తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం!

Related image

పరిపాలనా సంస్కరణలు:

తెలంగాణ ప్రభుత్వం అత్యంత సాహసోపేతంగా పరిపాలనా సంస్కరణలు అమలు చేసింది. ఏకకాలంలోనే పరిపాలనా విభాగాల పునర్విభజన చేపట్టింది. పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడం కోసం కొత్త పరిపాలనా విభాగాలను ఏర్పాటు చేసింది.

  • కొత్త జిల్లాల ఏర్పాటు 
తెలంగాణ రాష్ట్రంలో 2016 అక్టోబర్ కు ముందు 10 జిల్లాలుండేవి. కొత్తగా మరో 23 జిల్లాలను ఏర్పాటు చేయడంతో మొత్తం జిల్లాల సంఖ్య 33 వరకు పెరిగింది.

ఒక్కో జిల్లాలో సగటున 35 లక్షలకు పైగా జనాభా ఉంది. దీనివల్ల పరిపాలన కూడా కష్టతరమయ్యేది. 2016 అక్టోబర్ వరకు కొన్నిచోట్ల జిల్లా కేంద్రాలకు, కార్యాలయాలకు పోవాలంటే 200 నుంచి 250 కి.మీ.ల దూరం వుండేది. దీంతో జిల్లా కేంద్రాల అధికారులు గ్రామాలకు పోవాలన్నా, ప్రజలు జిల్లా కేంద్రాలకు వెళ్లాలన్నా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఒక్కో జిల్లాలో కుటుంబాల సంఖ్య 10 లక్షలుండేది. ఎవరి పరిస్థితి ఏంటో తెలుసుకోవడం అధికారులకు కష్టం అయ్యేది. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల నిర్వహణ ఎంతో కష్టమయ్యేది. ప్రజల సమస్యలపై దృష్టి పెట్టడం కూడా అధికారులకు కష్టంగా వుండేది.

 ఈ సమస్యలను అధిగమించటానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ చట్టం-1974 ప్రకారం తొలుత పాత 10 జిల్లాలకు కొత్తగా 23 జిల్లాలను ఏర్పాటు చేసింది.  మొత్తం 33 జిల్లాలు ప్రస్తుతం తెలంగాణలో ఉన్నాయి.

కొత్త మున్సిపాలిటీలు - కార్పోరేషన్లు

తెలంగాణ రాష్ట్రంలో పట్టణీకరణ శరవేగంగా జరుగుతున్నది. పట్టణాలు, నగరాల్లో జనాభా పెరుగుతున్నది. పట్టణ ప్రాంతాలకు సమీపంలోని గ్రామాలు కూడా పట్టణాల్లో అంతర్భాగమై పోతున్నాయి. దీంతో ప్రభుత్వం రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను పునర్వ్యవస్థీకరించింది. జనాభా ఎక్కువ ఉన్న, పట్టణ స్వభావం కలిగిన పెద్ద గ్రామాలను మున్సిపాలిటీలుగా మార్చింది. 322 గ్రామాలను సమీపంలోని మున్సిపాలిటీల్లో విలీనం చేసింది. ఏడు మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా అప్ గ్రేడ్ చేసింది.

  • 2014కు ముందు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో 52 మున్సిపాలిటీలు ఉండేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రభుత్వం కొత్తగా మరో 76 మున్సిపాలిటీలను ఏర్పాటు చేసింది.
  • ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో 6 కార్పొరేషన్లు మాత్రమే ఉండేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం కొత్తగా మరో 7 కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది.
  • దీంతో రాష్ట్రంలో 128 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లతో కలిపి మొత్తం 141 అర్బన్ లోకల్ బాడీలు (పట్టణ స్థానిక సంస్థలు) ఉన్నాయి.కొత్త రెవెన్యూ డివిజన్లు (43+30=73)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేస్తూనే రెవెన్యూ డివిజన్ల సంఖ్యను కూడా 43 నుంచి 73 వరకు పెంచింది. తొలుత 2016లో పాత 43 రెవెన్యూ డివిజన్లకు కొత్తగా మరో 26 రెవెన్యూ డివిజన్లు 43+26=69 ఏర్పాటు చేసింది. ఆ తర్వాత మరో ఏడాదికి కొత్తగా 7 ఫిబ్రవరి, 2019న మరో రెండు (కొల్లాపూర్, కోరుట్ల) రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయడంతో (మొత్తం 69+2= 71) రెవెన్యూ డివిజన్లు అయ్యాయి. 3 ఫిబ్రవరి 2020న సంగారెడ్డి జిల్లా జోగిపేట, సిరిసిల్ల రాజన్న జిల్లా వేములవాడలను కూడా రెవెన్యూ డివిజన్‌లుగా ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ నోటిఫికేషన్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మొత్తం రెవెన్యూ డివిజన్లు 71+2=73 వరకు పెరిగాయి.  
కొత్త మండలాల ఏర్పాటు (459+131= 590) తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో 459 మండలాలు ఉండేవి. కొత్తగా 131 మండలాలను ఏర్పాటు చేయడంతో మొత్తం మండలాలు (459+131= 590) వరకు పెరిగాయి.

సమీకృత జిల్లా కలెక్టరేట్లు & జిల్లా అధికారుల కార్యాలయాలు

రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లా కేంద్రాల్లో సమీకృత జిల్లా కలెక్టరేట్లు, జిల్లా పోలీసు కార్యాలయాలు(డీపీవో)లు ప్రభుత్వం నిర్మిస్తున్నది. 26 జిల్లాల్లో ప్రజలు, అధికారులకు సౌకర్యంగా ఉండేలా అన్ని వసతులతో కూడిన కలెక్టర్ కార్యాలయాలను ప్రభుత్వం నిర్మిస్తున్నది. ఈ కలెక్టరేట్ల నిర్మాణానికి 2017-18 బడ్జెట్లో రూ.600 కోట్లు కేటాయించారు. జిల్లా కేంద్రాల్లో పోలీస్‌, ఫైర్‌ కార్యాలయాలు మినహా మిగతావన్ని ఒకేచోట ఉండేలా సమీకృత జిల్లా కలెక్టరేట్‌ భవనాలను నిర్మిస్తున్నారు. ఈ దిశగా రూ.1,337 కోట్ల మొత్తం వ్యయంతో 26 సమీకృత జిల్లా కలెక్టరేటు కాంప్లెక్సులు, 13 సమీకృత జిల్లా పోలీసు కాంప్లెక్సులు, 2 పోలీసు కమిషనరేట్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్నది. జిల్లాల్లో అందుబాటులోని స్థలాన్ని బట్టి, జిల్లా పోలీస్ కార్యాలయ సముదాయాలను 20 నుంచి 30 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. జిల్లా ఎస్పీ, అదనపు ఎస్పీ కార్యాలయాలు, జిల్లా పోలీస్ విభాగం నిర్వహణ అధికారుల చాంబర్లు, ఏఆర్ హెడ్‌క్వార్టర్లు, పరేడ్‌గ్రౌండ్, శిక్షణ తరగతులు, డిజిటల్‌ల్యాబ్‌లు, కాన్ఫరెన్స్‌హాళ్లు, సిబ్బందికి బ్యారెక్స్ నిర్మిస్తారు. పరిపాలక పున:వ్యవస్థీకరణ వల్ల జిల్లాలో కార్యాలయాల సంఖ్య 21,208 నుండి 26,846 కు పెరగడం వల్ల అదనంగా 5,638 నూతన కార్యాలయాలు ఏర్పాటు అవుతున్నాయి. కొత్తగా ఏర్పాటైన జిల్లా కేంద్రాల్లో జిల్లా అధికారుల కార్యాలయాల భవన సముదాయాల నిర్మాణానికి అక్టోబర్ 11, 2017న రాష్ట్ర వ్యాప్తంగా శంకుస్థాపనలు చేశారు. 2016 అక్టోబర్ 11న దసరా సందర్భంగా కొత్త జిల్లాలు ప్రారంభమయ్యాయి. కొత్త జిల్లాలను ఏర్పాటుచేసి ఏడాది పూర్తయిన సందర్భంగా 2017 అక్టోబర్ 11న సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాలకు, పోలీస్ కమిషనరేట్ భవనాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. మిగతా చోట్ల మంత్రులు శంకుస్థాపన చేశారు. 2017 అక్టోబర్ 12న సూర్యాపేటలో సిఎం కేసీఆర్ కొత్త జిల్లా కార్యాలయ సముదాయానికి శంకుస్థాపన చేశారు. మొత్తం 18 సమీకృత కలెక్టరేట్లను రూ.1,032 కోట్లతో నిర్మాణ పనులు చేపట్టారు. 2018-19 బడ్జెట్లో కొత్త కలెక్టరేట్లు, పోలీసు కార్యాలయాలకు రూ.500 కోట్లు ప్రతిపాదించారు.

