మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నివాసంలో మంత్రి వర్గ ఉపసంఘం సమావేశం

Related image

  • మినిస్టర్ క్వార్టర్స్ లోని వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నివాసంలో మంత్రి వర్గ ఉపసంఘం సమావేశం
  • హాజరయిన మంత్రులు హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్ రెడ్డి తదితరులు

పల్లెపల్లెనా కల్లాల నిర్మాణం:
  • ఉపాధిహామీ కింద హైదరాబాద్ మినహా 32 జిల్లాలలో లక్ష కల్లాల నిర్మాణానికి మంత్రివర్గ ఉపసంఘం చర్చ
  • కల్లాలు లేక ధాన్యం ఆరబెట్టుకునేందుకు రోడ్లెక్కుతున్న రైతులు
  • 45 సెంటీమీటర్ల ఎత్తు 45 చదరపు మీటర్లు విస్తీర్ణంలో నిర్మాణం.. ఒక్కో ఫ్లాట్ ఫామ్ నిర్మాణానికి రూ.46,045 అవుతుందని అంచనా
  • ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి ఆమోదం కోసం మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాలు
  • 2020 - 21 ఏడాదికి గాను 40 నుండి  45 లక్షల ఎకరాలలో వరి సాగవుతుందని అంచనా
  • National Rural Livelihood Mission (NRLM) కింద వ్యవసాయ ఉత్పత్తులు పెంచడానికి / దాచిపెట్టడానికి, సేంద్రీయ ఎరువుల తయారీకి శాశ్వత నిర్మాణాలకు ప్రోత్సాహం
  • స్థానిక అవసరాల మేరకు ఫ్లాట్ ఫామ్ ల నిర్మాణాలు

More Press Releases