బ‌యోడైవ‌ర్సిటీ ఫ‌స్ట్ ‌లేవ‌ల్ ఫ్లైఓవ‌ర్‌ ను ప్రారంభించిన తెలంగాణ మంత్రులు

Related image

  • బ‌యోడైవ‌ర్సిటీ ఫ‌స్ట్‌ లేవ‌ల్ ఫ్లైఓవ‌ర్‌ను ప్రారంభించిన మంత్రులు కె.టి.ఆర్‌, స‌బితా ఇంద్రారెడ్డి, న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, ప్ర‌భుత్వ విప్ అరికెపూడి గాంధీ
  • వినియోగంలోకి వ‌చ్చిన ఎస్‌.ఆర్‌.డి.పి ప్యాకేజి -4 కింద రూ. 379 కోట్ల‌తో చేప‌ట్టిన అన్ని ప‌నులు
  • జె.ఎన్‌.టి.యు నుండి బ‌యోడైవ‌ర్సిటీ జంక్ష‌న్ వ‌ర‌కు ట్రాఫిక్ ఫ్రీ ఫ్లో కు క‌లిగిన‌ వెసులుబాటు
హైద‌రాబాద్‌, మే 21:* బ‌యోడైవ‌ర్సిటీ జంక్ష‌న్‌లో రూ.30.26 కోట్ల వ్య‌యంతో నిర్మించిన ఫ‌స్ట్‌లేవ‌ల్ ఫ్లైఓవ‌ర్‌ను గురువారం రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి కె.తార‌క‌రామారావు ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి, న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్, ప్ర‌భుత్వ విప్ అరికెపూడి గాంధీ, ఎంపి రంజిత్ రెడ్డి, జిహెచ్‌ఎంసి క‌మిష‌న‌ర్ డి.ఎస్‌.లోకేష్ కుమార్, సి.ఇ జియాఉద్దీన్‌, ఎస్‌.ఆర్‌.డి.పి ఎస్‌.ఇ వెంక‌ట‌ర‌మ‌ణ‌, స్థానిక కార్పొరేట‌ర్లు త‌దిత‌రులు పాల్గొన్నారు.

హైద‌రాబాద్ న‌గ‌రానికి త‌ల‌మానికంగా దిన‌దినాభివృద్ది చెందుతున్న ఐ.టి-ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్ట్ ఏరియాల‌లో పెరుగుతున్న వాహ‌నాల ర‌ద్దీతో త‌ర‌చుగా నిలిచిపోతున్న ట్రాఫిక్ స‌మ‌స్య‌ను అదిగ‌మించుట‌కై ఎస్‌.ఆర్‌.డి.పి ప్యాకేజి -4 కింద‌ రూ. 379 కోట్ల‌తో ఆరు ప‌నుల‌ను ప్ర‌భుత్వం మంజూరు చేసింది. వాటిలో ఐదు ప‌నులు గ‌తంలోనే పూర్తై ప్రారంభించ‌డం జ‌రిగింది. ఈ ప్యాకేజిలో చివ‌రిదైన ఫ‌స్ట్‌లేవ‌ల్ ఫ్లైఓవ‌ర్‌ను ప్రారంభించ‌డంతో జె.ఎన్‌.టి.యు నుండి బ‌యోడైవ‌ర్సిటీ వ‌ర‌కు దాదాపు 12 కిలోమీట‌ర్ల కారిడార్ వినియోగంలోకి వ‌చ్చి ట్రాఫిక్ ఫ్రీ ఫ్లోకు వెసులుబాటు క‌లిగింది. ఎస్‌.ఆర్‌.డి.పి ప్యాకేజి-4 ప‌నుల‌తో ఈ ప్రాంతం అంత‌ర్జాతీయ స్థాయి న‌గ‌రాల‌కు ధీటుగా క‌నిపిస్తున్న‌ది.

