వీఎంసీ నూతన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన పి.రంజిత్ భాషా

Related image

  • అందరి సహకారంతో నగరాభివృద్దికి కృషి
విజయవాడ నగర పరిస్థితులపై అవగాహన ఉందని, ప్రజాప్రతినిధులు మరియు అధికారులతో కలసి టీమ్ వర్క్ చేసి నగరాభివృద్దికి కృషి చేస్తానని, నూతన కమిషనర్ గా భాద్యతలు చేపట్టిన పి.రంజిత్ భాషా అన్నారు.

నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్ లో నూతన కమిషనర్ గా పి.రంజిత్ భాషా నేడు బాధ్యతలు స్వీకరించారు. కమిషనర్ మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతిస్టాత్మకంగా ప్రవేశపెట్టిన నవరత్నాల ఫలాలు అర్హులైన వారందరికి అందు విధంగా సచివాలయముల ద్వారా ప్రజల ముంగిటకు సంక్షేమ పథకములు తీసుకొని వెళ్ళుట, ప్రజా సమస్యల పరిష్కారమునాకు సత్వరమే అవసరమైన చర్యలు గైకొనుట ప్రాధాన్యతా అంశములుగా పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వo అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకములు మరియు సంస్కరణలను పరిగణలోనికి తీసుకొని నగరాన్ని మరింతగా అభివృద్ధి పరచేవిధంగా తన వంతు కృషి చేస్తానని అన్నారు. పారిశుద్యం, ఆరోగ్యం, విద్యలతో పాటుగా నగరపాలక సంస్థ పరిధిలో గల అన్ని అంశాలపై పూర్తి స్థాయిలో అందరి సహకారంతో, వివిధ విభాగముల సమన్వయముతో నగరాన్ని అభివృద్ధి పథంలో అగ్రగామిగా నిలుపుటకు చర్యలు తీసుకుంటానని అన్నారు. తొలుత నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ (జనరల్) డా.జె.అరుణ మరియు అన్ని విభాగముల అధిపతులు నూతన కమిషనర్ కి స్వాగతం పలికారు.

నగరపాలక సంస్థ నందు కమిషనరుగా బాధ్యతలు స్వీకరించిన తదుపరి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు.

More Press Releases