మాజీ మంత్రి బొజ్జల గోపాల‌కృష్ణారెడ్డి గారి చిత్రపటానికి పూల మాల వేసి శ్రద్ధాంజలి ఘటించిన తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

Related image

Media Release

Date-08-05-2022

*ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి బొజ్జల గోపాల‌కృష్ణారెడ్డి గారి చిత్రపటానికి పూల మాల వేసి శ్రద్ధాంజలి ఘటించిన తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు.*


ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం శ్రీకాళహస్తి లోని బొజ్జల ఇంటికి మంత్రి వెళ్ళారు.  బొజ్జల మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు ఆయనతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తన ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలిపారు *ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తనకు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అంటే ఎంతో గౌరవమని, ఇద్దరూ దాదాపు ఒకేసారి రాజకీయ జీవితాన్ని ప్రారంభించామన్నారు.*
శ్రీకాళహస్తి లో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బొజ్జల, ఉమ్మడి రాష్ట్రంలో టిడిపి హయాంలో అటవీశాఖ మంత్రిగా, ఆ తర్వాత ఐటీ శాఖ మంత్రిగా పనిచేసారన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుని ప్రార్థించారు.

More Press Releases