేను భాగమయ్యాను. గొప్ప నాటక రచయిత, నటుడు మరియు దర్శకుడు గిరీష్ కర్నాడ్ రచించిన నాటకం అది . మేము ముంబై మరియు కోల్‌కతాలో ప్రదర్శనలు చేసాము మరియు అవి చాలా బాగా ప్రశంసించబడ్డాయి. నేను  ఒక తెలుగు చిత్రంలో పనిచేశాను మరియు కన్నడ సినిమాలో కూడా పనిచేయాలనుకుంటున్నాను" అని అన్నారు. మరిన్ని టెలిప్లేలు ప్రాంతీయ భాషల్లోకి అనువదించబడాలని కపూర్ అభిప్రాయపడ్డారు. 


ఈ టెలిప్లేకి గణేష్ యాదవ్ దర్శకత్వం వహించారు మరియు హీనా ఖాన్, చందన్ రాయ్ సన్యాల్ మరియు శ్రుతి బాప్నా కూడా దీనిలో నటించారు. ఇది నవంబర్ 4న ఎయిర్‌టెల్ థియేటర్, డిష్ టీవీ రంగ్‌మంచ్ యాక్టివ్ మరియు డి2హెచ్ రంగ్‌మంచ్ యాక్టివ్‌లలో ప్రసారం చేయబడుతుంది.

More Press Releases