వాణిజ్య సముదాయాలలో ఖాళీగా ఉన్న షాపులను భర్తీ చేయాలి: వీఎంసీ కమిష‌న‌ర్ రంజిత్ భాషా

Related image

  • పార్క్ లను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలి
విజ‌య‌వాడ‌: నగరపాలక సంస్థ కమిషనర్ పి.రంజిత్ బాషా అధికారులతో కలసి ఏ.యం.సి కాంప్లెక్స్, ఎన్.టి.ఆర్ కాంప్లెక్స్ మరియు లెనిన్ సెంటర్ పార్క్, పాయకాపురం చెరువు పరిశీలించి వాటికీ సంబందించిన వివరాలు అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. ముందుగా గవర్నర్ పేట నందలి ఏ.యం.సి కాంప్లెక్స్ నందు వివిధ ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు నిమిత్తం ఇటివలే ఇంజనీరింగ్ శాఖ చేపట్టిన పనుల వివరాలు అధికారులను అడిగి తెలుసుకోని ఇంకను పూర్తి చేయవలసిన పనులు కూడా సత్వరమే పూర్తి చేయాలని అన్నారు.

అదే విధంగా ఎన్.టి.ఆర్ కాంప్లెక్స్ ను సందర్శించి అక్కడ గల షాపుల వివరాలు మరియు ఇతర వాణిజ్య సముదాయాల వివరాలు వాటి యొక్క ఆదాయ వనరులు మొదలగు అంశాలను ఎస్టేట్ అధికారులను అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంలో కాంప్లెక్స్ నందలి పాడైన షాపుల షట్టర్ లకు తగిన మరమ్మత్తులు చేపట్టుటకు అంచనాలు రూపొందించాలని ఆదేశిస్తూ, కాంప్లెక్స్ లలో గల అన్ని ఖాళీ షాపులను భర్తీ చేసి ఆదాయ వనరులు పెంపొందించుటకు చర్యలు తీసుకోవాలని అన్నారు. అదే విధంగా కాంప్లెక్స్ నందలి పారిశుధ్య నిర్వహణ విధానము మెరుగుపరచే విధంగా చూడాలని, ఇంకను ఏమైన సమస్యలు ఉన్నట్లయితే వాటిని పరిష్కరించాలని సూచించారు.

తదుపరి లెనిన్ సెంటర్ పార్క్ మరియు సింగ్ నగర్ ప్రాంతములోని పాయకాపురం చెరువు నందు జరుగుతున్న పార్క్ అభివృద్ధి పనుల యొక్క పురోగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకొని పలు ఆదేశాలు ఇచ్చారు. ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేలా పార్క్ నందు ఆకర్షనీయమైన మొక్కలు నాటి పచ్చదనంతో సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు.

ఈ పర్యటనలో ఎస్టేట్ ఆఫీసర్ టి.శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి.శ్రీనివాస్, హెల్త్ ఆఫీసర్ డా.రామకోటీశ్వరరావు మరియు ఇతర అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

More Press Releases