పల్నాడులో ప్రపంచ శ్రేణి స్పైసెస్‌ ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ను ప్రారంభించిన ఐటీసీ

Related image

·       ఈ యూనిట్‌లో మిరప, పసుపు మరియు మిశ్రమ మసాలా దినుసులు కోసం ప్రాసెసింగ్‌ లైన్స్‌ ఉంటాయి. దీని వార్షిక సామర్ధ్యం 20,400 మెట్రిక్‌ టన్నుల మసాలా దినుసులు.

·       ఈ ప్లాంట్‌లో సమగ్రమైన ప్రాసెసింగ్‌ అవసరాలు అయిన స్టోరేజీ, క్లీనింగ్‌, ప్రాసెసింగ్‌, స్టెరిలైజేషన్‌, ప్యాకింగ్‌ మరియు నాణ్యత పరీక్షల సదుపాయాలు ఉంటాయి. ఈ మౌలిక సదుపాయాలు  అంతర్జాతీయ ఫుడ్‌ సేఫ్టీ మార్గదర్శకాలకనుగుణంగా ఉంటాయి.

·       ఇది విస్తృతశ్రేణిలో ఉత్పత్తులను తయారుచేసి , ఎగుమతి చేయనుంది  మరియు వేలాది మంది భారతీయ రైతులను శక్తివంతం చేయడానికి స్పైసెస్‌ వాల్యూ చైన్స్‌ను కలుపుతుంది.

     పల్నాడు, 11 నవంబర్‌ 2022 :  భారతీయ బహుళజాతి సంస్ధ ఐటీసీ లిమిటెడ్‌ నేడు తమ అంతర్జాతీయంగా ప్రామాణీకరించబడిన స్పైసెస్‌ ప్లాంట్‌ను  ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు వద్ద ప్రారంభించింది. ఈ ప్లాంట్‌ను  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గౌరవనీయ ముఖ్యమంత్రి  శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి   ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో ఐటీసీ లిమిటెడ్‌ ఛైర్మన్‌ శ్రీ సంజీవ్‌ పురి తో పాటుగా ప్రత్యేక అతిథులు హాజరయ్యారు.
ఈ అత్యాధునిక కేంద్రంలో  పసుపు, మిరప, మిశ్రిత మసాలాల కోసం ప్రత్యేక ప్రాసెసింగ్‌ లైన్స్‌ ఉన్నాయి. ఈ కేంద్ర వార్షిక సామర్ధ్యం 20,400 మెట్రిక్‌ టన్నుల స్పైసెస్‌. దీనికి 15కు పైగా ఆర్గానిక్‌ స్పైసెస్‌ను ఉత్పత్తి చేసే సామర్ధ్యం ఉంది. ఇది అంతర్జాతీయంగా ఐటీసీ యొక్క ఆహార ఉత్పత్తులను అంతర్జాతీయంగా ఎగుమతి చేసే సామర్ధ్యం కలిగి ఉంది. యూరోప్‌, యుఎస్‌, కెనడా, ఆస్ట్రేలియా, చైనా వంటి దేశాలను ఇది లక్ష్యంగా చేసుకుంది.
ప్రపంచశ్రేణి మేక్‌ ఇన్‌ ఇండియా ప్లాంట్‌ ఇప్పుడు అన్ని ప్రాసెసింగ్‌ అవసరాలనూ తీర్చనుంది. దీనిలో స్టోరేజీ, క్లీనింగ్‌,  ప్రాసెసింగ్‌, స్టెరిలైజేషన్‌, ప్యాకింగ్‌, క్వాలిటీ టెస్టింగ్‌  వంటివి కూడా అందుబాటులో ఉండటం వల్ల నాణ్యతకు పూర్తి భరోసా అందిస్తుంది. ఈ యూనిట్‌లో సస్టెయినబల్‌ స్పైసెస్‌వాల్యూ చైన్‌ సైతం ఉండటం వల్ల, ట్రేసబిలిటీ నిర్దారించే బలమైన పంట అభివృద్ధి కార్యక్రమం ద్వారా రైతులకు మద్దతునిస్తుంది. దాదాపు 5500కు పైగా రైతు కుటుంబాలు, 2200 కు పైగా లైవ్లీహుడ్స్‌కు ఈ వాల్యూ చైన్‌ వ్యాప్తంగా మద్దతునందిస్తారు. ఈ సదుపాయానికి హైటెక్‌ ఎనర్జీ ఎఫీషియెంట్‌ ఎక్విన్‌మెంట్‌ మద్దతు అందిస్తుంది. రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్యానెల్స్‌ ఉండటం వల్ల స్వచ్ఛ విద్యుత్‌ వినియోగానికి భరోసా కలుగుతుంది. ఈ యూనిట్‌లో అధిక శాతం మహిళలు పనిచేస్తారు.
ఆంధ్రప్రదేశ్‌లో  ఈ కేంద్రం ప్రారంభించడం గురించి ఐటీసీ లిమిటెడ్‌ ఛైర్మన్‌  శ్రీ సంజీవ్‌ పురి మాట్లాడుతూ ‘‘ రాష్ట్ర ఆర్ధిక వ్యవస్ధలోని  మూడు కీలక రంగాలైన వ్యవసాయం, తయారీ మరియు సేవల రంగంలో  మా కార్యకలాపాలను బలోపేతం చేయాలనే నిబద్ధతకు అనుగుణంగా  మేము పల్నాడులో ప్రపంచశ్రేణి , ఎగుమతుల లక్ష్యంగా స్పైసెస్‌ సదుపాయం ప్రారంభించాము.  అంతర్జాతీయ  ఆహార భద్రతా ప్రమాణాలకనుగుణంగా  అత్యున్నత నాణ్యత కలిగిన  స్పైసెస్‌ను అందించడంతో పాటుగా స్థానిక వ్యవసాయ విలువ చైన్‌కూ తోడ్పాటునందించనున్నాము. సస్టెయినబిలిటీ మరియు ఇన్‌క్లూజన్‌కు ప్రతీకగా ఈ యూనిట్‌ నిలువనుండటంతో  పాటుగా  ఈ యూనిట్‌లోని సమగ్రమైన కార్యక్రమాల ద్వారా రైతుల ఆదాయం మెరుగుపరచడం, మహిళాసాధికారిత వృద్ది చేయడం, పెద్ద మొత్తంలో జీవనోపాధికి  మద్దతు అందించడం, పునరుత్పాదక విద్యుత్‌ను విస్తృతంగా వినియోగించడం చేయనుంది. వేగవంతంగా సామాజిక–ఆర్థిక మార్పును  చేరుకోవాలనే గౌరవనీయ ముఖ్యమంత్రి లక్ష్యానికి అనుగుణంగా  మేము ఆంధ్రప్రదేశ్‌లో బహు ముఖ  కార్యక్రమాలను  రాష్ట్ర ఉద్యానవన శాఖతో కలిసి ప్రారంభించాము. తద్వారా మిర్చీ సేకరణ పరంగా రాష్ట్రాన్ని అంతర్జాతీయ కేంద్రంగా మార్చనున్నాము. దీనితో  పాటుగా తయారీ, ఆతిథ్య రంగాలలో మా కార్యకలాపాలు విస్తరిస్తూనే  భారీ స్ధాయి సామాజిక పెట్టుబడుల కార్యక్రమాలలో  కూడా  కార్యకలాపాలు ప్రారంభించనున్నాము’’అని అన్నారు.

