ఈ–ఇన్వాయిసింగ్‌ను స్వీకరించేందుకు కరీంనగర్‌లో ఎంఎస్‌ఎంఈలకు మద్దతునందించిన ట్యాలీ సొల్యూషన్స్

·       తెలంగాణాలో 13వేలకు  పైగా వ్యాపార సంస్ధలు అత్యంత సౌకర్యవంతంగా కార్యకలాపాలు చేసేలా తోడ్పడేందుకు  తగిన అవగాహన కల్పించడం లక్ష్యం·     

  ఒక్క క్లిక్‌తో ట్యాలీతో ఈ–ఇన్వాయిసింగ్‌ను వ్యాపార సంస్థలు సృష్టించవచ్చు

కరీంనగర్‌, 6 అక్టోబర్ 2022  : పది కోట్లు మరియు ఆపైన టర్నోవర్‌ కలిగిన  వ్యాపారం కలిగిన జీఎస్‌టీ నమోదిత సంస్ధలు తప్పనిసరిగా ఈ–ఇన్వాయిసింగ్‌ చేయాలనే  వ్యాపార సంస్ధలకు పూర్తి స్ధాయిలో సేవలను అందించడం ద్వారా ఈ–ఇన్వాయిసింగ్‌ను నిర్వహించడంతో పాటుగా అత్యంత సులభంగా ఈ–ఇన్వాయిసింగ్‌ పద్ధతికి తగిన మద్దతు అందించడానికి సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న ట్యాలీ సొల్యూషన్స్‌ సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ నిబంధనలకు కరీంనగర్‌లోని వ్యాపార సంస్థలు పూర్తి  సిద్ధంగా ఉండేలా తీర్చిదిద్దేందుకు విస్తృత శ్రేణిలో ప్రయత్నాలను కంపెనీ చేస్తోంది.


ఈ సమగ్రమైన విద్యా ప్రచారాన్ని కరీంనగర్‌లోని ఎంఎస్‌ఎంఈల కోసం ప్రారంభించారు.  దీనిద్వారా ఈ–ఇన్వాయిసింగ్‌ ప్రభావాలను గురించి, ఈ–వే బిల్‌, ఆడిట్‌ ట్రయల్‌ మరియు వ్యాపార ఉత్పాదకత మెరుగుపరుచుకుంటూనే అతి సులభంగా  మారడంలో  సాంకేతికత  ఏ విధంగా సహాయపడుతుందీ తెలుసుకునేందుకు వేలాది వ్యాపార సంస్థలకు తోడ్పడుతుంది. స్ధానిక వ్యాపార సంఘాలతో కలిసి ఈ సంస్థ పలు కార్యక్రమాలను నిర్వహించడంతో పాటుగా పలు ఎక్స్‌పోలలో పాల్గొనడం ద్వారా ఈ–ఇన్వాయిసింగ్‌ అమలు చుట్టూ అవగాహనను మెరుగుపరుస్తుంది.  అదనంగా, ఇది పలు కంటెంట్‌ క్రియేటర్లుతో సైతం కలిసి పనిచేస్తూ, వెబినార్లను  సబ్జెక్ట్‌ మ్యాటర్‌ నిపుణులతో కలిసి నిర్వహిస్తూ గరిష్టంగా వ్యాపార యజమానులను చేరుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ కంపెనీ తమ ఉద్యోగులకు సైతం శిక్షణ అందించడంతో పాటుగా 28వేలకు పైగా భాగస్వాములకు  సైతం శిక్షణ అందించడం ద్వారా వాట్సాప్‌  మద్దతుతో  కస్టమర్‌ సపోర్ట్‌ టీమ్‌ –ట్యాలీ కేర్‌ సహా  అన్ని టచ్‌ పాయింట్లలోనూ సరైన సమాచారం మాత్రమే పంచుకుంటారనే భరోసా అందిస్తుంది.


ఈ కార్యక్రమం గురించి  ట్యాలీ సొల్యూషన్స్‌ జనరల్‌ మేనేజర్‌–సౌత్‌ జోన్‌  భువన్‌ రంజన్‌ మాట్లాడుతూ ‘‘మరింతగా వ్యాపారాలను డిజిటలీకరించాలనే భారత ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా 10 కోట్ల రూపాయలు మరియు అంతకు మించిన టర్నోవర్‌  కలిగిన  వ్యాపారాలన్నీ కూడా  అక్టోబర్‌ 01నుంచి ఈ–ఇన్వాయిసింగ్‌ను అమలు చేయాలి. ఐదవ దశ ఈ–ఇన్వాయిసింగ్‌ అమలుతో దాదాపు 4.8 లక్షల వ్యాపార సంస్ధలు ఈ–ఇన్వాయిసింగ్‌ పరిధిలోకి వస్తాయి. వీటిలో దాదాపు 2.3 లక్షల వ్యాపార సంస్ధలు అక్టోబర్‌ 01 నుంచి నిబంధనలకు కట్టుబడి ప్రారంభించాలి. తమ పనితీరుపై ఇది ఏ విధంగా ప్రభావితం చూపుతుంది అనేది తెలుసుకోవడంతో పాటుగా  సాంకేతికత సహాయంతో అతి సులభంగా నిబంధనలను అనుసరించడం ఎంత సులభమనేది తెలియజేస్తున్నాము. కరీంనగర్‌ మాకు అత్యంత కీలకమైన మార్కెట్‌లలో ఒకటి. ఇక్కడ వేలాది వ్యాపార సంస్ధలు, పరిశ్రమలకు నిబంధనలకు కట్టుబడి ఉండేలా  అవగాహన కల్పిస్తున్నాము. ఈ సమగ్రమైన ప్రచారం ద్వారా  ఈ–ఇన్వాయిస్‌లను సాంకేతికత సహాయంతో ఏ విధంగా సింగిల్‌ క్లిక్‌తో  ట్యాలీ యొక్క విప్లవాత్మక సాఫ్ట్‌వేర్‌ ట్యాలీ ప్రైమ్‌తో సృష్టించవచ్చనేది వెల్లడిస్తున్నాము’’అని అన్నారు.


ఈ–ఇన్వాయిసింగ్‌కు సంబంధించి గత అమలు దశలలో అత్యధిక టర్నోవర్‌ కలిగిన వ్యాపార సంస్ధలకు  ట్యాలీ సహాయపడింది. ఇప్పుడు విస్తృత శ్రేణిలో వ్యాపార సంస్థలకు సైతం మద్దతు అందించడానికి కట్టుబడి ఉంది. బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ పరిష్కారాలలో  దాదాపు మూడు దశాబ్దాల నైపుణ్యం కలిగి ఉండటంతో పాటుగా ఎస్‌ఎంఈ  అవసరాలను పూర్తిగా అర్ధం చేసుకోవడం ద్వారా ట్యాలీ తమ ఎక్కౌంటింగ్‌, ఇన్వెంటరీ ,  సమ్మతి అవసరాల పరంగా 2 మిలియన్‌ వ్యాపార సంస్ధలకు సహాయపడింది. దేశ  వ్యాప్తంగా వ్యాపార యజమానులను చేరుకునేందుకు విస్తృత శ్రేణిలోని భాగస్వామ్య నెట్‌వర్క్‌ సహాయపడుతుంది.  అతి సులభమైన, ఆధారపడతగిన, సౌకర్యవంతమైన పరిష్కారాలతో ఈ సాఫ్ట్‌వేర్‌ ఇప్పటికీ దేశంలో చిరు, మధ్య తరహా వ్యాపార విభాగాల నడుమ ప్రాధాన్యతా ఎంపికగా నిలుస్తుంది.


More Press Releases