287 డిజైన్లతో.. అనేక వర్ణాలతో బతుకమ్మ చీరల ప్రదర్శన

Related image

  • చేనేత కార్మికులకు ఉపాధి, తెలంగాణ మహిళలకు చిరుకానుక
  • నాలుగేళ్లలో వెయ్యి కోట్ల రూపాయలతో నాలుగు కోట్ల చీరలు
  • ప్రతి ఏటా డిజైన్లు పెంచుతాం... నాణ్యత పెంచుతాం
  • బతుకమ్మ చీరలకు బ్రాండింగ్ ఏర్పాటు చేయాలి
  • మన రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాలలోనూ తెలంగాణ నేతన్నల హవా
  • తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలనలో నేతన్న భవిత భద్రం
  • మహిళల పక్షాన సీఎం కేసీఆర్ కి హృదయ పూర్వక ధన్యవాదాలు
  • అక్టోబర్ 9 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ షురూ
  • మహిళా సంఘాల ఆధ్వర్యంలో చీరల పంపిణీ
  • టూరిజం ప్లాజాలో మంత్రులు కేటీఆర్, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల ప్రదర్శన
హైదరాబాద్, సెప్టెంబర్ 29: బతుకమ్మ పండగను ఈ రాష్ట్రంలోని మహిళలందరూ సంతోషంతో జరుపుకోవాలనే మంచి సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి ఏటా ఇచ్చే బతుకమ్మ చీరలను ఈసంవత్సరం అక్టోబర్ 9వ తేదీ నుంచి ఇవ్వడానికి 99 లక్షల చీరలను సిద్ధం చేశారు.

త్వరలో మహిళా సంఘాల ద్వారా పంపిణీ చేయనున్న ఈ బతుకమ్మ చీరలను నేడు హైదరాబాద్ లోని టూరిజం ప్లాజా హరిత హోటల్ లో రాష్ట్ర పురపాలక, పరిశ్రమలు, ఐటీ శాఖామంత్రి కేటీఆర్, రాష్ట్ర గిరిజన సంక్షేమ, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో టెస్కో డైరెక్టర్ శైలజా రామఅయ్యర్ ప్రదర్శించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ కామెంట్స్:

