భారతదేశపు మొట్టమొదటి 16 GB* RAM స్మార్ట్‌ఫోన్‌ S23 ను ప్రత్యేకంగా అమెజాన్‌లో రూ. 8799కి విడుదల చేసిన ఐ టెల్ (itel)

Related image

భారతదేశమంతటా రిటైల్ అవుట్‌లెట్‌ల కోసం ప్రత్యేకంగా 8 GB* RAM వేరియంట్‌ను కూడా పరిచయం చేసింది


న్యూఢిల్లీ, జూన్ 9, 2023: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లలో ఒకటైన itel, దాని ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్, itel S23 ను సబ్-9k కేటగిరీలో  విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది .    భారతదేశపు మొదటి 16 GB RAM* ఫోన్‌ ఇది.  మెమరీ ఫ్యూజన్ ద్వారా  అత్యధిక ర్యామ్ అందిస్తుంది. మొబైల్ పరిశ్రమలో కొత్త బెంచ్‌మార్క్‌లను ఏర్పాటు  చేస్తూ, itel S23 16 GB ప్రత్యేకంగా అమెజాన్‌లో విడుదల కావటానికి సిద్ధంగా ఉంది. itel గత కొన్ని నెలల్లో A60, P40 వంటి విప్లవాత్మక  ఉత్పత్తులను  INR 8,000 ఉప విభాగంలో విడుదల చేసి మిలియన్ల మంది హృదయాలను కైవసం చేసుకుంది, ఈ వినూత్న ఫ్లాగ్‌షిప్ ఉత్పత్తితో ఐటెల్ మునుపెన్నడూ లేని విధంగా సబ్ 10K  స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయించడానికి సిద్ధంగా ఉంది .  ఈ నూతన స్మార్ట్ ఫోన్  ధర INR 8799/-.


itel S23 తమ  విభాగంలో చక్కదనం మరియు పనితీరును పునర్నిర్వచిస్తుంది మరియు అద్భుతమైన సూపర్ క్లియర్ 50MP వెనుక కెమెరా, ఫ్లాష్‌తో కూడిన ఆకట్టుకునే 8MP గ్లోయింగ్ AI ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ఇది ప్రతి క్షణాన్ని అత్యుత్తమ స్పష్టత మరియు సూక్ష్మ అంశాలతో సహా ఒడిసిపట్టటానికి  S23ని అనుమతిస్తుంది. అదనంగా, itel S23,  8GB* వేరియంట్‌లో కూడా అందుబాటులో ఉంది, తద్వారా విస్తృత శ్రేణి వినియోగదారుల అవసరాలను తీర్చనుంది . 


ఈ ఆవిష్కరణ పై ఐటెల్ ఇండియా సీఈఓ శ్రీ అరిజీత్ తలపాత్ర మాట్లాడుతూ , “నేడు వినియోగదారులు చాలా ఆప్రమప్తతతో ఉన్నారు మరియు వారి ఇష్టాలు, ఎంపికలు మరియు ఫ్యాషన్ అంశాల పరంగా తమకు కావాల్సినవి డిమాండ్ చేస్తున్నారు. అదీ కాక వినియోగ విధానాలలో సైతం పెద్ద మార్పు వచ్చింది. మొబైల్‌లు ఇకపై కేవలం పరికరాలు మాత్రమే కాదు, కొత్త భారత్‌లో వినోదం, జీవనశైలిలో అంతర్భాగంగా మారాయి. ఐటెల్‌లో మేము అత్యాధునిక ఫీచర్లు, స్టైలిష్ లుక్స్ మరియు నూతన తరపు సాంకేతికతతో కూడిన ఆవిష్కరణలను తీసుకురావడం ద్వారా మా వినియోగదారులకు సేవలందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నాము..." అని అన్నారు. 


ఈ ఫోన్ స్టార్రి బ్లాక్ మరియు మిస్టరీ వైట్ రంగులలో లభ్యమవుతుంది. 

More Press Releases