కరోనాపై టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ వినూత్న పోరు

Related image

  • టేకు చెట్టు ఆకుపై కరోనా నియంత్రణ, తప్పనిసరి మాస్క్ అంటూ సందేశం
  • ట్విట్టర్ ద్వారా షేర్ చేసిన ఎంపీ సంతోష్ కుమార్
కరోనా వైరస్ కట్టడి కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తున్న టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ మరో వినూత్న ప్రయత్నం చేశారు. ఓ భారీ టేకు ఆకుపై కరోనా నియంత్రణ చిత్రాలను, సందేశాన్ని పెట్టి ప్రచారంలోకి తెచ్చారు. ఈ కొత్త తరహా ప్రయత్నంలో భాగంగా ఒక టేకు ఆకుపై  తెలంగాణ రాష్ట్ర మ్యాప్ తో పాటు, ముఖ్యమంత్రి కెసిఆర్   చిత్రం అలాగే తప్పనిసరిగా మాస్క్ ని ధరించండి అనే నినాదాన్ని జతచేర్చారు.

చేతిపని ద్వారానే టేకు ఆకుపై అత్యంత ఆకర్షణీయంగా ఈ సందేశాన్ని తయారు చేయడం దీని ప్రత్యేకత. కోవిద్ నియంత్రణ కోసం అందరూ కలిసి రావాలని, ముప్పు ఇంకా పొంచి ఉన్నందున ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా మాస్కు ధరించటంతో పాటు బయటికి వెళ్లినప్పుడు భౌతిక దూరాన్ని పాటించాలని కోరారు. ఈ నియంత్రణ చర్యల ద్వారానే ద్వారానే కోవిద్ వైరస్ ను నివారించగలం అని చెప్పారు.

ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందేశంతో కూడిన ఫోటోలతో పాటు ఒక వీడియో చిత్రాన్ని కూడా తన ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. సంతోష్ కుమార్ చేసిన ఈ వినూత్న ప్రయత్నం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యింది.

More Press Releases