కొత్తగా పోలీస్ కమిషనరేట్లు & డివిజన్లు, సర్కిళ్లు, పోలీస్ స్టేషన్లు

రాష్ట్రంలో హైదరాబాద్, సైబరాబాద్ పోలీసుకమిషనరేట్లు మాత్రమే వుండేవి. జనాభా పెరుగుదల, నేరాల విస్తృతి పెరుగుతున్న కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 7 పోలీసు కమిషనరేట్లను(పాతవి 2+కొత్తవి 7= మొత్తం 9) ప్రభుత్వం ఏర్పాటు చేసింది.  సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ను రెండుగా విభజిస్తూ ప్రభుత్వం 2016 జూన్ 23న ఉత్తర్వులు జారీ చేసింది. సైబరాబాద్ ఈస్ట్, వెస్ట్ గా కమిషనరేట్ ను విభజించింది. కొత్తగా ఏర్పడిన సైబరాబాద్ ఈస్ట్ కమిషనరేట్ కు రాచకొండ పేరును ఖరారు చేస్తూ 2016 ఆగస్టు 23న ఉత్తర్వులు జారీ అయ్యాయి.

    అలాగే తెలంగాణలో రెండో అతి పెద్దనగరం వరంగల్. ఈ నగరాన్ని పోలీస్ కమిషనరేట్ గా ఏర్పాటు చేస్తూ 2015 జనవరి 26న తెలంగాణ ప్రభుత్వంఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో అయిదు పోలీసు కమిషనరేట్లు చేయాలని భావించినా కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఆ సంఖ్యను తొమ్మిదికి చేర్చింది. పాలనలో సౌలభ్యం, అర్బన్ ప్రాంతాల్లో నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్ కోసం తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఈ పోలీసు కమిషనరేట్లను ఏర్పాటు చేసింది. కొత్తగా నిజామాబాద్, కరీంనగర్, రామగుండం, సిద్ధిపేట, ఖమ్మం లో పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేసింది. వీటితో పాటు 25 కొత్త పోలీస్ సబ్ డివిజన్లను (పాతవి139 + కొత్తవి 25=మొత్తం 164), 31 సర్కిళ్లను (పాతవి 688+కొత్తవి 31=మొత్తం719), కొత్త పోలీస్ స్టేషన్లు 103 (పాతవి 712+కొత్తవి 103 =815) ఏర్పాటు చేశారు.

కొత్త పరిపాలన విభాగాలు

యూనిట్

పాతవి

కొత్తవి

మొత్తం

జిల్లాలు

10

23

33

డివిజన్లు

43

30

73

మండలాలు

459

131

590

పోలీస్ కమిషనరేట్లు

2

7

9

సబ్ డివిజన్లు

139

25

164

సర్కిల్స్

688

31

719

పోలీస్ స్టేషన్లు

712

103

815

మున్సిపాలిటీలు 

52

76

128

మున్సిపల్ కార్పొరేషన్లు

6

7

13

గ్రామ పంచాయతీలు

8,690

4,061

12,751

కొత్త కలెక్టరేట్ భవనాలు





హైకోర్టు విభజన

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం హైకోర్టు విభజన జరిగింది. 2018 డిసెంబర్ 31 వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడిగా కొనసాగిన హైకోర్టు విభజన పూర్తయింది. 2019 జనవరి 1వ తేదీ నుంచి అమరావతిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రారంభం అవుతుందంటూ రాష్ట్రపతి రాజపత్రం విడుదల చేశారు.  

హైకోర్టులో జడ్జీల కేటాయింపు

ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టులో ఉండాల్సిన జడ్జీలు 61 మంది. కానీ, వాస్తవంగా విధులు నిర్వహిస్తోంది 26 మంది మాత్రమే. దీంతో ఇప్పుడు ఉన్న జడ్జీలనే ఆంధ్రకు 58 - తెలంగాణకు 42 నిష్పత్తిలో 16 మందిని ఆంధ్రకు, 10 మందిని తెలంగాణకు కేటాయించారు. అయితే, ఇప్పటివరకు ఇరు రాష్ర్టాలకు కేటాయించని ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్ రాఘవేంద్ర ఎస్ చౌహాన్జస్టిస్ వీ రామసుబ్రమణియన్‌ను తెలంగాణ హైకోర్టుకు కేటాయించారు. దీంతో తెలంగాణ న్యాయమూర్తుల సంఖ్య 12కు చేరింది.

ఉమ్మడి హైకోర్టుకు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తి లేరు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి తొట్టత్తిల్ రాధాకృష్ణన్ తెలంగాణకు కొనసాగుతారు. ఆంధ్రకు కేటాయించిన వారిలో అత్యంత సీనియర్ అయిన చాగరి ప్రవీణ్ కుమార్ ఆంధ్రా తాత్కాలిక చీఫ్ జస్టిస్ గా వ్యవహరిస్తారు.

కొత్త గ్రామపంచాయతీలు
తెలంగాణ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన పంచాయతీరాజ్ చట్టం ద్వారా రాష్ట్రంలో నూతనంగా  4,383 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది. పాతవి 8,690  గ్రామపంచాతయతీలు ఉండగా కొత్తగా ఏర్పాటైన వాటితో కలిసి మొత్తం గ్రామపంచాయతీల సంఖ్య 12,751 కి చేరింది. 
కొత్తగా ఏర్పాటైన పంచాయతీలకు ఇతర గ్రామాలు, మండల కేంద్రాలతో రోడ్ కనెక్టివిటీ ని ప్రభుత్వం రూ.5 వేల కోట్లతో చేపట్టింది. అలానే గ్రామీణ స్థానిక సంస్థల పరిపుష్టానికి రూ.1,500 కోట్లు, పట్టణ స్థానిక సంస్థల పటిష్టత కోసం రూ.1,000 కోట్లను 2018-19 బడ్జెట్లో కేటాయించారు. రాష్ట్రంలోని గ్రామపంచాయతీలకు అన్నిటికీ కలిపి సంవత్సరానికి 8 వేల కోట్ల చొప్పున 5 ఏండ్లలో 40 వేల కోట్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రహదారులు & భవనాలు

మెరుగైన రహదారులు దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తాయి. రవాణా సౌకర్యం బాగున్న సమాజాలు త్వరితగతిన పురోగమిస్తాయి. కానీ దురదృష్టవశాత్తూ అన్నిరంగాల్లో  మాదిరిగానే రహదారుల విషయంలో కూడా తెలంగాణకు తీవ్ర అన్యాయం, వివక్ష జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిననాడు రహదారుల పరిస్థితి అత్యంత అధ్వాన్నంగా ఉండేది. జాతీయ రహదారులు చాలా తక్కువగా ఉండేవి. ఆర్ అండ్ బి రోడ్లలో 70 శాతం సింగిల్ లేన్ రోడ్లే. పంచాయతీరాజ్ పరిధిలో ఎక్కువ శాతం మట్టిరోడ్లే. అన్నిరోడ్లు కనీసం మరమ్మత్తులకు కూడా నోచుకోకుండా గుంతలు పడి, రాకపోకలకు ఇబ్బందికరంగా మారేవి. ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాల్సిన రహదారులు నరకాలకు నకళ్లుగా ఉండేవి. ఈ పరిస్థితిని తెలంగాణ ప్రభుత్వం మొదటి రోజుల్లోనే గ్రహించింది. రహదారుల పరిస్థితిని మెరుగు పర్చడం ద్వారా తెలంగాణలో ప్రగతిబాటలు నిర్మించాలని నిర్ణయించింది. రహదారుల అభివృద్ధిని ప్రభుత్వం అత్యంత  ప్రాధాన్యతాంశంగా గుర్తించింది. రాష్ట్రం ఆవిర్భవించిన నాటినుంచి జాతీయ రహదారులు విస్తరణ, పంచాయతీరాజ్ - ఆర్ అండ్ బి రోడ్ల అభివృద్ధికి ప్రణాళిక రచించి, అమలు చేస్తున్నది. దాంట్లో భాగంగానే ఆర్‌ అండ్‌ బి శాఖ పరిధిలోని 7,554 కిలోమీటర్ల స్టేట్‌ రోడ్‌ల అభివృద్ధికి రూ. 11,257 కోట్లను విడుదల చేశారు. ఇందులో 2020 మార్చి నాటికి 5,453 కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధి పూర్తయింది. వీటికోసం రూ.7,463 కోట్లను ఖర్చు చేశారు. రోడ్లను బాగు చేసేందుకు 1868 కోట్లను ఖర్చు చేశారు. మంజీర ,గోదావరి, మానేరు,ప్రాణహిత, మున్నేరు,అకేరు, మూసి,తుంగభద్ర తదితర నదులపై వంతెనలను నిర్మిస్తున్నారు. ఇందులో రూ. 9,084 కోట్ల వ్యయంతో 26 భారీ వంతెనల నిర్మాణాలను చేపట్టారు. 16 నిర్మాణాలను పూర్తి చేశారు. బడ్జెట్లో కూడా ఈ శాఖకు నిదులు భారీగానే కేటాయిస్తున్నారు. 2018-19లో బడ్జెట్లో రూ. 5,575 కోట్లు, 2019-20 లో రూ.2,219 కోట్లు, 2020-21 లో రూ.3493.67 కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్ లోనే కొత్త పంచాయతీల్లో రహదారులకు రూ.5 వేల కోట్లు, సీసీ రోడ్లకు మరో రూ.600 కోట్లు కేటాయించారు.