  • బతుకమ్మ పండగకు రాష్ట్ర మహిళలకు ముందస్తు శుభాకాంక్షలు.
  • అక్టోబర్ 17న బతుకమ్మ ప్రారంభమై, అక్టోబర్ 25న దసరా పండగ.
  • గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే ఒక్కొక్క వర్గానికి సంబంధించిన సమస్యల పట్ల దృష్టి సారించి, దీర్ఘకాలిక పరిష్కారాలు, శాశ్వత పరిష్కారాలు కోసం మొదటి నుంచి పరితపించిన నాయకులు గౌరవ సీఎం కేసీఆర్ గారు. 
  • కేసీఆర్ గారు గతంలో కరీంనగర్ నుంచి పార్లమెంట్ సభ్యునిగా ప్రాతినిధ్యం వహించినప్పుడు ఆనాడు సిరిసిల్ల ప్రాంతంలో గోడలమీద రాతలు ఉండేవి. 
  • నేతన్నా... ధైర్యంతో ఉండు, మరణించవద్దు, ఆత్మహత్యలు మంచిది కాదు అని ఆనాటి ప్రభుత్వం గోడల మీద రాయించింది. 
  • ఆనాడు ఆ పరిస్థితి చూసి చలించారు కేసీఆర్ గారు. ఒకరోజు సిరిసిల్లలో ఏడుగురు నేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 
  • ఆనాడు ఉద్యమ నాయకునిగా, కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా పార్టీ తరపున 50 లక్షల రూపాయలను నేతన్నల సమాజానికి సంబంధించిన సొసైటీకి ఇచ్చి మైక్రో రుణాలు ఇవ్వమన్నారు. 
  • రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నేతన్నల సమస్యలు సంపూర్ణంగా ఆకలింపు చేసుకున్న వ్యక్తిగా, ఆ ప్రాంత సమస్యలు గుర్తెరిగిన వ్యక్తిగా 1200 కోట్ల రూపాయల బడ్జెట్ ను చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా చేనేత, జౌళి శాఖకు ఇచ్చి మాకు చాలా కార్యక్రమాలు వారే డిజైన్ చేసి మార్గనిర్ధేశనం చేశారు. 
  • సిరిసిల్ల, గర్షకుర్తి, వరంగల్ ప్రాంతాల్లో పవర్ లూమ్స్ కు చేతినిండ పనికల్పిస్తే నేతన్నకు ఢోకా ఉండదని, ఇవాళ 10,12వేలు సంపాదించే నేతన్నమనం భద్రత ఇచ్చి, ఉపాధి కల్పిస్తే మార్కెట్ గ్యారంటీ కల్పిస్తే 8వేలు సంపాదించే వారు 20వేలు సంపాదిస్తారు, 15వేలు సంపాదించేవారు 25వేలు సంపాదిస్తారని ఒక ఆలోచనతో అక్కడి సేట్లను పిలిపించి, నేతన్నలకు జీతం పెరిగి లాభం జరిపేందుక ఒప్పుకుంటేనే ఈ ఆర్డర్ ఇస్తానని చెప్పి ఒప్పించారు.
  • ప్రతి సంవత్సరం కోటి చీరలు అందించాలని చేనేత, జౌళి శాఖకు లక్ష్యం పెట్టారు. రాష్ట్రంలోని పేదింటి ఆడబిడ్డలకు చిరు కానుకగా నాణ్యమైన చీరను బతుకమ్మ పండగకు అందించాలని, తద్వారా నేతన్నకు ఉపాధి కల్పించాలని చెప్పారు. 
  • 2017లో 228 కోట్ల రూపాయలు, 2018లో 280 కోట్ల రూపాయలు, 2019లో 313 కోట్ల రూపాయలు, 317.81 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఖర్చు చేస్తున్నాం. ఒక్క బతుకమ్మ చీరమీదనే 1033 కోట్ల రూపాయలను ఈ ప్రభుత్వ ఖర్చు చేసింది. 26వేల పవర్ లూమ్స్ కు పనికల్పిస్తూ వేలాది నేతన్నలకు ఉపాధి కల్పిస్తోంది. 
  • నాలుగేళ్లలో నాలుగు కోట్ల చీరలను ఇప్పటికే పంపిణీ చేసింది.
  • కేవలం బతుకమ్మ చీరలే కాదు విద్యాశాఖ మంత్రి ఆధ్వర్యంలో  స్కూల్ యూనిఫామ్స్ ఆర్డర్ పెద్ద మొత్తంలో పవర్ లూమ్స్ కే ఇస్తున్నారు. 
  • మంత్రి సత్యవతి రాథోడ్ గారి డిపార్ట్ మెంట్ నుంచి అంగన్ వాడీలు, ఐసిడిఎస్ లో పనిచేసే ఇతర సిబ్బంది చీరలు, కేసీఆర్ కిట్ లో ఇచ్చే చీరలన్నీ కూడా పవర్ లూమ్స్ కు ఆర్డర్ ఇవ్వడం వల్ల రాష్ట్రంలో నేతన్నల ఆత్మహత్యలనేవి గత చేదు అనుభవంగా, పీడకలలా మిగిలిపోయింది. రాష్ట్రంలో నేతన్నల ఆత్మహత్యలు నేడు లేవు. 
  • మౌలిక అంశాల మీద రాష్ట్రాల ప్రభుత్వాలు దృష్టి సారిస్తే ఏ రకమైన పరిష్కారాలు వస్తాయనేదానికి ఈ రోజు తెలంగాణనే మంచి ఉదాహరణ.
  • పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. రైతు ఆత్మహత్యలను అత్యంత వేగంగా తగ్గించిన రాష్ట్రం తెలంగాణ అని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోను ఊటంకిస్తూ చెప్పింది. 
  • రైతన్న ఆత్మహత్యలు లేవు, నేతన్న ఆత్మహత్యలు లేవు, ఫ్లోరోసిస్ మహమ్మారిని శాశ్వతంగా తొలగించిందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో చెప్పింది. 
  • ఢిల్లీలో మాకు అనుకూల ప్రభుత్వం లేదు. నిజానికి రాజకీయ ప్రత్యర్థులు వారు. అయినా నిజాలు అంగీకరించక తప్పని పరిస్థితి వారిది. 
  • బతుకమ్మ చీరల కార్యక్రమం మొదలు పెట్టినప్పుడు సిరిసిల్ల పవర్ లూమ్స్ అవుట్ డేటెడె లూమ్స్. ముతక చీరలకే పనికొస్తాయి. మంచి నాణ్యత ఉన్న చీరలు ఏ విధంగా నేయాలని మథనపడ్డాము. కానీ నేతన్నలతో మాట్లాడి పవర్ లూమ్ అప్ గ్రెడేషన్ స్కీమ్ పెట్టి వారిని ప్రోత్సహిస్తూ వేల సంఖ్యలో లూమ్స్ అప్ గ్రేడ్ చేశాము. దీనివల్ల నాణ్యమైన చీరలు అనేక డిజైన్లలో చేస్తున్నారు. 
  • మహిళలకు చీరలు నచ్చడం అనేది వారి భర్తల వల్లనే కాదు..కానీ ప్రభుత్వం వల్ల ఎక్కడ అవుతుంది. అయితే కొంత మనసు పెడితే, కష్టపడితే చెయ్యొచ్చు అని మన కార్యదర్శి గారు చూపెట్టారు.
  • మన రాష్ట్రంలోనే కాదు నేడు ఇతర రాష్ట్రాలలో కూడా మన నేతన్నలు ఆర్డర్లు పొందుతున్నారు.
  • ఈ రాష్ట్రంలో నేతన్న భవిష్యత్ భద్రంగా ఉంటుంది. చేనేత మిత్ర పథకమైనా, నేతన్నకు చేయుత పథకమైనా, నూలు,,రసాయనాల మీద 50 శాతం సబ్సిడీ ఇస్తున్నా ఇవన్నీ తెలంగాణలోనే జరుగుతున్నాయి.
  • ఈ ప్రభుత్వానికి మతపరమైన ఎజెండా లేదు. రంజాన్, క్రిస్మస్ లకు కూడా చీరలు ఇస్తున్నాం. మతం ఏదైనా పండగే. పేదరికం అన్ని మతాల్లోనూ ఉంది కాబట్టి అన్ని మతాల పండగలకు చీరలు ఇస్తున్న గొప్ప సంస్కార ప్రభుత్వం తెలంగాణది. 
  • మన రాష్ట్రంలో మహిళా సంఘాలు బలంగా ఉన్నాయని చీరల పంపిణీ వారికే బాధ్యత ఇచ్చాము.
  • వచ్చే ఏడాది ఇంతకన్నా ఉత్సాహ పూరిత వాతావరణం లో ఈ కార్యక్రమం ఇంకా పెద్ద ఎత్తున చేస్తాము.
  • కరోనా సంక్షోభ సమయంలో కూడా సంక్షేమం ఒక్కటి ఆగలేదు.రైతుకు రైతుబంధు రూపంలో 7279.58 కోట్లు రైతు అకౌంట్ లో పడ్డాయి. రైతుబీమా 1141 కోట్ల రూపాయలు ఇచ్చాము. ఆసరా పెన్షన్లకు ప్రతి నెల దాదాపు 1000 కోట్లు ఇస్తున్నాం. కళ్యాణలక్మీ, షాదీ ముబారక్, పిల్లల స్కాలర్ షిప్ లు ఆగలేదు. బతుకమ్మ చీరలు ఆగలేదు. రంజాన్, క్రిస్మస్ ఆగవు. 
  • సిరిసిల్ల నేతన్నలకు ప్రత్యేక కృతజ్ణతలు.
  • బతుకమ్మ చీరలకు బ్రాండింగ్ చేయండి. బయట కూడా వీటిని కొంటారు. ఇంత నాణ్యమైన చీరలు తక్కువ ధరకే లభిస్తున్నాయి.
కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్ కామెంట్స్:

