యాదాద్రి ఆల‌య‌ పున:ప్రారంభం.. పనుల పురోగ‌తిపై మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి సమీక్ష

Related image

హైద‌రాబాద్, డిసెంబ‌ర్ 16: సీఎం కేసీఆర్ ఆదేశించిన మేరకు యాదాద్రి ఆల‌య పునః ప్రారంభ  పనులన్నీ వేగంగా  పూర్తి చేయాల‌ని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. మహాద్భుత ఆధ్యాత్మిక దివ్య క్షేత్రంగా రూపు దిద్దుకున్న యాదాద్రి ఆలయ పునః ప్రారంభ తేదీని సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించిన‌ నేప‌థ్యంలో ఆల‌య ప‌నుల పురోగ‌తి, మ‌హా సుద‌ర్శ‌న యాగం, మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ  ఏర్పాట్ల‌పై దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి స‌మీక్ష నిర్వ‌హించారు.  అర‌ణ్య భ‌వ‌న్ లో నిర్వ‌హించిన‌ ఈ సమావేశానికి దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ అనిల్ కుమార్, ఆర్ & బీ ఈఎన్సీ గ‌ణ‌ప‌తి రెడ్డి,  వైటీడీఏ వైస్ చైర్మ‌న్ కిష‌న్ రావు, ఈవో గీతారెడ్డి,  అర్కిటెక్ట్  ఆనంద్ సాయి,  త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

యాదాద్రి దేవాలయ ప్రాంగణంతో పాటు టెంపుల్ టౌన్, కాటేజీల నిర్మాణాలు, లైటింగ్ ఏర్పాట్లు , క‌ళ్యాణ క‌ట్ట‌, దీక్షాప‌రులు మండ‌పం, అన్న ప్రసాదం, వ్ర‌త మండ‌పం, గండి చెరువు సుంద‌రీక‌ర‌ణ,  బస్ ట‌ర్మిన‌ల్స్, త‌దిర‌త‌ల‌ నిర్మాణాల పురోగతిపై మంత్రి  చర్చించారు. మార్చి 21న సంప్రోక్షణకు అంకురార్పణ- మ‌హా సుద‌ర్శ‌న యాగం, మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ కార్య‌క్ర‌మాల ఏర్పాట్లు,  యాగ‌శాలల నిర్మాణం, రుత్వికుల‌కు బ‌స చేసేందుకు విడిది, త‌దిత‌ర ఏర్పాట్ల‌పై మంత్రి ఆరా తీశారు. గడువులోగా ఆలయ పునర్నిర్మాణ, విస్తరణ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారుల‌ను ఆదేశించారు. ఎప్ప‌టిక‌ప్పుడు ప‌నుల తీరుపై  క్షేత్రస్థాయిలో స‌మీక్ష నిర్వ‌హించుకుంటూ.. స‌కాలంలో ప‌నులన్ని పూర్త‌య్యేలా చూడాల‌న్నారు.  ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భక్తజన సందోహం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాదాద్రి ఆలయ పునః ప్రారంభానికి ముహూర్తం ద‌గ్గ‌ర ప‌డుతుంద‌ని, దాదాపుగా అన్ని ప‌నులు ముగింపు ద‌శ‌కు చేరుకున్నాయ‌ని, ఇంకా పెండింగ్ లో ఉన్న కొన్ని ప‌నులను ఫిబ్ర‌వ‌రి లోపు పూర్త‌యేలా చ‌ర్యలు తీసుకుంటున్నామ‌న్నారు . సీఎం కేసీఆర్ దిశానిర్దేశంతో ఈ పుణ్యక్షేత్రాన్ని సకల హంగులతో దేదీప్యమానంగా తీర్చిదిద్దుతున్నామ‌ని తెలిపారు. సీయం కేసీఆర్ పిలుపు మేర‌కు  విమాన గోపుర బంగారు తాప‌డానికి విరాళాలు ఇచ్చేందుకు దాతలు ముందుకు వ‌స్తున్నార‌న్నారు.