  • అన్ని మండల కేంద్రాలకు డబుల్ లేన్ రోడ్డు
రాష్ట్ర రాజధాని నుంచి ప్రతీ జిల్లా కేంద్రానికి ఖచ్చితంగా ఫోర్ లేన్ రోడ్డు, జిల్లాకేంద్రం నుంచి మండలకేంద్రానికి డబుల్ లేన్ రోడ్డు, ప్రతీ మండలకేంద్రం నుంచి ప్రతీ గ్రామానికి పక్కారోడ్డు సౌకర్యం ఉండాలనే విధానం పెట్టుకుని, దానిప్రకారం రహదారులను మంజూరు చేసింది. తెలంగాణ ఏర్పడే నాటికి 143 మండల కేంద్రాలకు జిల్లా కేంద్రం నుంచి డబుల్ లేన్ బిటి రోడ్డు లేదు. రూ.2,518 కోట్ల వ్యయం చేసి, మండల కేంద్రాలకున్న 1,875 కిలోమీటర్ల సింగిల్ లేన్ రోడ్లను ప్రభుత్వం డబుల్ లేన్ రోడ్లుగా మార్చింది. ఇప్పుడు రాష్ట్రంలో అన్ని మండల కేంద్రాలకు జిల్లా కేంద్రాల నుంచి డబుల్ లేన్ రోడ్డు సౌకర్యం సమకూరింది. మండల కేంద్రం నుంచి ప్రతీ గ్రామానికి ఖచ్చితంగా బస్సు పోయే విధంగా రహదారులను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ రహదారులను అభివృద్ధి చేసింది. మట్టి రోడ్లను కూడా బీటీ రోడ్ల స్థాయిలో నిర్మించింది.

  • రవాణా శాఖ సేవలన్నీ ఆన్ లైన్ లోనే...
రవాణా శాఖ తీసుకొచ్చిన కొన్ని ఆన్ లైన్ సేవలు దళారుల వ్యవస్థను చాలావరకు నిరోధించగలిగాయి. ఇదే స్ఫూర్తితో హైదరాబాద్ జిల్లాలోని ఆర్టీఎ కార్యాలయాల్లో పైలట్ ప్రాజెక్ట్ గా చేపట్టిన ఆన్ లైన్ బిడ్డింగ్ ద్వారా ఫ్యాన్సీ నంబర్లను కొనుగోలు చేసే ప్రక్రియ విజయవంతమైంది. దీంతో డ్రైవింగ్ లైసెన్స్, రెన్యువల్, కొత్త పర్మిట్లు, పాత పర్మిట్ల పునరుద్ధరణ ట్రేడ్ సర్టిఫికెట్లు, ఫ్యాన్సీ నెంబర్లు వంటి మొత్తం 33 సేవలను ఆన్ లైన్ లో అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. దళారులు, అవినీతి నిర్మూలన లక్ష్యంగా పారదర్శక పాలన అందించే దిశగా ప్రభుత్వం కార్యచరణను రూపొందిస్తున్నది.  

  • రికార్డుస్థాయిలో వంతెనల నిర్మాణం
ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించడానికి రోడ్లున్నప్పటికీ వాగులు, నదుల మీద అవసరమైనన్ని వంతెనల లేకపోవడం వల్ల వర్షాకాలంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగేది. అందుకే ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని జాతీయ రహదారులు, ఆర్ అండ్ బి రహదారులు, పంచాయతీ రాజ్ రహదారులపై వంతెనలు నిర్మించాలని నిర్ణయించింది. ఆర్.అండ్.బి పరిధిలో 511, పంచాయతీరాజ్ పరిధిలో 631 వంతెనల నిర్మాణం చేపట్టింది. కొత్తగా ఆర్.ఓ.బీలను నిర్మించింది.

  • గోదావరి, ప్రాణహిత నదుల వెంట ప్రత్యేక రహదారి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వరకు విస్తరించిన అటవీ ప్రాంతానికి ఉపయోగపడే విధంగా గోదావరి, ప్రాణహిత నదుల వెంట మెరుగైన రహదారి సౌకర్యం కల్పించడానికి ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని తీసుకుంది. ఈ రహదారి నిర్మాణం అవసరాన్ని నొక్కి చెప్పి, కేంద్రం నుంచి కూడా ఈ రహదారి నిర్మాణానికి తనవంతు ఆర్థిక మద్దతు అందించేలా ఒప్పించింది. రూ.546.96 కోట్ల వ్యయంతో భద్రాచలం సమీపంలోని సారపాక నుంచి ఆసిఫాబాద్ జిల్లా కౌటాల వరకు దాదాపు 350 కి.మీ. మేర కొత్త రహదారి నిర్మిస్తున్నది. గోదావరి, ప్రాణహిత వెంట నిర్మిస్తున్న ఈ రహదారి వల్ల భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి, మంచిర్యాల, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలలోని అటవీ ప్రాంతాల ప్రజలకు ఉపయోగం కలుగుతుంది.

  • గణనీయంగా జాతీయ రహదారుల విస్తరణ
సమైక్య పాలనలో జాతీయ రహదారుల విషయంలో తెలంగాణ తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించే నాటికి తెలంగాణలో కేవలం 2,527 కిలోమీటర్ల జాతీయ రహదారులు మాత్రమే ఉండేవి. 2014 జూన్ 2 నాటికి జాతీయ రహదారుల విషయంలో జాతీయ సగటు 2.80 కిలోమీటర్లుంటే, తెలంగాణ రాష్ట్రం సగటు కేవలం 2.20 కిలోమీటర్లు మాత్రమే ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం జాతీయ రహదారుల నిర్మాణం విషయంలో ప్రత్యేక చొరవను చూపింది. తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణ అవసరాన్ని కేంద్రానికి చెప్పింది.

కేంద్రప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కేవలం నాలుగేళ్ల వ్యవధిలోనే కొత్తగా రూ.11,983 కోట్ల వ్యయంతో 3,150 కిలోమీటర్ల జాతీయ రహదారులను మంజూరు చేసింది. 57 ఏళ్ల సమైక్య రాష్ట్ర చరిత్రలో మొత్తం 2,527 కిలోమీటర్ల జాతీయ రహదారులు మంజూరైతే, కేవలం నాలుగున్నరేండ్లలో అంతకన్నా ఎక్కువగా 3,150 కిలోమీటర్ల నిడివి కలిగిన 36 జాతీయ రహదారులు మంజూరయ్యాయి. దీనివల్ల నేడు తెలంగాణలో మొత్తం 5,677 కిలోమీటర్ల జాతీయ రహదారుల నెట్ వర్క్ ఏర్పడింది. జాతీయ రహదారుల్లో ప్రస్తుతం జాతీయ సగటు 3.81 కిలోమీటర్లయితే, తెలంగాణ రాష్ట్రం సగటు 5.02 కిలోమీటర్లు. జాతీయ రహదారుల విషయంలో తెలంగాణ ఏర్పడే నాటికి దక్షిణాదిలో అట్టడుగున ఉన్న రాష్ట్రం.. నేడు అగ్రభాగంలో నిలవడమే కాకుండా, దేశ సగటును మించింది. ఇవేకాకుండా రాష్ట్రంలో రూ. 13 వేల కోట్ల వ్యయం కాగల మరో 8 జాతీయ రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.

  • ఆర్ అండ్ బి రహదారుల నిర్మాణం
తెలంగాణ రాష్ట్రంలో ఆర్ అండ్ బి పరిధిలో 24, 495 కిలోమీటర్ల రహదారులున్నాయి. 2,552 కిలోమీటర్ల స్టేట్ హైవేలు, 11,967 కిలోమీటర్ల జిల్లా రహదారులు, 10,335 కిలోమీటర్ల ఇతర రహదారులు ఉన్నాయి. అయితే ఈ మొత్తం రహదారుల్లో 16,864 కిలోమీటర్ల రహదారులు, అంటే 70 శాతం రోడ్లు సింగిల్ లేన్ రోడ్లుగానే ఉన్నాయి. ఇవి పెరుగుతున్న రవాణా అవసరాలను తీర్చలేకపోయాయి. 
ఈ  పరిస్థితిని గ్రహించిన తెలంగాణ ప్రభుత్వం సింగిల్ లేన్ రోడ్లను డబుల్ లేన్ రోడ్లుగా మార్చడానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఇదే క్రమంలో ఆర్ఓబీలతోపాటు పెద్దఎత్తున వంతెనల నిర్మానాలు కూడా చేపట్టింది. రూ.7,029 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో ఈ నాలుగేళ్లలో ఆర్ అండ్ బి పరిధిలో రహదారులు, వంతెనల నిర్మాణం చేపట్టింది. 16,864 కిలోమీటర్ల సింగిల్ లేన్ రోడ్లను డబుల్ లేన్ రోడ్లుగా మార్చుతున్నారు. 9,731 కిలోమీటర్ల రహదారులను డబుల్ లేన్ రోడ్లుగా మార్చారు. మిగతా పనులు పురోగతిలో ఉన్నాయి. రాష్ట్రంలో 511 వంతెనల నిర్మాణం చేపట్టగా,259 వంతెనల నిర్మాణం పూర్తయింది.

