హైదరాబాద్ లో జరగనున్న అంతర్జాతీయ గోల్ఫ్ టోర్నమెంట్ 2022

Related image

హైదరాబాద్ లో అంతర్జాతీయ గోల్ఫ్ టోర్నమెంట్ (అక్టోబర్ - 2022) జరగబోతున్న సందర్భంగా మొట్టమెదటి సారిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ గోల్ఫ్ టోర్నమెంట్ జరగడం ఇదే మొట్టమొదటి సారి గనుక దేశ విదేశాల్లో అనేక మంది ప్రముఖులు, గోల్ఫ్ ప్రపంచ స్థాయి క్రీడాకారులు చాలామంది పెద్ద పెద్ద కార్పోరెట్ సంస్థల సీఈఓలు, సీఎఫ్ఓ లు ఈ టోర్నమెంట్ లో పాల్గోనటానికి వస్తారు కనుక, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ ఖ్యాతి ప్రతిబింబించేలా గోప్ప కార్యక్రమాన్ని నిర్వహించేలా టోర్నమెంట్ సన్నాహాక ఏర్పాట్లపై రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన ఆయన కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది.

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధిస్తున్న నేపథ్యంలో క్రీడారంగంలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దెందుకు కృషి చేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో గోల్ఫ్ క్లబ్ కు ప్రక్కనున్న ఇరిగేషన్ ట్యాంక్ ను బ్యూటిఫికేషన్ చేయటంతో పాటు వరద నీరు, మురికినీటిని డైవర్ట్ చేసి దానిని మెట్రో వాటర్ వర్క్స్, జీహెచ్ఎంసీ పరిధిలోని రోడ్డును దాన్ని బ్యూటిఫికేషన్ ను చేయడంతో పాటు మూడు శాఖల అధికారులతో సమన్వయం చేసుకోని ప్రతిపాదనలు రూపోందించుకోని త్వరలో పట్టణాభివృద్ది, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తో కలసి వారికి సంబందించిన అంశాలపై చర్చించి వాటిని కంప్లీట్ చేయాలని ఈ సమీక్షలో నిర్ణయించటం జరిగింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గోల్ఫ్ క్లబ్ ను కేటీఆర్ ప్రారంబించడం జరిగింది. ప్రపంచంలో ఏక్కడ లేని విధంగా అద్భుతమైన దృశ్యంగా, అద్బుతమైన చారిత్రాత్మక ప్రాంతంగా వుంది. ఢిల్లీ, బెంగుళూరులో కంటే హైదరాబాద్ లోని గోల్ఫ్ క్లబ్ అద్భుతంగా వుందని పలువురు జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు కితాబిచ్చారన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రీడలలో పెద్ద పాత్ర వేసి అనేక క్రీడా మైదానాలు నిర్మించడం జరుగుతుందన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించడం జరుగుతుందన్నారు.ఒలింపిక్స్ లో పతకాలు సాదించే  క్రీడాకారులను ప్రోత్సహకాలను అందిస్తామన్నారు. వీటి వల్ల జాతీయ స్థాయిలో టూరిజం అభివృద్ది జరిగే అవకాశం ఉందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. అనేక మంది ఇంటర్ నేషనల్ టూరిస్టులు హైదరాబాద్ కు రావడం వల్ల టూరిజంకు అవకాశం ఉంటుందని వెల్లడించారు.

చాలా మంది ప్రముఖులు ఈ ప్రాంతాన్ని యూనేస్కో గుర్తింపు ప్రాంతంగా అయ్యే అవకాశం ఉందని సమావేశంలో చర్చకు రావడం జరిగిందన్నారు. రామప్ప దేవాలయం యూనేస్కో గుర్తింపు తర్వాత గోల్కోండ కోట, గోల్ఫ్ క్లబ్ ల యూనేస్కో గుర్తింపుకు కృషి చేయాలని ఈ సమావేశంలో చర్చించటం జరిగింది. ఈ సమావేశంలో చర్చించిన అంశాలను తోందరలోనే సీఎం కేసీఆర్ కి వివరించి వారి డైరెక్షన్ ప్రకారం కార్యక్రమాలను అమలు చేయాలని ఈ సమావేశంలో మాట్లాడుకోవడం జరిగిందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. 10 రోజుల్లో ప్రతిపాదనలు సిద్దం చేసుకోని వివిధ కార్యక్రమాల అమలుపై రాష్ట్ర పట్టణాభివృద్ది, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ తో సమావేశం ఏర్పాటు చేసుకోని అక్టోబర్ 2022 నాటికి పూర్తి స్థాయిలో టోర్నమెంట్ నిర్వాహణ పనులను పూర్తి చేసుకోవాలని మంత్రి ఈ సమావేశంలో గవర్నింగ్ బాడీ సభ్యులకు సూచించారు. గతంలో ఏ క్రీడా శాఖ మంత్రి  గోల్ఫ్ క్లబ్ అభివృద్ధిపై చర్చించలేదన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో క్రీడల అభివృద్దికి అనేక కార్యక్రమాలను నిర్వహించటం ఎంతో సంతోషంగా ఉందన్నారు గోల్ఫ్ క్లబ్ గవర్నింగ్ బాడీ సభ్యులు. గోల్ఫ్ టోర్నమెంట్ ద్వారా తెలంగాణ ఖ్యాతిని అంతర్జాతీయ వేదికలపై మరింత ఇనమడింపజేసేందుకు కృషి చేస్తామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

ఈ సమీక్షా సమావేశంలో గోల్ఫ్ క్లబ్ గవర్నింగ్ సభ్యులు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రభుత్వ కార్యదర్శి శ్రీనివాస రాజు, హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్, తెలంగాణ టూరిజం ఎండీ మనోహర్, కేంద్ర పురావస్తు శాఖ రీజినల్ డైరెక్టర్ డా. స్మిత ఎస్. కుమార్, హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, సెక్రటరీ బీవీకే రాజు, కెప్టెన్ భాస్కర్ రెడ్డి, ఏఎస్ఐ, టూరిజం శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

More Press Releases