ఎస్‌.ఆర్‌.డి.పి ప్యాకేజి -4 కింద నిర్మించిన ప‌నుల వివ‌రాలు:
*1) రాజీవ్ గాంధీ జంక్ష‌న్:* మెజెస్టిక్ షాపింగ్ మాల్ నుండి మ‌లేషియ‌న్ టౌన్‌షిప్ వ‌ర‌కు రూ.97 కోట్ల 93 ల‌క్ష‌ల  వ్య‌యంతో 1230 పొడ‌వున నిర్మించిన ఈ ఫ్లైఓవ‌ర్ ప‌నులు 2019 ఏప్రిల్ 6న  పూర్త‌య్యాయి. దీంతో జె.ఎన్‌.టి.యు - హైటెక్‌సిటీ మ‌ధ్య వాహ‌నాల రాక‌పోక‌ల‌కు ట్రాఫిక్ ఇబ్బంది తొల‌గింది.

*2) అయ్య‌ప్ప సొసైటి జంక్ష‌న్ అండ‌ర్‌పాస్‌:* రూ.44 కోట్ల 30 ల‌క్ష‌ల‌తో 450 మీట‌ర్ల పొడ‌వున అండ‌ర్‌పాస్ నిర్మించారు. 2018 జ‌న‌వ‌రి 3న ఈ అండ‌ర్ పాస్ ప‌నులు పూర్త‌య్యాయి. దీంతో కొండాపూర్ నుండి అయ్య‌ప్ప సొసైటీ వ‌ర‌కు వెళ్లే వాహ‌నాల‌కు ట్రాఫిక్ స‌మ‌స్య‌లు తొల‌గాయి.

*3) మైండ్‌స్పేస్ జంక్ష‌న్ ఫ్లైఓవ‌ర్:* రూ.80 కోట్ల 23 ల‌క్ష‌ల వ్య‌యంతో 830 మీట‌ర్ల పొడ‌వున‌ నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ప‌నులు 2018 న‌వంబ‌ర్ 9 న పూర్త‌య్యాయి. దీంతో ఇన్‌ఆర్బిట్ మాల్ - ర్యాడిస‌న్ మ‌ధ్య వాహ‌నాల రాక‌పోక‌ల‌కు ఉన్న ట్రాఫిక్ ఇబ్బందులు తొల‌గాయి.

*4) మైండ్‌స్పేస్ జంక్ష‌న్ అండ‌ర్‌పాస్‌:* రూ.51 కోట్ల 41ల‌క్ష‌ల‌తో 365 మీట‌ర్ల పొడ‌వు, 28.8 మీట‌ర్ల వెడ‌ల్పుతో  నిర్మించిన  ఈ త్రీలేన్ అండ‌ర్‌పాస్ ప‌నులు 2018 ఏప్రిల్ 28న పూర్త‌య్యాయి. దీంతో హైటెక్ సిటీ నుండి బ‌యోడైవ‌ర్సిటీ సొసైటీ వ‌ర‌కు ట్రాఫిక్ ఇబ్బందులు తొల‌గాయి.

*5) బ‌యోడైవ‌ర్సిటీ జంక్ష‌న్ సెకండ్ లేవ‌ల్‌ ఫ్లైఓవ‌ర్‌:*    రూ.69.12 కోట్ల వ్య‌యంతో 990 మీట‌ర్ల వెడ‌ల్పుతో నిర్మించిన ఈ త్రీలేన్ ఫ్లైఓవ‌ర్ ప‌నులు 2019 న‌వంబ‌ర్ 4న పూర్త‌య్యింది. దీంతో మెహిదీప‌ట్నం వైపు నుండి మైండ్‌స్పేస్ వైపు వెళ్లే వాహ‌నాలకు  ట్రాఫిక్ ఇబ్బందులు తొల‌గాయి.

*6) బ‌యోడైవ‌ర్సిటీ జంక్ష‌న్ ఫ‌స్ట్‌లేవ‌ల్ ఫ్లైఓవ‌ర్‌:*  రూ.30 కోట్ల 26 ల‌క్ష‌ల‌తో 690 మీట‌ర్ల పొడ‌వున నిర్మించిన ఈ ఫ్లైఓవ‌ర్‌ను నేడు ప్రారంభించ‌డం జ‌రిగింది. గ‌చ్చిబౌలి వైపు నుండి మెహిదీప‌ట్నం వైపు వెళ్లే వాహ‌నాలకు ట్రాఫిక్ ఇబ్బందులు తొల‌గాయి.

More Press Releases