గుగ్గిళ్ళ కృష్ణయ్య గౌడ్ కుటుంబానికి రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ ఆర్థిక సహకారం

Related image

సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం, బద్దెనపల్లి గ్రామ గీత కార్మికుడు గుగ్గిళ్ళ కృష్ణయ్య గౌడ్ ఈ నెల 15న తాటీ చెట్టుపైన మోకు జారటంతో వెల్లకిలా పడి ప్రాణాలు విడిచాడు. పేదవారైనా వారి కుటుంబానికి కల్లుగీత పారిశ్రామిక ఆర్థిక సహకార కార్పొరేషన్ నుండి దహన సంస్కారాల కొరకు 25 వేల రూపాయల చెక్కును కార్పొరేషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం ఆదేశానుసారం మృతుని భార్య గుగ్గిళ్ళ పద్మకు జూనియర్ అసిస్టెంట్ రవీందర్ గౌడ్, సిరిసిల్ల ABCDO సంపూర్ణ అందజేశారు. ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం.వి.రమణ పాల్గొన్నారు.

టాడి కార్పొరేషన్ నుండి ఆర్థిక సహకారం చేయడం అభినందనీయమన్నారు. అందుకు మంత్రి కేటీఆర్ గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి, బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం గారికి, కార్పొరేషన్ యం.డి ఉదయ ప్రకాష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

చెట్టుపై నుండి పడగానే స్పందించి ప్రభుత్వం నుండి ఎక్స్గ్రేషియా చెల్లించడం కోసం ఎక్సైజ్ అధికారులను ఆదేశించిన ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ నుండి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మృతుని కుటుంబానికి తక్షణమే ఎక్స్ గ్రేషియా అందే విధంగా చూడాలని, వారి పిల్లలకు ఉద్యోగావకాశాలు కల్పించాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం.వి.రమణ కోరారు. ఈ కార్యక్రమంలో, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కోహెడ కొమురయ్య గౌడ్, రాష్ట్ర కార్యదర్శి బండకింది అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

More Press Releases