జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు

Related image

జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని  ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం వద్ద సీఎం కేసీఆర్‌కు పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం అందించారు. అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

 మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి కొండగట్టుపై ఉన్న కోనేరు, కొత్త పుష్కరిణి, బేతాళస్వామి ఆలయం, సీతమ్మ కన్నీటిధార, కొండలరాయుడి గుట్ట తదితర స్థలాలను పరిశీలించారు.   అనంతరం జేఎన్టీయూ సమావేశ మందిరంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 


     

More Press Releases