  • పంచాయతీరాజ్ రహదారుల నిర్మాణం
రాష్ట్రంలో 67,714 కిలోమీటర్ల పంచాయతీ రాజ్ రహదారులున్నాయి. ఇందులో 31,144 కిలోమీటర్ల రహదారులు మట్టి, మొరం రోడ్లు. 13,103 కిలో మీటర్లు కంకర రోడ్లు. మిగతా 23,467 కిలోమీటర్లు బీటీ రోడ్లయినా అవన్నీ అధ్వాన్న స్థితిలో ఉండేవి. మట్టి రోడ్లను బీటీ రోడ్లుగా మార్చడంతోపాటు, అద్వాన్నంగా ఉన్న బీటీ రోడ్లను మొరుగుపర్చడానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. 2014 నుంచి జనవరి 2019 నాటికి పంచాయతీ రాజ్ రోడ్ల అభివృద్ధికి రూ. 9,807 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. 10 వేల కిలోమీటర్ల మట్టి రోడ్లను బీటీ రోడ్లుగా అభివృద్ధి చేసే లక్ష్యంలో భాగంగా జనవరి 2019 నాటికి  8,042 కిలోమీటర్ల పని పూర్తయింది. 15,958 కిలోమీటర్ల మేర బీటీ రోడ్లకు మరమత్తులు చేపట్టగా, 14,583 కిలోమీటర్ల మేర పని పూర్తయింది. 511 వంతెన నిర్మాణం చేపట్టగా జనవరి 2019 నాటికి 312 వంతెనలు పూర్తయ్యాయి. 199 వంతెనల నిర్మాణ పనులు వివిధ దశల్లో వున్నాయి. ఈ వంతెనల వద్ద నీటి నిల్వలకు వీలుగా 312 చెక్ డ్యాములు నిర్మించారు. మరో 1235 చెక్ డ్యాములు నిర్మించాల్సి ఉంది. 346 బ్రిడ్జిల పని పూర్తయింది. మిగిలిన రోడ్లు, వంతెనల నిర్మాణాన్ని పూర్తిచేస్తున్నది. రాష్ట్రంలోని 12,751 గ్రామపంచాయతీలకు ఖచ్చితంగా బిటి రోడ్లు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.  2020-21 బడ్జెట్లో గ్రామాల్లో సిసి రోడ్ల నిర్మాణం కోసం రూ.600 కోట్లు కేటాయించారు.

నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యేలకు కార్యాలయాలు

ఎక్కడి నియోజక వర్గ ప్రజా ప్రతినిధి అక్కడే ప్రజలకు అందుబాటులో వుండే విధంగా ప్రజల సందర్శన సమయంలో విశాలమైన నివాసాలను నిర్మించాలనే ప్రభుత్వ యోచన ప్రజలనుంచి మన్ననలను అందుకున్నది. నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యేలకు కార్యాలయం, నివాస వసతితో కూడిన భవన సముదాయాలు ఒకేచోట ఉండేలా ప్రభుత్వం భవనాలు నిర్మిస్తున్నది. దీనివల్ల ఎమ్మెల్యే నియోజకవర్గ కేంద్రంలో ప్రజలకు అందుబాటులో ఉండటమే కాకుండా, ప్రజలతో తరచూ మమేకమవడానికి అవకాశం కలుగుతుంది. చాలామంది ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోనే మకాం పెడుతుండటంతో ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు. ఎమ్మెల్యేను కలవాలంటే ప్రజలు వ్యయ, ప్రయాసలకోర్చి రాజధానికి రావాల్సి వస్తోంది. దీన్ని నివారించి, ఎమ్మెల్యేలకు కూడా వసతిగా ఉండేలా ఈ భవనాల ప్రణాళిక రూపొందించింది ప్రభుత్వం. ఒక్కోటి కోటి రూపాయల వ్యయంతో 500 గజాల విస్తీర్ణంలో 104 క్యాంపు కార్యాలయాలను నిర్మిస్తున్నారు. ఈ భవన నిర్మాణం మొదటి అంతస్తులో మీటింగు హాల్, ఎమ్మెల్యే కార్యాలయం, వీఐపీలాంజ్, అతిథులు వేచి ఉండే గదులు, పీఏ, పీఎస్‌లకు ప్రత్యేక గదులు, రిసెప్షన్, భద్రతా అధికారులకు గదులు వుంటాయి. రెండవ అంతస్తులో మాస్టర్ బెడ్‌రూం, పిల్లల బెడ్‌రూం, డైనింగ్ కం లివింగ్ స్టోర్స్, టాయ్‌లెట్లు, సిట్‌అవుట్, పూజగది వుంటాయి. మొత్తం రెండు అంతస్తుల్లో ఈ భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయి.

విద్య – రెసిడెన్షియల్స్
 
తెలంగాణ ఏర్పాటు కాకముందు రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కలిపి కేవలం 298 (261+37 జనరల్) రెసిడెన్షియల్ స్కూళ్లు మాత్రమే ఉండేవి.  కొత్తగా 661 ( 608 స్కూళ్లు + 53 డిగ్రీ కాలేజీలు) రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభించిన ప్రభుత్వం మొత్తం రెసిడెన్షియల్ స్కూళ్ల సంఖ్యను 959 (906+53డిగ్రీ కాలేజీలు)కి తీసుకువచ్చింది. బాలికల విద్యను ప్రోత్సహించేందుకు, వారికి అత్యంత భద్రత, సౌకర్యం కల్పిస్తూ సగం రెసిడెన్షియల్స్ ను బాలికల కోసం కేటాయించారు. ఈ లెక్కన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ రెసిడెన్షియల్స్ (డిగ్రీ రెసిడెన్షియల్స్ మినహాయిస్తే) స్కూళ్లలో రాబోయే ఐదేళ్లలో 4,74,240 మంది విద్యార్థులకు అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం నడుస్తున్న గురుకులాల్లో మొత్తం 2.72 లక్షల మంది విద్యార్ధులు చదువుకుంటున్నారు. ఒక్కో విద్యార్థిపై ఏడాదికి సగటున రూ.1.20 లక్షలను ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. 
మైనారిటీలకు కొత్తగా 192 రెసిడెన్షియల్ స్కూల్స్ తెలంగాణ రాకముందు మైనారిటీలకు 12 రెసిడెన్షియల్ స్కూళ్లు మాత్రమే వుండేవి. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత సంవత్సరమే కొత్తగా 71 మైనారిటీ రెసిడెన్షియల్స్, 2017 జూన్ లో మరో 121 రెసిడెన్షియల్స్ ప్రారంభించారు. దీంతో మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్ల సంఖ్య 204 కు చేరింది. 2018-19 బడ్జెట్లో మైనారిటీ గురుకులాల కోసం రూ.735 కోట్లు కేటాయించారు. ఈ రెసిడెన్షియల్ స్కూళ్లలో మొత్తం 57,980 విద్యార్థులు చదువుకుంటున్నారు. రాబోయే ఐదేళ్లలో ఈ సంఖ్య లక్షా 30 వేలకు చేరుకుంటుంది. ఒక్కో విద్యార్థిపై ఏడాదికి సగటును లక్ష  రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నారు. 2016-17లో 5,6,7 వ తరగతుల్లో ప్రవేశాలు కల్పించారు.  ప్రతీఏడాది ఒక్కోతరగతి పెంచుకుంటూ పోతారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో విద్యార్థులకు ఉచిత విద్య, భోజనం, వసతి, దుస్తులు, పుస్తకాలు, యూనిఫారం, బెడ్డింగ్, షూస్, క్రీడా సౌకర్యాలు, గ్రంధాలయం, పరిశోధనశాలలన్నింటినీ ఉచితంగా సమకూరుస్తున్నారు.

