విద్య & నైపుణ్యం భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లడానికి విద్యా మంత్రిత్వ శాఖ, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖతో మెటా భాగస్వామ్యం

Related image

న్యూఢిల్లీ, 6 సెప్టెంబర్ 2023: భారతదేశం అంతటా విద్యార్థులు, అధ్యాపకులు, వ్యవస్థాపకులకు సాధికారత కల్పించేందుకు విద్యా మంత్రిత్వ శాఖ మరియు నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖతో మూడు సంవత్సరాల భాగస్వామ్యాన్ని మెటా ఈరోజు ప్రకటించింది. ఈ భాగస్వామ్యం విద్య, నైపుణ్యం రంగాల్లో మెటా   కార్యకలాపాలను ఒకచోట చేర్చింది, తరగతి గది నుండి శ్రామికశక్తి వరకు భారతదేశ విద్యార్థుల ప్రయాణాన్ని మ్యాపింగ్ చేస్తుంది.

ఈ భాగస్వామ్యం కింద, మెటా మూడు లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ (LoI)పై సంతకం చేసింది.  భారతదేశంలో వ్యవ స్థాపకత, నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడానికి శిక్షణ, కన్సల్టెన్సీ, పరిశోధనలో నిమగ్నమైన నేషనల్ ఇన్‌స్టి ట్యూట్ ఫర్ ఆంత్రప్రెన్యూర్‌షిప్ అండ్ స్మాల్ బిజినెస్ డెవలప్‌మెంట్ (NIESBUD), ఉన్నత విద్య విభాగం కింద ఉన్న చట్టబద్ధమైన సంస్థ, జాతీయ స్థాయి కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అయిన  ఆల్ ఇండియా కౌ న్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE), ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించి భారతదేశం లోని జాతీయ స్థాయి విద్యా మండలి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) వీటిలో ఉన్నాయి.

ఈ సందర్భంగా కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ, భారతదేశాన్ని ప్రపంచానికి నైపుణ్య రాజధానిగా మార్చడం, మన యువతకు సాధికారత కల్పించాలనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దార్శనికతను ఈరోజు ప్రారంభించిన కార్యక్రమం మరింత శక్తివంతం చేస్తుందని  అన్నా రు. “‘ఎడ్యుకేషన్ టు ఆంత్రప్రెన్యూర్‌షిప్’ భాగస్వామ్యం ఓ సంచలనం. ఇది డిజిటల్ స్కిల్లింగ్‌ను క్షేత్రస్థాయికి తీసుకువెళుతుంది. ఇది మన టాలెంట్ పూల్ సామర్థ్యాలను పెంపొందిస్తుంది, విద్యార్థులు, యువత, శ్రామిక శక్తి & సూక్ష్మ పారిశ్రామికవేత్తలను, భవిష్యత్తు సాంకేతికతలతో సజావుగా అనుసంధానం చేస్తుంది. యువశక్తిని కొత్త-యుగం సమస్య పరిష్కారాలు అందించేవారిగా, వ్యవస్థాపకులుగా మారుస్తుంది. భారతదేశ   ప్రజాస్వామ్యం, జనాభా,  వైవిధ్యం సాంకేతిక పరివర్తనతో అనుసంధానించబడి ఉంటాయి, తద్వారా సాంకేతికత మొత్తం సమాజానికి సమానమైనదిగా మారుతుంది. NIESBUD, CBSE & AICTE లతో NEP  సిద్ధాంతా ల ద్వారా మార్గనిర్దేశం చేయబడిన META భాగస్వామ్యాలు మన జనాభాను క్లిష్టమైన డిజిటల్ నైపుణ్యాలతో సన్నద్ధం చేయడానికి, సూక్ష్మ పారిశ్రామికవేత్తలు, చిన్న వ్యాపారాలకు సాధికారత కల్పించడానికి అనంతమైన అవకాశాలను ఉత్ప్రేరకపరుస్తాయి” అని ఆయన అన్నారు.

ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్కిల్ డెవలప్‌మెంట్ & ఆంత్రప్రెన్యూర్‌షిప్ శాఖ సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ తన ప్రసంగంలో, “ఈ వేగవంతమైన పరివర్తన కాలంలో మన యువత, శ్రామికశక్తిని విజయవంతం చేయడానికి, సాంకేతికత, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ  అభివృద్ధి చెందుతున్న సందర్భంలో ముఖ్యమైన పాత్రలను పోషించడానికి వీలుగా వారిని  నైపుణ్యాలతో సన్నద్ధం చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆవిష్కరణ పర్యా వరణ వ్యవస్థలో నైపుణ్యం, వ్యవస్థాపకతలకు ప్రాతినిథ్యం వహిస్తూ డిజిటల్ నైపుణ్యాలు,  మరింత ముఖ్యంగా లక్షలాది చిన్న గ్రామీణ, సూక్ష్మ మరియు స్వయం ఉపాధి వ్యవస్థాపకుల మధ్య వారధిగా నిలుస్తాయి, వారు విస్తరించడానికి వీలు కల్పిస్తాయి, ఎదగండి మరియు విజయవంతం అవ్వండి’’ అని ఆయన అన్నారు.

భారతదేశంలో మెటా వైస్ ప్రెసిడెంట్ సంధ్యా దేవనాథన్ మాట్లాడుతూ, “భారతదేశం యొక్క G20 ప్రెసిడెన్సీ దాని డిజిటల్ పరివర్తన కార్యక్రమాలలో దేశ విజయాన్ని ప్రదర్శించింది. ఉద్యోగ కల్పన, తయారీ ఆర్థిక వ్యవ స్థను ప్రోత్సహించడం, నైపుణ్యాభివృద్ధి మొదలుకొని వినియోగదారు భద్రత, విద్య వరకు భారతదేశం యొక్క G20 ప్రాధాన్యతలను ముందుకు తీసుకెళ్లడానికి మెటా అనేక వర్కింగ్ గ్రూపులు, ఏజెన్సీలతో భాగస్వామ్యం కలిగి ఉంది. భారతదేశం G20 అధ్యక్షురాలిగా ఉన్న సంవత్సరంలో ఈ భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించ డానికి, విద్య మంత్రిత్వ శాఖ, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖతో ఈ సహకారం భారతదేశపు  డిజిటల్ ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వంతో భాగస్వామ్యం కావడానికి మా దీర్ఘకాలిక నిబద్ధ తకు మరో నిదర్శనం. చేకూర్పు, నైపుణ్యం, పెరుగుదల, కమ్యూనిటీలను నిర్మించడం,  ప్రపంచాన్ని ఒకచోట చేర్చడం వంటి మా విలువలతో సమలేఖనం చేస్తుంది’’ అని అన్నారు.

NIESBUD భాగస్వామ్యంతో, ఒక మిలియన్ వ్యాపారవేత్తలు రాబోయే 3 సంవత్సరాలలో మెటా ద్వారా డిజి టల్ మార్కెటింగ్ నైపుణ్యాలను పొందగలరు. ఇంకా, 7 ప్రాంతీయ భాషల్లో ఫేస్‌బుక్, వాట్సాప్,  ఇన్‌స్టాగ్రామ్ వంటి మెటా ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించి వర్ధమాన మరియు ఇప్పటికే ఉన్న వ్యవస్థాపకులకు డిజిటల్ మార్కెటింగ్ నైపుణ్యాలలో శిక్షణ ఇవ్వబడుతుంది. ప్రాంతీయ భాషల నుండి 50 ప్రభావ కథనాలు గుర్తించబడ తాయి. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ (FICCI),  కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇం డియా ట్రేడర్స్ (CAIT) ఈ కార్యక్రమ అమలు భాగస్వాములుగా ఉంటాయి.