      ఆంధ్రప్రదేశ్‌తో  దశాబ్దాల భాగస్వామ్యం కలిగిన ఐటీసీ తమ కార్యకలాపాలను రాష్ట్ర ఆర్ధిక వ్యవస్ధలో అత్యంత కీలకమైన వ్యవసాయం, తయారీ,సేవల రంగాలలో నిర్వహిస్తోంది. ఈ కంపెనీ యొక్క విస్తృత శ్రేణి వ్యవసాయ –వ్యాపార ఉనికి రాష్ట్రంలో మసాలాలు, వరి, ఆక్వా,పండ్లు, పల్ప్‌ఉడ్‌ వంటి వ్యాప్తంగా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో  ఐటీసీ తయారీ కార్యక్రమాలు గత కొద్ది సంవత్సరాలుగా 18యూనిట్లతో బలోపేతమయ్యాయి.  దీనిలో సంస్థ సొంత తయారీ కేంద్రాలు కూడా ఉన్నాయి.  వీటి ద్వారా కంపెనీ స్థానిక వ్యవస్థాపకతను ప్రోత్సహిస్తోంది. ఐటీసీ ఓ 5 స్టార్‌ ప్రోపర్టీ, వెల్‌కమ్‌ హోటల్‌, గుంటూరులో ప్రారంభించింది. ప్రపంచ శ్రేణి ఆతిథ్య అవకాశాల నిధిగా నిలుస్తుంది.  ఈ ప్రతిష్టాత్మక హోటల్‌ మొట్టమొదటి లీడ్‌ ప్లాటినమ్‌ సర్టిఫైడ్‌ హోటల్‌గా ఆంధ్రప్రదేశ్‌లో నిలిచింది. అంతేకాదు ప్రపంచంలో మొదటి 8 లీడ్‌ జీరో కార్బన్‌ సర్టిఫైడ్‌  హోటల్స్‌లో ఒకటిగా కూడా నిలిచింది.
రాష్ట్రంలోని స్ధానిక కమ్యూనిటీలతో తమ సామాజిక పెట్టబడుల కార్యక్రమాల ద్వారా భాగస్వామ్యం చేసుకుంది. వీటిలో భారీ స్ధాయి అటవీ, నీటి పరిరక్షణ, వాతావరణ అనుకూల వ్యవసాయం, జీవవైవిధ్య పరిరక్షణ, ప్రాధమిక విద్య, వృత్తి విద్యా శిక్షణ, ఘన వ్యర్ధాల నిర్వహణ , పారిశుద్ధ్య వంటివి ఉన్నాయి.

More Press Releases