అధికదిగుబడులు ఇచ్చే పంటల రకాల వైపు రైతులను మళ్ళిస్తున్న తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ

Related image

పత్రిక ప్రకటన
-------------------------------
అధికదిగుబడులు ఇచ్చే పంటల రకాల వైపు రైతులను మళ్ళిస్తున్న తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ముఖ్యమంత్రి కె. సి. ఆర్. ఆశయాలు మేరకు రాష్ట్రానికి అనువైన 18 పంటలకు చెందిన 60 రకాల విత్తనాలు ఉత్పత్తి చేస్తున్న సంస్థ 2021-22 లో 33,619 ఎకరాల్లో 1,60,441 క్వింటాళ్ళ విత్తనాలు ఉత్పత్తి దేశ వ్యాప్తంగా 9 రాష్ట్రాలకు విత్తనాలు ఎగుమతి చేస్తున్న రాష్ట్ర విత్తన సంస్థ

హైదరాబాద్:10 జూలై,2022.
-----------------------------------------

తెలంగాణ సమగ్ర అభివృద్ధిలో వ్యవసాయరంగం ముఖ్యభూమిక పోషిస్తున్నది.రైతులు, వ్యవసాయ సమస్యల పట్ల అవగాహన ఉన్న ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో ప్రభుత్వం గత అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో సాగు విస్తీర్ణం, పంటలు దిగుబడి గణనీయంగా పెరిగింది. 2021-22 అంచనాలు ప్రకారం రాష్ట్ర స్థూల ఉత్పత్తికి 18.3 శాతాన్ని వ్యవసాయరంగం జమ చేసింది. వ్యవసాయరంగoపై 48.4% జనాభా ఆధారపడి జీవిస్తున్నది. రాష్ట్ర పారిశ్రామిక, సేవా రంగాలకు వ్యవసాయ రంగం ఊతంగా నిలుస్తున్నది.


అందులో భాగంగా స్థిరమైన వ్యవసాయాభివృవృద్ధికి దోహదపడే పంటలు, ఆయా ప్రాంతాల భూముల తీరుకు అనువైన రకాల పంటల విత్తనాలను రైతులకు అందించుటకు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కృషిచేస్తున్నది.ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆశయాలు మేరకు అధిక దిగుబడులు, అత్యధిక ఆదాయాన్నిచ్చే 18 పంటలకు చెందిన 60 రకాల విత్తనాలను రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ అభివృద్ధి చేసి రైతులకు అందుబాటులో ఉంచుతున్నది. రాష్ట్ర వాతావరణ పరిస్థితులు, చీడపీడలను తట్టుకునే రకాలపై ప్రదర్శన క్షేత్రాల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నది. 2021-22 లో 33,619 ఎకరాల విస్తీర్ణంలో 1,60,441 క్వింటాళ్ళ విత్తనాలను సంస్థ ఉత్పత్తి చేసింది. విత్తనాభివృద్ధి సంస్థ అభివృద్ధి చేస్తున్న పంటల రకాల్లో ప్రధాన పంటలు అయిన వరి,మిర్చి, పత్తి తో పాటు వేరుశనగ, కంది, మొక్కజొన్న, రాగి, కొర్రలు తదితర పంటల విత్తనాలు ఉన్నాయి.రాష్ట్ర విత్తనాభివృద్ధి కృషితో వైవిద్యమైన లాభదాయక పంటలు సాగువైపు తెలంగాణ రైతులు మళ్ళు తున్నారు.

రాష్ట్ర రైతులతో పాటు దేశంలో వ్యవసాయ ప్రధాన రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు,కర్ణాటక,కేరళ, మహారాష్ట్ర, బెంగాల్,ఛత్తిష్ గడ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా లకు వివిధ రకాల విత్తనాలను రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఎగుమతి చేస్తున్నది. అధిక దిగుబడులు ఇచ్చే వైవిద్య పంటలు సాగును ప్రోత్సహిస్తున్న తెలంగాణ రాష్ట్రం దేశ రైతాంగానికి వ్యవసాయ ప్రదర్శన క్షేత్రంగా నిలుస్తున్నది.


     
--------------------------------------------------------------------------------------------------------------
శ్రీయుత కమిషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ, హైదరాబాద్ వారిచే జారీ చేయనైనది.

More Press Releases