ఇ.ఎస్‌.ఐ ఆసుప‌త్రిని సంద‌ర్శించిన కేంద్ర బృందం

Related image

హైద‌రాబాద్‌, మే 02: జలశక్తి విభాగం అదనపు కార్యదర్శి అరుణ్ భరోక నేతృత్వంలోని కేంద్ర బృందం శ‌నివారం ఎర్ర‌గ‌డ్డలోని ఇ.ఎస్‌.ఐ ఆసుప‌త్రిని సంద‌ర్శించింది. ఈ సంద‌ర్భంగా డీన్ డా.శ్రీ‌నివాస్‌, సూప‌రింటెండెంట్ డా.పాల్‌, ఇత‌ర వైధ్యాధికారుల‌తో క‌లిసి ఇ.ఎస్‌.ఐ ఆసుప‌త్రిలోని వ‌స‌తుల‌ను ప‌రిశీలించారు. కోవిడ్‌-19 పాజిటీవ్ కేసుల‌కు వైద్య సేవ‌లు అందించుట‌కు చేసిన ఏర్పాట్ల గురించి వాక‌బ్ చేశారు. అయితే డీన్ డా.శ్రీ‌నివాస్ మాట్లాడుతూ ఇంత వ‌ర‌కు పాజిటీవ్ కేసులు ఈ ఆసుప‌త్రికి రాలేద‌ని వివ‌రించారు.

అనంత‌రం చ‌ర్ల‌ప‌ల్లిలోని ఫుడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా గోదాంను కేంద్ర బృందం ప‌రిశీలించింది. బియ్యం నిల్వ‌ల గురించి అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ బృందంలో కేంద్ర ప్ర‌జారోగ్య‌శాఖ సీనియ‌ర్ వైద్యులు డా.చంద్ర‌శేఖ‌ర్ గెడం, జాతీయ పోష‌కాహ‌ర సంస్థ డైరెక్ట‌ర్ డా.హేమ‌ల‌త‌, వినియోగ‌దారుల వ్య‌వ‌హారాల శాఖ డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌.ఠాకూర్‌, జాతీయ విప‌త్తు నివార‌ణ సంస్థ అసోసియేట్ ప్రొఫెస‌ర్ శేఖ‌ర్ చ‌తుర్వేదిలు ఉన్నారు.

More Press Releases