ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు బిపిఆర్. విఠల్ మృతిపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

Related image

ఉన్నతాధికారి, ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు బిపిఆర్. విఠల్ (విశ్రాంత IAS) మృతిపై సీఎం కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో అతి ఎక్కువ కాలం పాటు ఆర్థిక, ప్రణాళిక శాఖల కార్యదర్శిగా, ఏపీ ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ బోర్డు వైస్ చైర్మన్ గా, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) సలహాదారుడిగా మరియు పదవ ఆర్థిక కమిషన్ సభ్యుడిగా విఠల్ అందించిన సేవలను సీఎం గుర్తుచేసుకున్నారు.

More Press Releases