  • ఈరోజు చాలా శుభదినం
  • గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్ర మహిళలకు ఇచ్చే బతుకమ్మ చీరల ప్రదర్శన, లాంచింగ్ కార్యక్రమంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పాల్గొనడం అదృష్టం.
  • గడిచిన నాలుగు సంవత్సరాలుగా తెలంగాణ రాస్ట్రంలో ఉండే సుమారు కోటి మంది అర్హులకు అన్నగా, మేనమామగా, తండ్రిగా చీరలు ఇస్తున్నారు.
  • ఈ నాల్గో సంవత్సరం కొత్త డిజైన్లు, మంచి కలర్లతో నాణ్యమైన చీరలు ఇవ్వడం భారతదేశంలో ఎవరూ చేయని విధంగా సీఎం కేసీఆర్ చేస్తున్నారు. 
  • మహిళలకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను
  • బతుకమ్మ అని మహిళకు చీరను పంపడం గొప్ప సంప్రదాయం
  • ప్రతి ఒక్కరికి నేనున్నాను అని నమ్మకాన్ని, విశ్వాసాన్ని కల్పించే విధంగా ముఖ్యమంత్రి గారు చీరలు ఇవ్వడం గొప్ప విషయం
  • కోవిడ్ వల్ల గత ఆరు నెలలుగా రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం పడిపోయినా గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు నేతన్నలు సుఖంగా ఉండాలని, వారి జీవనోపాధికి అవకాశం కల్పిస్తూ చీరలు నేయించి ఇస్తున్నారు. 
  • ప్రతి కుటుంబం సంతోషంగా ఉండేవిధంగా ఈ చీరలు అందించే కార్యక్రమం ఇది.
  • దేశమంతా అతలాకుతలం అయి, అన్ని రాష్ట్రాల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆపేస్తే మన రాష్ట్రంలో మాత్రం సీఎం కేసీఆర్ గారు ఈ పండగ మరింత సంతోషంగా చేసుకోవాలని మనసు పెట్టి కోటి చీరలు అందిస్తున్నారు.
  • సామాన్యులకు 6 చీరలు, పెద్దవాళ్లకు 9 మీటర్ల చీరలు కూడా ఇస్తున్నారు
  • మహిళల గౌరవాన్ని పెంచుతూ, నేతన్నల జీవన ప్రమాణాలు పెంచుతున్నారు.
  • గతంలో నేతన్నలు ఏ విధంగా కష్టపడ్డారు...ఎంత ఇబ్బంది పడ్డారో మనం చూశాము
  • ఈ రాష్ట్రం వస్తే నేతన్నలకు చేయుతనిస్తానని చెప్పి నేడు బతుకమ్మ చీరల ద్వారా ఉపాధి కల్పిస్తున్నారు.
  • పోయిన సంవత్సరం 100 డిజైన్లు, కలర్లు అయితే ఈ సంవత్సరం 287 డిజైన్లు, కలర్లు ఇస్తున్నారు. వీటితో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉంటారని భావిస్తున్నారు. 
  • మీ ఆశీస్సులు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ఉండాలని కోరుకుంటున్నాను. 
  • 9వ తేదీ నుంచి జిల్లాల్లో కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ ఈ చీరలు పంపిణీ చేయనున్నందుకు అందరికీ మరోసారి శుభాకాంక్షలు. 

కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రా రెడ్డి కామెంట్స్:

  • బతుకమ్మ చీరల ప్రదర్శ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మంత్రి కేటీఆర్ గారికి ధన్యవాదాలు
  • ఈ వేదిక మీదకి రావడానికి అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ గారికి కృతజ్ఞతలు
  • గతంలో ఎక్కడా వెళ్ళినా చేనేత కార్మికుల ఆత్మహత్యలు కనపడేవి. కానీ సీఎం కేసీఆర్ గారు వచ్చిన తరవాత వినూత్న కార్యక్రమం చేపట్టి వారికి అండగా నిలిచారు.
  • మంత్రి కేటీఆర్గారు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా మనసు పెట్టి చేస్తున్నారు. కొత్త డిజైన్లు, వేర్వేరు కలర్ల తో చేయిస్తున్నారు.
  • గతంలో గొప్పవారికే పండుగ రోజు కొత్త చీరలు ఉండేవి. కానీ సీఎం కేసీఆర్ గారు ప్రతి మహిళ సంతోషంగా పండగ జరుపుకోవాలని కోటి చీరలు పంపిస్తున్నారు.
  • కరోనా కష్ట కాలంలో కూడా చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తూ అత్యంత నాణ్యత తో చీరలు అందిస్తున్నారు.
కార్యక్రమంలో భాగంగా చీరలు ఎలా ఉన్నాయి, ఇంకా వాటిని అందంగా, నాణ్యంగా రూపొందించడానికి సలహాలు ఇవ్వమని మంత్రి కేటీఆర్ ఆడపడచులతో మాట్లాడించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ పండుగ కోసం ఇస్తున్న చీర పుట్టింటిని మరిపిస్తుందని, ఒక తండ్రిలాగా అడగకుండానే పండగకు చీర ఇస్తూ కుటుంబ పెద్ద అయ్యారన్నారు. గొప్పవాళ్ల ఇండ్లలో కొత్త చీరలు పెట్టే స్తోమత ఉంటుంది కానీ పేదోళ్లకు పండగ జరుపుకునే పరిస్థితి కూడా ఉండదని, అలాంటిది కొత్త చీర లేకుండా పండగ చేసుకుంటారని, ముఖ్యమంత్రి కేసీఆర్ వల్ల నేడు బతుకమ్మ పండగను కొత్త చీరలతో జరుపుకుంటున్నామన్నారు.

ఇంతమందికి ఇంతమంచి చీరలు ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మా అందరి ఆయుష్షు పోసుకుని కాలకాలం బాగుండాలని, ఈ రాష్ట్రంలోని మా మహిళలకు ఇలాగే అనేక కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు.

More Press Releases