ఎన్ఆర్ఐ ల నుంచి విరాళాల సేక‌ర‌ణ‌కు ప్ర‌త్యేక యాప్:

ఎన్ఆర్ఐ దాత‌ల నుంచి సేక‌రించిన నిధుల‌తో ఆల‌యాల్లో భ‌క్తుల‌కు మ‌రిన్ని సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఐటీ శాఖ  రూపోందించిన ప్ర‌త్యేక మొబైల్ యాప్ ను గురువారం అర‌ణ్య భ‌వ‌న్ లో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఆవిష్క‌రించారు. ధైవ భ‌క్తితో సేవ చేసేందుకు ఎంతో మంది శఎన్ఆర్ఐ భ‌క్తులు విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వ‌స్తున్నార‌ని, అలాంటి వారి కోసం ప్ర‌త్యేకంగా  T APP FOLIO మొబైల్ యాప్ ను అందుబాటులోకి తెచ్చామ‌న్నారు. ఇందులో నాన్ రెసిడెంట్ ఇండియన్ అనే ప్ర‌త్యేక  ఆప్ష‌న్ ద్వారా  యాదాద్రి ఆల‌యంతో పాటు హైద‌రాబాద్ న‌గ‌రంలోని  బ‌ల్కంపేట్ ఎల్ల‌మ్మ‌, పెద్ద‌మ్మ గుడి, సికింద్ర‌బాద్ గ‌ణేష్ టెంపుట్, క‌ర్మ‌న్ ఘాట్ ఆల‌యాలకు ఎన్ఐఆర్  దాత‌లు  విరాళాల‌ను  పంప వ‌చ్చ‌ని తెలిపారు. త్వ‌ర‌లోనే ఈ సేవ‌ల‌ను మ‌రిన్ని ఆల‌యాల‌కు విస్తరించ‌నున్న‌ట్లు  మంత్రి చెప్పారు.

ఈ కార్య‌క్ర‌మంలో దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ అనిల్ కుమార్, అద‌న‌పు క‌మిష‌న‌ర్  కే. జ్యోతి,  డిఫ్యూటీ క‌మిష‌న‌ర్  రామ‌కృష్ణ‌, యాదాద్రి ఆల‌య ఈవో గీతారెడ్డి,  వేముల‌వాడ ఈవో కృష్ణ‌ప్ర‌సాద్, బాస‌ర ఆల‌య ఈవో వినోద్ రెడ్డి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఆలయాల నిర్మాణానికి రూ. 44.98 కోట్లు:

రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దేవాలయాల అభివృద్ధికి సీయం కేసీఆర్ ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుంద‌ని దేవాదాయ వాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. గురువారం అర‌ణ్య భ‌వ‌న్ లో కామ‌న్ గుడ్ ఫండ్ క‌మిటీ స‌భ్యుల‌తో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి స‌మావేశ‌మ‌య్యారు. సర్వశ్రేయో నిధి (కామన్‌ గుడ్‌ ఫండ్‌–సీజీఎఫ్‌) ద్వారా చేపట్టిన ప‌నుల పురోగ‌తిపై మంత్రి ఆరా తీశారు. రాష్ట్రంలోని చిన్న చిన్న ఆలయాల నిర్వహణ, పురాతన ఆలయాల పునరుద్ధరణ, నూత‌న ఆల‌యాల నిర్మాణం వేద పాఠశాలల నిర్వహణ వంటి కార్యక్రమాల కోసం సీజీఎఫ్ ద్వారా నిధులు కేటాయిస్తున్నామ‌ని, సీజీఎఫ్‌ ద్వారా చేపట్టిన పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 130 నూతన ఆలయాల నిర్మాణానికి రూ.44,98 కోట్లు, వీక‌ర్ సెక్ష‌న్ కాల‌నీల్లో 63 ఆల‌యాల నిర్మాణానికి రూ. 7. 56 కోట్ల నిధుల మంజూరుకు సీజీఎఫ్‌ కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. షాద్ న‌గ‌ర్ లోని వేదపాఠశాల నిర్వహణకు రూ. 5.43 ల‌క్ష‌లు కేటాయించేందుకు క‌మిటీ అంగీక‌రించ‌ద‌ని తెలిపారు.

ఈ స‌మావేశంలో దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ అనిల్ కుమార్, అద‌న‌పు క‌మిష‌న‌ర్  కే. జ్యోతి, యాదాద్రి ఆల‌య ఈవో గీతారెడ్డి,  స‌హాయ‌క క‌మిష‌న‌ర్ వినోద్ రెడ్డి, క‌మిటీ స‌భ్యులు పాల్గొన్నారు.   

More Press Releases