8 మైనారిటీ గురుకులాలలు జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ : కేజీ టూ పీజీ ఉచిత విద్యలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మైనార్టీ గురుకులాలు క్రమంగా అప్‌గ్రేడ్‌ అవుతున్నాయి. ఇది వరకు ఎస్సెస్సీ వరకే విద్యాబోధన జరుగగా, 2020-21 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్‌ విద్య అందుబాటులోకి రాబోతున్నది. ఇలా హైదరాబాద్‌లో 8 మైనార్టీ గురుకులాలను జూనియర్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేస్తూ టెమ్రీస్‌ అధికారులు 1 మార్చి 2020న  ఉత్తర్వులు విడుదల చేశారు. వీటిల్లో సిబ్బందిని నియమించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
బీసీలకు కొత్తగా 261 గురుకుల పాఠశాలలు, 1 డిగ్రీ కళాశాల - మొత్తం 281 తెలంగాణ ఏర్పడక ముందు రాష్ట్రంలో కేవలం 19 గురుకులాలు మాత్రమే ఉండేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బీసీల కోసం 2016-17లో 17 గురుకులాలు,  2017-18 లో 125 రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభమయ్యాయి. పాతవి 19, రాష్ట్రం ఏర్పడిన తరువాత ఏర్పాటయిన 142 కలుపుకొని మొత్తం రాష్ట్రంలో రెసిడెన్షియల్ పాఠశాల సంఖ్య 161  కి చేరింది. ఒక డిగ్రీ కళాశాలను కూడా కలుపుకుంటే వీటి సంఖ్య 162 కి చేరింది. 2019-20 విద్యా సంవత్సరం నుంచి  నియోజకవర్గానికి ఒక్కటి చొప్పున మరో 119 బిసి గురుకులాలను ఏర్పాటు చేశారు. వీటిని 17జూన్, 2019న ప్రారంభించారు. దీంతో మొత్తం బీసీ గురుకులాల సంఖ్య 281 కి చేరింది. బిసి గురుకులాల్లో మొత్తం 39,924 మంది చదువుకుంటున్నారు. మొదటి ఏడాది 5,6,7 తరగతుల్లో ప్రవేశాలు కల్పించారు. ఒక్కో తరగతిలో రెండు సెక్షన్ల చొప్పున మొదటి  ఏడాది ఒక్కో గురుకులంలో 240 మంది పిల్లలకు ప్రవేశం కల్పించారు. ఐదేళ్లలో ఒక్కో ఏడాది ఒక్కో తరగతిని పెంచుతూ 12వ తరగతి వరకు క్లాసులు నిర్వహిస్తారు. అప్పుడు ఒక్కో స్కూళ్లో 640 మంది విద్యార్థులు ఉంటారు. ఒక్కో విద్యార్థిపై ఏడాదికి సగటున రూ. లక్షకు పైగా ఖర్చు చేస్తున్నారు. 2018-19 బడ్జెట్లో రూ.296 కోట్లు కేటాయించారు.ఈ నాలుగేండ్ల బడ్జెట్లలో గురుకులాల కోసం ప్రభుత్వం మొత్తం రూ.561 కోట్లు కేటాయించింది. 2018-19 లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో విద్యార్ధులు 90.29 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్ర సగటు ఉత్తీర్ణత 65% ఉండగా.. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకన్నా గురుకుల విద్యార్థులు మెరుగైన ప్రతిభ చూపించారు. వీటి పరిధిలో 1,633 మంది పరీక్షకు హాజరుకాగా 1,474 మంది ఉత్తీర్ణులయ్యారు.
ఎస్సీలకు కొత్తగా 104 గురుకుల పాఠశాలలు, 30 మహిళా డిగ్రీ కళాశాలలు- మొత్తం 134 రాష్ట్రం ఏర్పడక ముందు ఎస్సీలకు 134 రెసిడెన్షియల్ పాఠశాలలు ఉండేవి. రాష్ట్రం ఏర్పడిన తరువాత కొత్తగా ఎస్సీలకు 104 గురుకుల పాఠశాలలు, 30 మహిళా డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు మొత్తం వీటి సంఖ్య 264 కి చేరింది. వీటిలో 2017-18లో విద్యార్థులు 80 శాతం ఉత్తీర్ణత సాధించారు.  2018-19 ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ఎస్సీ గురుకులాల్లోని విద్యార్ధులు 84.31 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ గురుకులాల నుంచి 8,877 మంది పరీక్షకు హాజరుకాగా.. 7,484 మాంది పాసయ్యారు. 14 కళాశాలలు నూరుశాతం ఫలితాలు సాధించగా.. 5,165 మంది ఏ గ్రేడ్ సాధించారు. పదో తరగతి పరీక్షల్లో 2018-19 విద్యాసంవత్సరంలో 92.58 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 8,854 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 8,230 మంది ఉత్తీర్ణులయ్యారు.

ఎస్టీలకు కొత్తగా 51గురుకుల పాఠశాలు, 22 డిగ్రీ కళాశాలలు - మొత్తం 73

రాష్ట్రం ఏర్పడక ముందు ఎస్టీల కోసం 96 రెసిడెన్షియల్ పాఠశాలలు ఉండేవి. రాష్ట్ర అవతరణ తరువాత ఎస్టీల కోసం 51 గురుకులాలు ప్రారంభించారు. అలాగే 22 డిగ్రీ కాలేజీలు ప్రారంభించారు. ప్రస్తుతం పాతవి కొత్తవి కలిపి మొత్తం రాష్ట్రంలో 169 గురుకులాలు ఉన్నాయి. ఈ గురుకులాల్లో చదువుకుంటున్న విద్యార్ధులు ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 82.36 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 3,317 మంది పరీక్షలు రాయగా, 2732 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 1,611 మంది ఏ గ్రేడ్ సాధించారు.

రాష్ట్రంలోని మొత్తం గురుకుల పాఠశాలలు, డిగ్రీ కాలేజీలు

కొత్త రె.పా.

కొత్త డిగ్రీ కాలేజీలు

మొత్తం కొత్తవి

మొత్తం పాతవి

మొత్తం

ఎస్సీ

104

30

134

134

268

ఎస్టీ 

51

22

73

96

169

మైనారిటీ

192

-

192

12

204

బీసీ

261

1

262

19

281

జనరల్

-

-

-

37

37


608

53

661

298

959

(906 + 53)




2016-17

2017-18

2018-19

రాష్ట్రం ఏర్పడిన తరువాత 

రాష్ట్రం ఏర్పడక ముందు

మొత్తం

పాఠశాలలు

243

246

119

608

298

906

డిగ్రీ కాళేజీలు

-

53


53

-

53





542

298

959


తెలంగాణ రాష్ట్రంలో రెసిడెన్షియల్ స్కూల్స్ వివరాలు

క్ర.సం.

శాఖ

2014 జూన్ ముందు

స్కూళ్లు – టీచర్లు-విద్యార్థులు

తెలంగాణ వచ్చాక...

స్కూళ్లు – టీచర్లు-విద్యార్థులు

స్కూళ్ల సంఖ్య

1

ఎస్సీ

134

1,183

82,063

104

1,854

48,897

238

2

ఎస్టీ

96

1,153

31,391

61

1,420

23,660

157

3

మైనార్టీ

12

258

7,680

192

3,930

82,480

204

4

బీసీ

19

242

8,000

261

3,669

83,680

280

5

జనరల్

37

739

16,120

-

-

11,880

37


మొత్తం

298

3,575

1,45,254

618

10,873

2,50,597

916


డిగ్రీ కాలేజీలు (2014 తర్వాత)

క్రమ సంఖ్య

శాఖ

కాలేజీలు

లెక్చరర్లు

విద్యార్థులు

1

ఎస్సీ

30

483

25,200

2

బీసీ

1

31

800

3

ఎస్టీ

22

880

7,835


మొత్తం

53

1394

33,835


రెసిడెన్షియల్ విద్యాసంస్థల మొత్తం వివరాలు

గురుకులాలు

విద్యార్థులు

టీచర్లు/లెక్చరర్లు


పాఠశాలలు

916

15,872

డిగ్రీ కాలేజీలు

53

1,394

మొత్తం

969

17,266





ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గుతున్న డ్రాపౌట్స్

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో డ్రా పౌట్స్ తగ్గుతూ, రిటెన్షన్ (విద్యా సంవత్సరం చివరి వరకు కొనసాగడం) పెరుగుతున్నాయని సర్వశిక్షా అభియాన్ తన వార్షిక నివేదికలో(2017-18) తెలిపింది. 33 జిల్లాల్లో కలిపి 69.83 శాతం రెటెన్షన్ రేటు నమోదైంది. 2016-17లో డ్రాపౌట్స్ రేటు 18 శాతం ఉండగా, 2017-18 లో 3.3 శాతానికి తగ్గింది. ప్రమోషన్ రేటు (పై తరగతులకు వెళ్లేవారు) 96.4 శాతం నమోదయ్యింది. తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక విద్యాభివృద్ధి కోసం మధ్యాహ్న భోజన పథకం, హాస్టళ్లకు సన్నబియ్యం, ఉచిత పుస్తకాలు, రెండు జతల యూనిఫారాల పంపిణీ, వందశాతం మెస్ చార్జీలు తదితర కార్యక్రమాల వల్ల పాఠశాలల్లో డ్రాపౌట్స్ తగ్గాయి.

ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పెరుగుతున్న అడ్మిషన్స్

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం డిగ్రీ కాలేజీల బలోపేతానికి చర్యలు చేపట్టింది. విద్యార్థులకు సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేసింది. దీంతో అడ్మిషన్ల సంఖ్య పెరుగుతూ వస్తుంది. 2016-17లో 22,820 అడ్మిషన్లు నమోదవగా.. 2017-18లో 27,802, 2018-19 లో 42,266 మంది ప్రవేశాలు పొందారు. 2019-20 విద్యా సంవత్సరంలో తెలుగు, ఇంగ్లిష్ మీడియం కోర్సుల్లో కలిపి మొత్తం 70 వేల పైచిలుకు సీట్లు అందుబాటులోకి తేవడంతో గతం కంటే ఈ సారి 39శాతం ప్రవేశాలు నమోదయ్యాయి. కోర్సు, మీడియం డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని సీట్లు పెంచారు. ముఖ్యంగా బీకాం కంప్యూటర్స్, బీకాం కంప్యూటర్ అప్లికేషన్ కోర్సులు ఇంగ్లిష్ మీడియంలో ఎక్కువ సీట్లు అందుబాటులో ఉంచారు. డిమాండ్ లేని కోర్సులను మూసివేసి, ఉద్యోగాలు పొందేందుకు అనుకూలంగా ఉండే వాటినే అందిస్తుండడంతో ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లు పెరుగుతున్నాయి.

