విజిలెన్స్ అవేర్ నెస్ వారోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ నిర్వహించిన తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్

Related image

హైదరాబాద్, అక్టోబర్ 26 : నేటి నుండి నవంబర్ ఒకటవ తేదీ వరకు పాటిస్తున్న విజిలెన్స్ అవేర్ నెస్ వారోత్సవాన్ని పురస్కరించుకొని విజిలెన్స్ అవేర్ నెస్ పై బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సచివాలయ ఉద్యోగులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేడు ప్రతిజ్ఞ నిర్వహించారు. 75 వ స్వతంత్ర భారతం - సమగ్రతతో కూడిన స్వయం సమృద్ధి నినాదంతో ఈ విజిలెన్స్ అవేర్ నెస్ వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రతిజ్ఞలో రెవిన్యూ శాఖ కార్యదర్శి, రిజిస్ట్రేషన్ల ఐ.జి. శేషాద్రి, ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రెటరీ రోనాల్డ్ రోస్, ప్రోటోకాల్ విభాగం జాయింట్ సెక్రెటరీ అర్విందర్ సింగ్, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

Somesh Kumar
Telangana

More Press Releases