మెటా ఈ ఏడాది జూలైలో AICTEతో క్రియేటర్స్ ఆఫ్ మెటావర్స్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. దీని ద్వారా 100,000 మంది విద్యార్థులు, 20,000 మంది అధ్యాపకులు AR,VR, AI, XR టెక్నాలజీలలో నైపుణ్యం పొం దుతారు. అంతేగాకుండా AICTE అనుబంధ కళాశాలల్లోని విద్యార్థుల కోసం 2-సంవత్సరాల AVGC-XR-AI డిప్లొమా కోర్సు ప్రవేశపెట్టబడుతుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులకు  AI, AR, XR సాంకేతికతలపై పాఠ్యాం శాలను రూపొందించడంలో సహాయపడటానికి మెటా ఎండ్-టు-ఎండ్ శిక్షణ, అప్‌స్కిల్లింగ్ మద్దతును అందిం చడం కొనసాగిస్తుంది. ఈ కోర్సు యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (AVGC) సెక్టార్‌లో నైపు ణ్యం పెంచడానికి, విద్యార్థులను ఉద్యోగానికి సిద్ధంగా ఉంచడానికి సహాయపడుతుంది.

డిసెంబర్ 2021లో ప్రారంభమై CBSEతో కొనసాగుతున్న భాగస్వామ్యాన్ని మెటా కలిగి ఉంది. దీని ద్వారా 10 మిలియన్ల మంది విద్యార్థులు, 1 మిలియన్ అధ్యాపకులు AR, VR, AI, డిజిటల్ సిటిజన్ షిప్ లో శిక్షణ పొం దుతారు. 2026 వరకు విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఎండ్-టు-ఎండ్ శిక్షణ, అప్ స్కిల్లింగ్ మద్దతును అందించడాన్ని మెటా కొనసాగిస్తుంది.

ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్కిల్ డెవలప్‌మెంట్ & ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ శాఖ సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్, విద్యా శాఖ సహాయమంత్రి అన్నపూర్ణా దేవి,  విద్యా శాఖ సహాయమంత్రి డా. సుభాస్ స ర్కార్, విద్యా శాఖ సహాయమంత్రి డా. రాజ్‌కుమార్ రంజన్ సింగ్ లతో సహా ఈ సందర్భంగా హాజరైన వివిధ ప్ర ముఖుల సమక్షంలో లెటర్ ఆఫ్ ఇంటెంట్‌లపై సంతకాలు జరిగాయి. మెటా ఇండియా వీపీ సంధ్యా దేవనాథ న్, మెటా ఇండియా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ శివనాథ్ తుక్రాల్, మెటా ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

ఈ సంవత్సరం ప్రారంభంలో, స్కిల్లింగ్ లో వినూత్నతలు, నైపుణ్యాల పెంపుదలలో అధునాతన సాంకేతికతల (VR & AR) పాత్రను ప్రదర్శించే G20 ఈవెంట్ కోసం నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NSDC) మరియు స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఆంత్రప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖతో భాగస్వామ్యం కూడా చేసుకుంది.

 
మెటా గురించి

వ్యక్తులు కనెక్ట్ అవ్వడానికి, కమ్యూనిటీలను కనుగొనడానికి, వ్యాపారాలను పెంచుకోవడానికి సహాయపడే సాంకేతికతలను మెటా రూపొందిస్తుంది. 2004లో ఫేస్‌బుక్ ప్రారంభించినప్పుడు, అది ప్రజలు కనెక్ట్ అయ్యే విధానాన్ని మార్చింది. మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి యాప్‌లు ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మందికి మరింత శక్తినిచ్చాయి. ఇప్పుడు, సామాజిక సాంకేతికతలో తదుపరి పరిణామాన్ని రూపొందించడంలో సహాయపడటానికి Meta 2D స్క్రీన్‌లను దాటి ఆగ్మెంటెడ్, వర్చువల్ రియాలిటీ వంటి లీనమయ్యే అనుభవాల వైపు కదులుతోంది.

More Press Releases