ప్రముఖ ప్రజా వైద్యుడు రమక లక్ష్మణ మూర్తి మృతి పట్ల కేసీఆర్ తీవ్ర సంతాపం

Related image

హైదరాబాద్: ప్రముఖ ప్రజా వైద్యుడు రమక లక్ష్మణ మూర్తి మృతి పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. లక్ష్మణ మూర్తి ప్రజా వైద్యం కోసం తన జీవితాన్ని అర్పించి పీపుల్స్ డాక్టర్ గా ప్రజల గుండెల్లో కొలువుదీరారని ముఖ్యమంత్రి కొనియాడారు. ప్రజల కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన లక్ష్మణ మూర్తి సేవలను తరతరాలు గుర్తు చేసుకుంటాయని సీఎం అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

KCR
Telangana

More Press Releases