విద్యార్థుల విదేశీ విద్యకు ఓవర్సీస్ స్కాలర్ షిప్స్

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు విదేశీ విద్యను అభ్యసించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓవర్సీస్ స్కాలర్ షిప్ పథకం అమలు చేస్తున్నది. తెలంగాణ ఏర్పడక ముందు ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే ఈ పథకం అమలయ్యేది. తెలంగాణ రాష్ట్రంలో బీసీ, ఇబీసీ, మైనారిటీలకు కూడా అమలు చేస్తున్నారు. అలాగే, ప్రభుత్వం అగ్రవర్ణ కులాలకు చెందిన పేద విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని వర్తింపచేసింది. గతంలో కేవలం పది లక్షల రూపాయల గరిష్ట పరిమితి ఉండేది. ఇప్పుడు ఈ పథకం కింద రూ. 20 లక్షల వరకు అందిస్తున్నారు. ఆదాయ పరిమితిని కూడా రూ. 4 లక్షల 50 వేలకు పెంచారు. పది శాతం ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు హ్యుమనిటీస్, ఎకనామిక్స్, అకౌంట్స్, ఆర్ట్స్ విద్యార్థులకు రిజర్వ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి డిసెంబర్ 2019 నాటికి 1,436 మంది విద్యార్థులు లబ్ధిపొందగా.. వీరి కోసం ప్రభుత్వం రూ.326.51 కోట్లు ఖర్చు చేసింది. ఈ ఉపకార వేతనంతో పేద విద్యార్థులు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజిలాండ్, జపాన్, ఫ్రాన్స్, దక్షిణ కొరియా తదితర దేశాల్లోని ప్రఖ్యాత యూనివర్సిటీల్లో పోస్టు గ్రాడ్యుయేషన్, పీహెచ్‌డీ చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఇలాంటి పథకమే ఉన్నా.. వందమందిలోపే విద్యార్థులు ఎంపికయ్యారు. స్కాలర్‌షిప్ రూ. 5 లక్షలు కూడా ఉండేదికాదు. ఇప్పుడు రూ.20 లక్షలు కేటాయిస్తున్నారు. 2018-19 బడ్జెట్లో ఈ పథకం అమలుకు రూ.174.50 కోట్లు కేటాయించారు.

మైనారిటీ విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్ షిప్

ప్రతిభావంతులైన మైనారిటీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి అవసరమైన ఆర్థిక సహాయం అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్లతో ‘ఓవర్సీస్ స్కాలర్ షిప్’ పథకాన్ని 2015 మే 19న ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఎస్సీ విద్యార్థుల కోసం ఇలాంటి కార్యక్రమం అమలులో వుంది. అదే తరహాలో మైనారిటీలకు కూడా ఆర్థిక చేయూత అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యావంతులైన మైనారిటీలు మరింత ఉన్నత చదువుకోసం  విదేశాలకు వెళ్లాలంటే, చాలామందికి ఆర్థిక స్థోమత వుండదు. అలాంటి వారికి ఈ పథకం ద్వారా ప్రభుత్వం సాయం అందిస్తున్నది. ఒక్కొక్కరికి పది లక్షల స్కాలర్ షిప్ తోపాటు విమానయాన ఖర్చులు కూడా అందించేవారు.  కానీ, ఈ మొత్తాన్ని రూ.10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచారు. ఆదాయ పరిమితిని కూడా 4.5 లక్షల రూపాయలకు పెంచారు.  మైనారిటీల ‘ఓవర్సీస్ స్కాలర్ షిప్ స్కీమ్’ ద్వారా 2020 జనవరి నాటికి 1,436 మంది మైనారిటీ విద్యార్థులకు రూ.218.92 కోట్లు ప్రభుత్వం సాయం అందించింది.

ఎస్సీ, ఎస్టీ, విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్

ప్రతిభావంతులైన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి అవసరమైన ఆర్థిక సహాయం అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ స్కీమ్ ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా ఇచ్చే ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గణనీయంగా పెంచింది. గతంలో ఒక్కో విద్యార్థికి రూ.10 లక్షలు మాత్రమే ఇచ్చేవారు. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ. 20 లక్షలు ఇస్తున్నది. అంబేద్కర్ ఓవర్సీస్ పథకం కింద మహిళలకు ప్రాధాన్యం ఇస్తూ 35 శాతం రిజర్వేషన్లను అమలుచేస్తున్నారు. ఈ పథకం ప్రారంభం (అనగా 2014-15) నుండి 2019 ఆగస్టు 1 నాటికి 489 మంది ఎస్సీ విద్యార్థులకు రూ.72.99 కోట్లు, 146 మంది ఎస్టీ విద్యార్థులకు రూ.21.65 కోట్లు ఆర్థిక సాయం అందించారు. ఆర్థిక సాయం పొందినవారిలో 55 మంది అమెరికాలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో విద్యను అభ్యసిస్తుండటం విశేషం. మరికొందరు కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ వంటి దేశాల్లో చదువుకుంటున్నారు. ఎస్సీలలో దాదాపు 89 శాతం మంది అమెరికాలోని ప్రముఖ వర్సిటీల్లో చేరారు.

మహాత్మా జ్యోతిబాపూలే బి.సి. విదేశీ విద్యానిధి

బీసీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి ప్రభుత్వం మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ ఓవర్సీస్ స్కాలర్ షిప్ పథకాన్ని ప్రవేశపెడుతూ 2016 అక్టోబర్ 10న జి.ఓ.నెం.23 జారీ చేసింది. ఈ పథకం కింద ఒక్కో విద్యార్థికి గరిష్టంగా రూ.20 లక్షల వరకు ఆర్థిక సహాయం చేస్తున్నారు.  2019 ఆగస్టు నాటికి 536 మంది బీసీ విద్యార్థులు లబ్ధిపొందారు. వీరికోసం రూ. 75.97 కోట్లు ఖర్చు చేశారు. ఎక్కువమంది ఆస్ట్రేలియా, కెనడాల్లోని వర్సిటీల్లో విద్యను అభ్యసిస్తున్నారు.

ఈబీసీలకు..
ఆగస్టు 2019 నాటికి 34 మంది ఈబీసీ విద్యుర్థులకు ఈ పథకం ద్వారా సహాయం అందించారు. వీరికి ప్రభుత్వం రూ.3.40 కోట్ల సాయాన్ని అందజేసింది.

విద్యార్థులకు ఫీజు రీ ఎంబర్స్ మెంట్

తెలంగాణ ఏర్పాటుకు ముందు అధికారంలో ఉన్న ప్రభుత్వం నాలుగేళ్లపాటు ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించడంలో జాప్యం చేసింది. దీంతో ఈ మొత్తాలు రూ.1,756 కోట్ల వరకు చేరగా, వాటన్నింటినీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించింది. విద్యార్థుల సంక్షేమం కోసం పాతఫీజు రీఎంబర్స్ మెంట్ పథకాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనారిటీలు, ఈబీసీ, వికలాంగులైన 13 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందు తున్నారు. కేంద్రం భరించాల్సిన ఎస్సీ, ఎస్టీ, బీసీల రీయింబర్స్ మెంట్ పథకానికి అరకొరగా నిధులిస్తున్నది. 2018-19 విద్యాసంవత్సరంలో విద్యార్థుల స్కాలర్ షిప్స్, ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం కోసం ప్రభుత్వం రూ.3,282 కోట్లు కేటాయించింది. 2020-21 ఫీజురీయింబర్స్ మెంట్ కోసం రూ.2650 కోట్లు కేటాయించింది. మొత్తంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం ఏర్పాటైన నాలుగున్నరేండ్లలో ఫీజు రీ ఎంబర్స్ మెంట్ కోసం  రూ.10,202.19 కోట్లు ఖర్చు చేసింది.

విద్యార్థులకు మెస్ చార్జీలు పెంపు

హాస్టల్‌ విద్యార్థుల మెస్‌ చార్జీలను ప్రభుత్వం వివిధ శ్లాబు కేటగిరీల్లో 30 శాతం నుంచి 90 శాతం వరకు పెంచింది. ఈ మేరకు 2017 మార్చి 27న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అసెంబ్లీలో ప్రకటించారు. ఈ పెంపుదలతో 18 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం మూడో తరగతి నుంచి 7వ తరగతి విద్యార్థులకు నెలకు చెల్లించే రూ.750 రూ.950 వరకు, 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు చెల్లించే రూ.850 నుంచి రూ. 1,100 పెంచింది. ఇంటర్ నుంచి డిగ్రీ వరకు ప్రభుత్వ కళాశాల హాస్టల్లోని విద్యార్థులకు చెల్లిస్తున్న మెస్‌ చార్జీలను ప్రభుత్వం రూ.1,050 నుండి రూ.1,400 పెంచింది. కాలేజీ అటాచ్డ్ హాస్టళ్లు, స్టూడెంట్ మేనేజ్డ్ హాస్టల్స్, డే స్కాలర్స్ విషయంలో 4 కేటగిరీల్లో 13 లక్షల మంది విద్యార్థులున్నారు. ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థులకు రూ.962 నుంచి రూ.1,500, పీజీ విద్యార్థులకు 682 నుంచి రూ. 1,500, డిగ్రీ విద్యార్థులకు రూ.580 నుంచి రూ.1,000, ఇంటర్మీడియెట్ వారికి రూ.520 నుంచి 750, స్టూడెంట్ మేనేజ్డ్ హాస్టల్స్ కు, డే స్కాలర్స్ కి ప్రొఫెషనల్ కోర్సులకు రూ.462 నుంచి రూ.680, పీజీ కోర్సులకు రూ.442 నుంచి రూ.650, డిగ్రీ విద్యార్థులకు రూ.325 నుంచి రూ.500, ఇంటర్ విద్యార్థులకు రూ.325 నుంచి రూ.500 వరకు మెస్ చార్జీలు పెరిగాయి.

పాఠశాల విద్యార్థులకు పెరిగిన మధ్యాహ్న భోజన చార్జీలు

ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల్లలో దాదాపు 19 లక్షల మంది విద్యార్ధులు చదువుకుంటున్నారు. వీరికి అయ్యే భోజన ఖర్చులో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాథం భరిస్తుంది. 9, 10 తరగతుల్లోని 4.73 లక్షల మంది విద్యార్థుల భోజన ఖర్చులను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నది.
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా  మధ్యాహ్న భోజన పథకం వంట ఖర్చు ధర పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం 2019 మే 3న ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో విద్యార్థికి ప్రాథమిక పాఠశాలల్లో వంట ఖర్చు రూ. 4.13 నుంచి రూ. 4.35కు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో రూ. 6.18 నుంచి రూ. 6.51కు, 9, 10 తరగతులకు కూడా రూ. 6.18 నుంచి రూ. 6.51కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. రూ. 2 గుడ్డు ధరతో కలిపి ఉన్నత పాఠశాలల్లో రూ. 8.51కు పెంచింది. పెంచిన భోజన ధరలతో ప్రభుత్వంపై అధనంగా రోజుకు రూ.7 లక్షల అదనపు భారం పడుతుంది.

సంపూర్ణ అక్షరాస్యత కోసం ‘ఈచ్‌ వన్‌ టీచ్‌ వన్‌’ కార్యక్రమం

అక్షరాస్యతను పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ‘ఈచ్‌ వన్‌ టీచ్‌ వన్‌’ అనే కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. వేసవి సెలవుల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కార్యక్రమం అమలు చేయడానికి అధికారులు విధివిదానాలు తయారుచేస్తున్నారు. నిరక్షరాస్యుల తాజా సమాచారం కోసం గ్రామాలవారీగా నిరక్షరాస్యుల వివరాలను సేకరిస్తోంది. అందులో గుర్తించిన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపైనా దృష్టి పెట్టింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం 2020-21 బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించింది.

ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనారిటీ అభ్యర్థుల కోసం స్టడీ సర్కిల్స్‌

యూపీఎస్సీ, టిఎస్‌పిఎస్సి లాంటి పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడం పేద విద్యార్థులకు భారంగా మారింది. పైగా మంచి శిక్షణకు హైదరాబాద్‌లో తప్ప ఇతర చోట్ల స్టడీ సర్కిళ్లు లేవు. అందుకే ప్రభుత్వం జిల్లాస్థాయిలోనే ఎస్సీ,ఎస్టీ, బీసీ స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేసింది. తెలంగాణ ఏర్పడే నాటికి ఎస్సీలకు 1, ఎస్టీలకు 4, బీసీలకు 9 స్టడీ సర్కిళ్లు వుండేవి. వీటి నిర్వహణకు రూ. 22 కోట్లు ఖర్చు చేశారు. పాత వాటితో కలుపుకొని రాష్ట్రంలో ఎస్సీలకు 10, ఎస్టీలకు 5, బిసి లకు 10, మైనారిటీలకు 1 స్టడీ సర్కిళ్లు ఏర్పాటు అయ్యాయి. వీటి నిర్వహణకు ప్రభుత్వం నాలుగేండ్లలో రూ. 253.91 కోట్లు ఖర్చు చేసింది. వివిధ అంశాలపై శిక్షణతోపాటు వసతి, భోజనం, గ్రంథాలయం, కంప్యూటర్లు, ఇంటర్నెట్, పుస్తకాల కొనుగోలు నిధి వంటి సదుపాయాలు కల్పిస్తున్నారు.

కాళోజీ పేరిట వరంగల్ లో హెల్త్ యూనివర్సిటీ

వరంగల్ నగరంలో కాళోజీ నారాయణ రావు పేరుతో హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం 2014 సెప్టెంబర్ 25న సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి 2016 ఆగస్టు 7న శంకుస్థాపన చేశారు. దీంతో తెలంగాణలోని వైద్య కళాశాలలన్నీ విజయవాడలోని ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పరిధి నుంచి వరంగల్ కాళోజీ నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీ పరిధిలోకి వచ్చాయి. ఇందుకోసం 2016 ఫిబ్రవరి 9న తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీచేసింది.

ఈ ఉత్తర్వుల ప్రకారంగా 27 అలోపతి (మోడరన్ మెడిసిన్) మెడికల్ కాలేజీలు (3950 అండర్ గ్రాడ్యుయేట్-యూజీ సీట్లు, 1408 పీజీ సీట్లు, 90 సూపర్ స్పెషాలిటీ సీట్లు), 12 డెంటల్‌ కాలేజీలు (1140 యూజీ, 278 పీజీ సీట్లు), 5 హోమియోపతి కాలేజీలు (450 యూజీ, 30 పీజీ సీట్లు), 2 ఆయుర్వేద కాలేజీలు (200 యూజీ, 38 పీజీ సీట్లు), 1 నేచురోపతి కాలేజీ (30 యూజీ సీట్లు), 2 యునానీ కాలేజీలు ( 175 యూజీ, 48 పీజీ సీట్లు), 77 నర్సింగ్ కాలేజీలు ( 4230 యూజీ, 383 పీజీ సీట్లు), 20 బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కాలేజీలు (680 యూజీ సీట్లు), 16 ఫిజియోథెరపీ కాలేజీలు (850 యూజీ-బీపీటీ సీట్లు, 112 పీజీ-ఎంపీటీ సీట్లు)తోపాటు న్యూట్రిషన్, పబ్లిక్‌ హెల్త్‌ కాలేజీలు, ఉద్యోగులు కూడా కాళోజీ హెల్త్ వర్సిటీ పరిధిలోకి వస్తారు.

కొత్తగా ఐదు మెడికల్ కాలేజీలు

రాష్ట్ర వైద్య విద్యను మరింత అభివృద్ధి చేయడం కోసం కొత్తగా నాలుగు వైద్య కళాశాలలను ప్రభుత్వం మంజూరు చేసింది. మహబూబ్ నగర్, సిద్దిపేట, సూర్యాపేట, నల్గొండలలో వీటిని ఏర్పాటు చేసింది. ఈ ఫైలుపై సీఎం కేసీఆర్ 22 మే, 2018న సంతకం చేశారు. ఒక్కో వైద్య కళాశాలలో 150 చొప్పున సీట్లు కేటాయించారు. దీనికి అనుబంధంగా 750 పడకల ఆసుపత్రులు కూడా ప్రారంభమవుతున్నాయి.  అలాగే, హైదరాబాద్ సనత్ నగర్ లో  ఈఎస్ఐ మెడికల్ కాలేజీ కూడా ప్రారంభమైంది. దీంతో మరో 100 మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి.

బీబీనగర్ లో ఎయిమ్స్ ప్రారంభం

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్ లో 2019 ఆగస్టు నుంచే ప్రజలకు  వైద్యసేవలు అందిస్తుండగా,  డిసెంబర్ 4న అధికారికంగా  ప్రారంభమైంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దాదాపు 200 ఎకరాల్లో నిర్మించి ఎయిమ్స్ లో రోగులకు 1000 పడకల ఆస్పత్రి సౌకర్యంతోపాటు, ఎంబీబీఎస్ విద్యార్థులకు 50 మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి.

వరంగల్ లో సైనిక్ స్కూల్

నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ సైనిక్‌ స్కూల్‌ను వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం ఎలుకుర్తిలో 53.16 ఎకరాల్లో నెలకొల్పనున్నారు.  సైనిక్ స్కూల్ స్థాపన కోసం 2017 మార్చి 2న కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎం.ఓ.యూ.పై సంతకాలు చేశాయి. నిర్మాణ పనులను ప్రారంభించేందుకు ఒక వివరణాత్మక ప్రాజెక్ట్ రిపోర్ట్ (డి.పి.ఆర్.) సిద్ధం చేసింది.  భవనాల నిర్మాణానికి, ఇతర సామగ్రి, పరికరాలకు రూ.100 కోట్లతో డిపిఆర్ ను సిద్ధం చేయగా, కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సైనిక్ స్కూల్ కి భూసేకరణ కోసం ప్రభుత్వం రూ.4 కోట్లను విడుదల చేసింది.

కొత్తగా 15 కేంద్రీయ విద్యాలయాలు మంజూరు

రాష్ట్రంలో 32 కేంద్రీయ విద్యాలయాలు, 9 జవహర్ నవోదయ కేంద్రాలున్నాయి. కొత్తగా మరో 15 కేంద్రీయ విద్యాలయాలు మంజూరయ్యాయి. నిజామాబాద్ టౌన్, భువనగిరి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జోగులాంబ గద్వాల, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కొమురంభీం ఆసిఫాబాద్, నాగర్ కర్నూల్, నిర్మల్, వనపర్తి, వరంగల్ రూరల్ జిల్లాల్లో  వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.  

మౌలిక సదుపాయాలు

మంచినీరు, రహదారులు, విద్యుత్, గృహ నిర్మాణం లాంటి మౌలిక సదుపాయల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. తెలంగాణలో ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి చిత్తశుద్దితో ప్రయత్నాలు చేస్తున్నది.

ప్రతీ ఇంటికి ప్రతిరోజు సురక్షిత మంచినీరు అందించడానికి ‘మిషన్ భగీరథ’

స్వతంత్ర్యం సిద్దించి ఏడు దశాబ్దాలు దాటినా చాలా ప్రాంతాల్లో ప్రజలు మంచీనీటికి అలమటించారు. పరిశుభ్రమైన మంచినీరు లేక ప్రజలు అనారోగ్యం పాలయ్యేవారు. మారుమూల పల్లెలు, ఆదివాసీ గూడేలు, లంబాడి తండాలు, ఎరుకుల వాడలు తదితర ఆవాస ప్రాంతాలకు మంచినీటి భాగ్యమే కలగలేదు. ఎండాకాలో భూగర్భ జలాలు అడుగంటి పోవడం వల్ల ప్రధాన ఆవాసాలకు కూడా ప్రతీ రోజు మంచినీటి సరఫరా జరిపే పరిస్థితి లేదు. దీంతో ప్రజలు మంచినీటి కోసం కిలోమీటర్ల కొద్ది నడిచి వెళ్లి, వ్యవసాయ బావుల వద్ద, చెరువుల వద్ద, నదుల చెలిమల ద్వారా మంచినీరు తెచ్చుకునే వారు. ఈ అవస్థలు గమనించిన తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు సురక్షిత మంచినీరు ఇవ్వడం ప్రభుత్వ ప్రాథమిక కర్తవ్యం అని  ప్రభుత్వం గుర్తించింది. అందుకే ప్రతీ ఇంటిలో నల్లా ద్వారా మంచినీరు అందించే మిషన్ భగీరథ పథకం చేపట్టింది. తెలంగాణకు ఇరువైపులా ఉన్నా గోదావరి, కృష్ణా నదుల ద్వారా నీటిని తోడి, వాటిని శుద్ధి చేసి, ప్రతీ రోజు ప్రతి ఇంటికి నల్లా ద్వారా అందించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
 
మిషన్ భగీరథ స్వరూపం : రూ.43,791 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టును 26 ప్రధాన సెగ్మెంట్లుగా విభజించారు. 67 ఇన్ టేక్ వెల్స్, 153 నీటిని శుద్ధి చేసే ప్లాంట్లు, 1 లక్ష 40 వేల కి.మీ. పైప్ లైన్లతో, 35,514 ఓ.హెచ్.ఆర్. ల ద్వారా పల్లెకు, పట్టణానికి, ప్రతీ ఇంటికీ భగీరథ నీరు చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా, మిషన్ భగీరథ  పథకం ద్వారా జనవరి 2019 నాటికి రాష్ట్రంలోని 23,968 ఆవాసాలకు బల్క్ గా నీళ్లు సరఫరా అవుతున్నాయి. ఈ ఆవాసాల్లో మొత్తం సుమారు 55.62 లక్షల ఇండ్లు ఉన్నాయి. తెలంగాణ చూపిన దారిలో ఈ పథకం అమలు చేయడానికి 11 రాష్ట్రాలు ఆసక్తి చూపుతున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలు మిషన్ భగీరథ పథకాన్ని అమలు చేయడం మంచిదని నీతి ఆయోగ్ సిఫారసు చేసింది. ఇది మిషన్ భగీరథకు దక్కిన గొప్ప ప్రశంస.

మొదటి దశను ప్రారంభించిన ప్రధాని మోడీ

మెదక్ జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండలో ప్రధాని నరేంద్రమోడీ మిషన్ భగీరథ పథకాన్ని 2016 ఆగస్టు 7న ప్రారంభించారు. మిషన్‌ భగీరథ పైపుల ద్వారా ప్రతీ ఇంటికి మంచినీళ్లు ఇవ్వడంతోపాటు, ప్రతీ ఇంటికీ ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించేందుకు ఫైబర్‌ ఆప్టికల్‌ కేబుల్‌ వేస్తున్నారు. దీంతో రాష్ట్రంలోని మొత్తం 2 కోట్ల 72 లక్షల (రూరల్- 2.17 కోట్లు/అర్బన్ -54.51 లక్షలు) మందికి మంచి నీరందనుంది. రూరల్ ప్రాంతాల్లోని 24,248 ఆవాస ప్రాంతాలకు 52.47 లక్షల నివాసాలకు, 65 అర్బన్ ఏరియాల్లోని  12.83 లక్షల నివాసాలకు నీరందనుంది. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని 7  అర్బన్ లోకల్ బాడీలు, రూరల్ ప్రాంతాల్లోని 183 ఆవాస గ్రామాలకు ఈ పథకం ద్వారా నీళ్లందించనున్నారు.

మారుమూల జనావాసాలకు కూడా పైపు లైన్లు : గిరిజన తండాలు, ఎస్సీ వాడలు, గోండు గూడేలు, అటవీ ప్రాంతాల్లోని మారుమూల జనావాసాలకు కూడా  పైప్ లైన్ల ద్వారా మంచినీరివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో 65 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ప్రాజెక్టు పూర్తి చేసిన కాంట్రాక్టర్లే పదేండ్లు నిర్వహణ చేపట్టేలా ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకున్నది.

మిషన్ భగీరథ ద్వారా పరిశ్రమలకు నీరు:  మిషన్ భగీరథ ద్వారానే పరిశ్రమలకు కూడా శుద్ధిచేసిన మంచినీటిని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంచినీరు అవసరం ఉన్న పరిశ్రమల నుంచి దరఖాస్తులు ఆహ్వానించాలని, వారికి ప్రత్యేకంగా పైపులైన్లు వేసి నిరంతరం నీటి సరఫరా చేయాలని అదేశించారు. మిషన్ భగీరథకు కేటాయించిన 80 టి.ఎం.సిల నీటిలో పది శాతం (8 టిఎంసీలు) పరిశ్రమలకు అందించనున్నారు.హైదరాబాద్ నగర మంచినీటి అసవరాల కోసం పది టిఎంసీల డెడికేటెడ్ రిజర్వాయర్ కడుతున్నారు. అక్కడినుంచి పరిశ్రమలకు నీరు అందించనున్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు కూడా మిషన్ భగీరథ ద్వారానే మొత్తం నీటిని సరఫరా చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను కోరారు.

పేదలు ఆత్మగౌరవంతో జీవించడానికి ‘డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు’

కూడు, గూడు, గుడ్డ అనేవి మనిషికి ప్రాథమిక అవసరాలు. నాగరికత అభివృద్ధి చెందిన నేటి కాలంలో అవి ప్రజల ఆత్మగౌరవానికి నిదర్శనాలు. ఏదో ఒకటి అనే స్థాయినుంచి తాము కోరుకున్నదే ఎంచుకునే స్థాయికి సమాజం చేరుకుంటున్నది. ఈ నేపథ్యంలో పేదలకు నివాసం అంటే చాలీ చాలని ఇరుకు గది కాదని తెలంగాణ ప్రభుత్వం భావించింది. కనీసం రెండు తరాలకు ఉపయోగపడే విధంగా పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లను పూర్తి ఉచితంగా నిర్మించి ఇవ్వాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగానే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టింది. మొదటి దశలో 2,72,763 ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. అవి నిర్మాణ దశలో ఉన్నాయి.

ఇండ్ల స్వరూపం – మౌళిక సదుపాయాలు: తెలంగాణ ప్రభుత్వం నిరుపేదలకు నివాసయోగ్యంగా, వారి ఆత్మ గౌరవం కాపాడేలా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు (560 చదరపు అడుగులు) నిర్మించి ఇస్తున్నది. ఈ డబుల్ బెడ్ రూం ఫ్లాట్లు, ఇండ్లలో రెండు పడక గదులతోపాటు, హాలు, వంటగది, 2 టాయిలెట్లు ఉంటాయి. ప్రత్యేక కాలనీల్లో కొత్తఇండ్లను నిర్మిస్తున్నారు. మోడల్‌ కాలనీల్లో సీసీ రోడ్లు, రోడ్లకిరువైపులా చెట్లు, ప్రతీ ఇంటిముందూ మొక్కలు నాటుతున్నారు. ఇందుకోసం అదనంగా ఖర్చవుతున్నా ప్రభుత్వమే భరిస్తున్నది. ప్రతీఇంటికి వేర్వురుగా మెట్లు, వాటర్‌ట్యాంక్‌, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటుచేస్తున్నారు.

ఒక్కో యింటికి అయ్యే ఖర్చు : ఈ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూరల్ ప్రాంతాల్లో ఒక్కో ఇంటికి రూ.6.29 లక్షలు ఖర్చు చేస్తున్నది. వీటిలో రూ. 5.04 లక్షలు ఇంటి నిర్మాణానికి, రూ.1.24 లక్షలు మౌలిక సదుపాయాల కోసం ఖర్చుచేస్తున్నారు. అర్బన్ ప్రాంతాల్లో రూ.5.30 లక్షలు, జిహెచ్ఎంసి పరిథిలో రూ.7 లక్షలు (జి+3), రూ. 7.9 లక్షలు (సి+ఎస్+9) ఖర్చు చేస్తున్నది. మోడల్ కాలనీల్లో సీసీ రోడ్లు, రోడ్లకి ఇరువైపులా చెట్లు, ప్రతి ఇంటిముందు మొక్కలు నాటుతున్నారు.

More Press Releases